Breaking News

సీఎం సహాయనిధికి నాలుగు కోట్ల రూపాయల విరాళం… 

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
నాడు నేడు పధకం రెండో విడతలో భాగంగా నాలుగు మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో (తెనాలి, కంచికచర్ల, వీరులపాడు, అచ్యుతాపురం, పరవాడ) రాష్ట్ర ప్రభుత్వం  ఏర్పాటు చేస్తున్న మౌలిక సదుపాయాల కల్పన నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధికి లారస్‌ ల్యాబ్స్‌ తరపున నాలుగు కోట్ల రూపాయల విరాళం. మూడు, నాలుగు విడతల్లో అదే మండలాల్లోని మిగిలిన పాఠశాలల్లో నేరుగా లారస్‌ ల్యాబ్స్‌ మౌలిక సదుపాయాలు ఏర్పాటుచేయనున్నట్లు రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి కంపెనీ ప్రతినిధులు తెలియచేసారు. విరాళానికి సంబంధించిన చెక్కును, సంబంధించిన పత్రాలను బుధ‌వారం ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం  వైఎస్‌ జగన్‌కు లారస్‌ ల్యాబ్స్‌ సీఈవో డాక్టర్‌ చావా సత్యనారాయణ. ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ చావా కృష్ణ చైతన్య,సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ చావా నరసింహరావు, పాల్గొన్న కనెక్ట్‌ టూ ఆంధ్ర సీఈవో వి. కోటేశ్వరమ్మకు అందజేసారు.

Check Also

యువతకు వినూత్న మరియు భవిష్యత్తు నైపుణ్యాలపై సీడ్ యాప్ సంస్థ లో వర్క్‌షాప్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పరిశ్రమతో రాష్ట్ర యువతను మమేకం చేసే లక్ష్యంతో వారికి శిక్షణ అందించి మెరుగైన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *