Breaking News

Telangana

డ్రైవింగ్‌ లైసెన్సులు, వాహన రిజిస్ట్రేషన్లలో నిబంధనలు పాటించాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : డ్రైవింగ్‌ లైసెన్సులు, వాహన రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్ల జారీలో రహదారి భద్రతకు ఉన్న మార్గదర్శకాలను ఆంధ్రప్రదేశ్‌ రవాణా శాఖ ఉల్లంఘిస్తుందని కేంద్ర ప్రభుత్వ రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ పరిధిలోని జాతీయ రహదారి భద్రతా మండలి సభ్యుడు డాక్టర్‌ కమల్‌ సోయ ఆరోపించారు. మంగళవారం గాంధీనగర్‌లోని ఒక హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీ రవాణాశాఖ ద్వారా జారీ చేస్తున్న డ్రైవింగ్‌ లైసెన్సులు, వాహన రిజిస్ట్రేషన్లు సీఎంవీఆర్‌కు అనుగుణంగా జరగటంలేదన్నారు. డ్రైవింగ్‌ లైసెన్సులు, రిజిస్ట్రేషన్‌ …

Read More »

పన్నుపై వడ్డీ రాయతీకి 3 వారాలే గడువు…కమిషనర్ కీర్తి చేకూరి

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం పన్ను బకాయి అంతా ఏక మొత్తంగా చెల్లించిన వారికి కల్పించిన వడ్డీ రాయితీ గడువు మరో 3 వారాలు మాత్రమే ఉంటుందని, నగరంలోని పన్ను బకాయిదార్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నగర కమీషనర్ కీర్తి చేకూరి మంగళవారం ఒక ప్రకటన ద్వారా తెలియచేశారు. ఈ సందర్భంగా కమిషనర్ నగర ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పన్ను బకాయి అంతా ఏక మొత్తంగా చెల్లించిన వారికి వడ్డీ రాయితీ ప్రకటించిందని, నగర పజలు ఈ …

Read More »

విపత్తు స్పందన మరియు అగ్నిమాపక శాఖ మరియు సెబ్ శాఖలపై సమీక్ష నిర్వహించి దిశా నిర్దేశం చేసిన జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీ శ

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : విపత్తు స్పందన మరియు అగ్నిమాపక శాఖ మరియు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్) శాఖలపై జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీ శ సమీక్షించి దిశా నిర్దేశం చేశారు. మంగళవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్ నందు విపత్తు నిర్వహణ మరియు అగ్నిమాపక శాఖ మరియు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్) శాఖలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. సంబంధిత జిల్లా ఫైర్ అధికారి రమణయ్య వివరిస్తూ విపత్తు స్పందనలో భాగంగా వరదలు, తుఫాన్లు, అగ్ని …

Read More »

7న మెగా జాబ్ మేళా

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీకాళహస్తి లోని ఆక్స్ ఫర్డ్ డిగ్రీ కళాశాల నందు 07-03-2024 తేదీ న జాబ్ మేళా నిర్వహించబడును. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి లోని ఆక్స్ ఫర్డ్ డిగ్రీ కళాశాల నందు 07-03-2024 తేదీ అనగా గురువారం నాడు మెగా జాబ్ మేళా నిర్వహించబడును. ఈ మెగా జాబ్ మేళాకు వివిధ రంగాలకు చెందిన 13 బహుళ జాతీయ కంపెనీలు లలో ఉద్యోగాల కొరకు ఇంటర్వ్యూలు నిర్వహించబడును. విద్యా అర్హతలు: 5th Class/10th …

Read More »

నేడు జరిగిన ద్వితీయ సంవత్సరం ఇంటర్ ఇంగ్లీష్ పేపర్ -2 పబ్లిక్ పరీక్షలకు 27575 మంది విద్యార్థులు హాజరు: ఆర్.ఐ. ఓ

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో జరుగుతున్న ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సర పబ్లిక్ పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా జరిగాయని, ఈ రోజు జరిగిన పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 27575 మంది విద్యార్థులు హాజరయ్యారని ఆర్.ఐ. ఓ జీ.వి.ప్రభాకర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా 87 జనరల్, 14 వొకేషనల్ కేంద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంగ్లీష్ పేపర్-2 పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు జనరల్ 27,052 మంది, ఒకేషనల్లో 1,178మంది మొత్తం 28,230 …

Read More »

