Breaking News

బుడమేరులో వ్యర్థాలు, పూడిక తొలగింపు పనులు ముమ్మరం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వర్షాకాలంలో బుడమేరు కాలువలో నీటి ప్రవాహానికి ఎటువంటి ఆటంకం కలగకుండా విజయవాడ నగరపాలక సంస్థ నిరంతరం వ్యర్థాలు, పూడిక తొలగింపు పనులు చేపడుతోంది. నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు, చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె. అర్జునరావు సూచనలతో బయాలజిస్ట్ సూర్యకుమార్ నాయక్ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం రామకృష్ణాపురం వద్ద బుడమేరు కాలువలో పేరుకుపోయిన పూడిక, వ్యర్థాలను యంత్రాల సహాయంతో తొలగించారు.

ఈ సందర్భంగా బయాలజిస్ట్ సూర్యకుమార్ నాయక్ మాట్లాడుతూ, వర్షపు నీరు వేగంగా ప్రవహించేలా బుడమేరు కాలువను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తున్నామని తెలిపారు. కాలువల్లో చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు వేయకుండా ప్రజలు సహకరించాలని, వ్యర్థాలను నిర్దేశించిన ప్రాంతాల్లో మాత్రమే వేయాలని సూచించారు. వర్షాకాలంలో నీటి ప్రవాహానికి ఆటంకం కలగకుండా నగరంలోని బుడమేరు పరిధిలోని అన్ని కీలక ప్రాంతాల్లో నిరంతర పర్యవేక్షణతో పూడిక, వ్యర్థాల తొలగింపు పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎన్.ఐ.డి. ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ ముందస్తు వేడుకలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *