Breaking News

Monthly Archives: July 2024

రాజమండ్రీ ఎంపి పురంధేశ్వరి ని మర్యాద పూర్వకంగా కలిసిన కలెక్టర్ ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం సాయంత్రం తూర్పు గోదావరీ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజమండ్రీ పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ని స్ధానిక జె ఎన్ రోడ్డు లోని ఎంపి క్యాంపు కార్యాలయం లో మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియ చేసి పుష్పగుచ్ఛం అందచేసారు. ఈ సందర్భంగా జిల్లాలో చేపట్టవలసిన అభివృద్ది, పర్యటక పరంగా అభివృది, తదితర అంశాలపై చర్చించడం జరిగింది.

Read More »

గ్రామ, పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేక శానిటేషన్ చర్యలు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : వాతావరణ మార్పు లు, సీజనల్ పరిస్థితుల నేపథ్యంలో గ్రామ, పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేక శానిటేషన్ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంపీడీవోలు మున్సిపల్ కమిషనర్లు మండల ప్రత్యేక అధికారులతో శానిటేషన్ నిర్వహణ సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ అంశాలపై కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ , వాతావరణ పరిస్థితుల మార్పుల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు వ్యాపించే అవకాశం నివారించేందుకు శానిటేషన్ …

Read More »

“రోడ్డు ప్రమాదాల నివారణ” పై అవగాహన కార్యక్రమం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ రాజమహేంద్రవరం నందు చైర్మన్ మరియు జిల్లా జడ్జ్ ఇంచార్జ్ 1 వ అదనపు జిల్లా జడ్జ్ ఆర్. శివ కుమార్ జిల్లా రవాణా శాఖ అధికారులు మరియు ట్రాఫిక్ పోలీసు అధికారుల సమన్వయంతో రాజమహేంద్రవరం కి చెందిన న్యాయమూర్తులు, కోర్టు సిబ్బందికి, “రోడ్డు ప్రమాదాల నివారణ” పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 1 వ అదనపు జిల్లా జడ్జ్ ఆర్. శివ కుమార్ మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ …

Read More »

పనిచేసే ప్రదేశంలో మహిళల పై లైంగిక వేధింపులను నిరోధించే దిశగా కమిటీలు

-జిల్లాస్థాయి, మండల స్థా యిలోను ఏర్పాటు చేసాం. -జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పని చేసే ప్రదేశంలో మహిళల పై లైంగిక వేధింపులను నిరోధించే దిశగా జిల్లా, మండల స్థాయి లోను కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు. పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేదింపుల చట్టం – 2013 (నివారణ, నిషేథము మరియు పరిహారం) పై మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో  …

Read More »

వినియోగదారునికి ఉచిత ఇసుకను అందించే క్రమంలో మార్గదర్శకాలు ఖచ్చితంగా అమలు

-జిల్లా, డివిజనల్ స్థాయిలో కమిటీల ఏర్పాటు -ఎస్కలేషన్ (త్రవ్వకాలు) రవాణా, పరిపాలనా పరమైన చార్జీలు వసూలు -ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ విధానంలో ఇసుక సరఫరా -స్టాక్ పాయింట్, డిసిల్టేషన్ పాయింట్స్ వద్ద అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణ -స్టాక్ పాయింట్స్ వద్ద సి సి కెమెరాల నిఘా వ్యవస్థ -గరిష్టంగా ఒక వ్యక్తికి 20 మెట్రిక్ టన్నుల వరకు మాత్రమే అనుమతి -డి ఎల్ ఎస్ ఎ ఛైర్మన్/ కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన …

Read More »

ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుంది

-45 వ వార్డు  ఆర్ అండ్ బి వర్క్ షాప్ స్థలంలో ఉన్న వాంబే కాలనీలో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకుంటున్న.. -సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని, ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్న తన దృష్టికి వస్తే తక్షణమే పరిష్కరించే విధంగా తీసుకోవడం జరుగుతుందని రాజమండ్రి సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) పేర్కొన్నారు శనివారం స్థానిక పేపరుమిల్లు సమీపంలో 45 వ వార్డు ఆర్ …

Read More »

పెంపుడు జంతువులను ప్రేమించే  వారందరూ క్రమం తప్పకుండా వాటికి వ్యాక్సినేషన్  తప్పనిసరిగా వేయించాలి.

-పశు వైద్యశాలలో  పెంపుడు జంతువులకు ఉచిత వ్యాక్సినేషన్ అందిస్తున్న కార్యక్రమాన్ని ప్రజల సద్వినియోగం చేసుకోవాలి. -ఏరియా పశు వైద్యశాలలో నిర్వహించు అంతర్జాతీయ జూనోసిస్ డే కార్యక్రమాన్ని ప్రారంభించిన.. -సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పెంపుడు జంతువులను ప్రేమించే ప్రతి ఒక్కరూ వాటి ఆరోగ్యంతో పాటు వాటి నుంచి మనుషులకు వ్యాధులు సంక్రమించకుండా ఉండేందుకు సకాలంలో వ్యాక్సినేషన్ అందించాలని రాజమండ్రి సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) పిలుపునిచ్చారు. ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా స్థానిక ఏరియా …

Read More »

ఏపీకి ప్రత్యేక హోదాపై సీఎం చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి పెంచాలి…

-ఏపీ, తెలంగాణ సీఎంల చర్చలు పారదర్శంగా ఉండాలి – సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రకటించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రంపై ఒత్తిడి పెంచాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ శనివారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. దీనికి అనుగుణంగా రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు ఒకే గొంతు వినిపించాలని విజ్ఞప్తి చేశారు. సీఎం చంద్రబాబు రెండు రోజుల పాటు ఢల్లీిలో పర్యటించి ప్రధాని మోదీని, కేంద్ర మంత్రులను కలిసి ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి …

Read More »

రెవిన్యూ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి జిల్లా అభివృద్ధికి తోడ్పడాలి…

మచిలీపట్నం,  నేటి పత్రిక ప్రజావార్త : రెవిన్యూ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి జిల్లా అభివృద్ధికి తోడ్పడాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ, డిఆర్ఓ చంద్రశేఖర రావు లతో కలిసి ఆర్డీవోలు, తహసిల్దార్లతో భూముల అలీనేషను, ముటేషన్, నీటి పన్ను వసూలు, సమగ్ర కుల ధ్రువీకరణ పత్రాలు జారీ తదితర రెవిన్యూ అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. …

Read More »

ఈనెల 8 నుంచిఉచిత ఇసుక విధానం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఉచిత ఇసుక విధానం ఈ నెల 8వ తేదీ సోమ‌వారం నుంచి జిల్లాలో ప‌టిష్టంగా అమ‌లుచేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శ‌నివారం రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నీర‌భ్ కుమార్ ప్ర‌సాద్‌ ఉచిత ఇసుక విధానం అమలుపై అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్ల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. జిల్లా క‌లెక్ట‌ర్ అధికారుల‌తో క‌లిసి క‌లెక్ట‌రేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం అమ‌లుచేసేందుకు ప్రభుత్వ విధి …

Read More »