విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్టెల్లా కళాశాల లో కామర్స్ విభాగం ఆధ్వర్యం రెండు రోజుల లో “ఆదాయ పన్ను మరియు జీఎస్టీ రిటర్న్స్” పై వర్క్స్ షాపు ను నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా సిస్టర్ ఇన్నాసమ్మ మరియు కరస్పాండెంట్ డాక్టర్ సిస్టర్ లేన క్వాడ్రస్ లు ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా సిఎ జయంత్ ఉప్పలూరు చైర్మన్ (I C A I) విజయవాడ, మరియు వేమూరి వీర పవన్ సెక్రటరీ ICAI మరియు సిఎ రాజేష్ తదితరులు ఆదాయ పన్ను భావనలు, ఆదాయ పన్ను చెల్లింపులు ప్రయోజనాలుఫైల్ దాఖలు చేయడానికి ముందు అన్ని ITRలను ఒక చార్టర్డ్ అకౌంటెంట్ సమీక్షిస్తా రూ అని మరియు పన్ను ఆదా వివరాలు ,పన్ను చెల్లింపు ప్రణాళికలు సిద్ధం చేయటం వంటివి వివరించారు. ఈ రెండు రోజులు వర్క్ షాప్ లో జీ ఎస్ టి దాఖలు ఆదాయ పన్ను చెల్లింపులు కు సంబంధించిన సమ గ్రా సమాచారం విద్యార్ధినుల కు తెలియపరుస్తామని కామర్స్ విభాగాధిపతి పూజిత తెలిపారు 80 మంది కామర్స్ విద్యార్థినులు మరియు కామర్స్ విభాగం ,యం బి ఎ మరియు బి బి ఎ అధ్యాపకులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News