పొలిటికల్ పార్టీలతో సమీక్ష సమావేశం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో మంగళవారం 80- సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తమ ఛాంబర్ లో రాజకీయ పార్టీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముందుగా గతంలో నిర్వహించిన పొలిటికల్ పార్టీ సమావేశంలో రాజకీయ పార్టీలు ప్రతిపాదించిన అంశాలపై అధికారులు తీసుకున్న చర్యలుపై వివరించారు తదుపరి సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోగల 26 పోలింగ్ కేంద్రాల పేర్లలో నెలకొన్న స్వల్ప సవరణల …

Read More »

బీసీల వెన్నుపోటుదారుడు జగన్ రెడ్డి : పోతిన వెంకట మహేష్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మంగళగిరి వేదికగా జరిగిన ‘జయహో బీసీ’ బహిరంగ సభ కార్యక్రమంలో జనసేన పార్టీ అధికార ప్రతినిధి, పార్టీ విజయవాడ నగర అధ్యక్షుడు పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ.. “జగన్ ప్రభుత్వ హయాంలో గడచిన ఐదేళ్లలో ఒక్క పథకాన్ని ప్రవేశపెట్టకపోగా, ఉన్న పథకాలన్నీ రద్దు చేశారు. నా బీసీ.. నా బీసీ అనే హక్కు ఈ ముఖ్యమంత్రికి లేదు. బీసీలంతా మనకున్నఆదరణ, పెళ్లికానుక, ఫీజు రీఎంబర్స్ మెంటు, సబ్సిడీ రుణాలు లాంటి పథకాలన్నీ ఎందుకు రద్దు చేశాడో జగన్మోహన్ …

Read More »

బీసీలను శాసించే స్థాయికి తీసుకెళ్తాం

-ఎస్సీ, ఎస్టీల మాదిరే బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం అవసరం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలకు వెన్నెముక బీసీ కులాలే. బీసీ కులాలు లేని సమాజాన్ని మనం ఊహించుకోలేము. జనాభాలో అత్యధిక శాతం ఉండి కూడా బీసీల ప్రాణ రక్షణకు చట్టాలు చేసుకునే పరిస్థితి దాపురించింది అంటే దానికి కారణం బీసీల్లోని అనైక్యత. బీసీలు ఐక్యతతో ఉంటే ఏ వైసీపీ భూతానికీ భయపడాల్సిన అవసరం లేదు. ఐక్యంగా ఉంటేనే ఆ భూతాన్ని ఎదుర్కోగలం’ అని జనసేన పార్టీ అధ్యక్షులు …

Read More »

గుడ్లవల్లేరు మండలం కౌతవరంలో విస్తృతంగా పర్యటిస్తున్న ఎమ్మెల్యే కొడాలి నాని

-వీధి వీధినా బ్రహ్మరథం పడుతూ స్వాగతం పలుకుతున్న ప్రజానికం….. -రూ.61.80లక్షలతోనిర్మించిన సచివాలయం…R.B.K కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే కొడాలి నాని నాని -భారీ జనవాహిని మధ్య గ్రామంలో కొనసాగుతున్న ఎమ్మెల్యే కొడాలి నాని పర్యటన…. మరిన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న ఎమ్మెల్యే గుడ్లవల్లేరు, నేటి పత్రిక ప్రజావార్త : గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలో ఎమ్మెల్యే కొడాలి నాని మంగళవారం సాయంత్రం విస్తృతంగా పర్యటిస్తున్నారు.గ్రామ సెంటర్లో ఎమ్మెల్యే కొడాలి నానికు గజమాలలు వేస్తూ, పూల వర్షం కురిపిస్తూ వైఎస్ఆర్సిపి నాయకులు, గ్రామ పెద్దలు ఘన స్వాగతం …

Read More »

హోంమంత్రి తానేటి వనిత ఆధ్వర్యంలో జనసేన నుంచి వైఎస్సార్సీపీలో చేరిన పలు కుటుంబాలు..

నల్లజర్ల, నేటి పత్రిక ప్రజావార్త : నల్లజర్ల మండలం ఆవపాడు గ్రామంలో రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత సమక్షంలో జనసేన పార్టీ నుంచి వైసీపీలోకి పలు కుటుంబాలు చేరాయి. యువతకు వైసిపి కండువాలు కప్పి హోం మంత్రి తానేటి వనిత పార్టీలోకి ఆహ్వానించారు. గ్రామంలో తోట నరేంద్ర, షేక్ రహిం, షేక్ బాబీ, బదిరెడ్డి ప్రసాద్, గందిపము జాను, కండెళ్ళి రాజేష్, ఈర్లపాటి ప్రసన్న తదితర కుటుంబాలు జనసేన నుండి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరాయి. …

Read More »