Breaking News

APSRTC ఉద్యోగులకు గుడ్ న్యూస్… ఇకపై డిజిటల్ ప్రివిలేజ్ బస్ పాస్‌లు

-ప్రివిలేజ్ బస్ పాస్‌లకు ఇక క్యూలకు గుడ్‌బై
-HRMSలో ఒక్క క్లిక్‌తో ప్రివిలేజ్ బస్ పాస్
-ఉద్యోగి సేవల్లో మరో మైలురాయి – కంప్యూటరీకృత బస్ పాస్ విధానం
-డిజిటల్ APSRTC దిశగా మరో కీలక అడుగు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
APSRTC ఉద్యోగులకు ప్రివిలేజ్ బస్ పాస్‌ల జారీ ప్రక్రియను మరింత పారదర్శకంగా, సులభతరంగా, వేగవంతంగా మార్చేందుకు2026 ఆగస్టు 1వ తేదీ నుంచి HRMS ద్వారా కంప్యూటరీకృత ప్రివిలేజ్ బస్ పాస్ విధానాన్నిఅమల్లోకి తీసుకువచ్చినట్లు APSRTC యాజమాన్యం తెలిపింది. ఈ మేరకుసర్క్యులర్ నెం. PD-07/2026, తేదీ 31.07.2026ద్వారా మార్గదర్శకాలు జారీ చేయబడినట్లు పేర్కొంది.
ప్రస్తుత నిబంధనల ప్రకారం రెగ్యులర్ ఉద్యోగులకు ప్రతి క్యాలెండర్ సంవత్సరంలో మూడు సెట్ల ప్రివిలేజ్ బస్ పాస్‌లు, అర్హత కలిగిన కాంట్రాక్ట్, క్యాజువల్ డ్రైవర్లు, కండక్టర్లకు ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల మేరకు బస్ పాస్‌లు యథావిధిగా అందుబాటులో ఉంటాయని తెలిపింది. బస్ పాస్‌ల అర్హత, చెల్లుబాటు, ఇతర నిబంధనల్లో ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేసింది.
కొత్త విధానంలో ఉద్యోగులHRMSలో నమోదైన వివరాల ఆధారంగానేబస్ పాస్‌లు జారీ చేయనున్నందున, ప్రతి ఉద్యోగి తనకు సంబంధించినకుటుంబ సభ్యుల వివరాలు, జనన తేదీలు, సంప్రదింపు వివరాలుసక్రమంగా HRMSలో నమోదు చేయబడి ఉన్నాయో లేదో తప్పనిసరిగా ధృవీకరించుకోవాలని సూచించింది. అవసరమైన మార్పులు సంబంధిత యూనిట్/డిపో ద్వారా వెంటనే చేయించుకోవాలని కోరింది.

కంప్యూటరీకృత విధానంలో ఉద్యోగి స్టాఫ్ నంబర్ నమోదు చేసిన వెంటనే బస్ పాస్ అర్హత వివరాలు తెరపై కనిపించడంతో పాటు, బస్ పాస్ ఆన్‌లైన్‌లో రూపొందించి, సంబంధిత PD సూపర్వైజర్ ఆమోదం అనంతరం ముద్రించి జారీ చేయబడుతుంది. ఉద్యోగి ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న యూనిట్ ఆధారంగానే బస్ పాస్ జారీ చేయబడుతుంది.2026 ఆగస్టు 1వ తేదీ నుంచి మాన్యువల్ ప్రివిలేజ్ బస్ పాస్‌ల జారీ పూర్తిగా నిలిపివేయబడుతుంది.
బస్ పాస్ వినియోగం పూర్తయిన అనంతరం దానిని సంబంధిత అధికారులకు తిరిగి అప్పగించడం ఉద్యోగుల బాధ్యత అని, నిర్దేశిత గడువులో తిరిగి ఇవ్వని పక్షంలో అమలులో ఉన్న నిబంధనల ప్రకారం రికవరీ చర్యలు చేపట్టబడతాయని యాజమాన్యం తెలిపింది.
ఈ కొత్త విధానం విజయవంతంగా అమలయ్యేలా అన్ని యూనిట్ అధికారులు, PD సూపర్వైజర్లు, ఎస్టాబ్లిష్‌మెంట్ సిబ్బంది అవసరమైన సహకారం అందించాలని ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొంది. అలాగే నోటీస్ బోర్డులు, గేట్ మీటింగ్‌లు తదితర మార్గాల ద్వారా ఉద్యోగుల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించింది.
ఉద్యోగులందరూ తమ HRMS వివరాలను సకాలంలో నవీకరించుకొని, కంప్యూటరీకృత ప్రివిలేజ్ బస్ పాస్ విధానాన్ని విజయవంతం చేయడంలో సహకరించాలని APSRTC యాజమాన్యం విజ్ఞప్తి చేసింది. ఈ చర్య ఉద్యోగులకు మరింత వేగవంతమైన, పారదర్శకమైన మరియు సాంకేతిక ఆధారిత సేవలను అందించే దిశగా మరో ముందడుగని పేర్కొంది.
కంప్యూటరీకృత ప్రివిలేజ్ బస్ పాస్ విధానం అమలుతో బస్ పాస్‌ల జారీలో పారదర్శకత, వేగం, ఖచ్చితత్వం మరింత పెరగడంతో పాటు ఉద్యోగులకు సులభమైన సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఉద్యోగులందరూ తమ HRMS వివరాలను ఎప్పటికప్పుడు నవీకరించుకోవడంతో పాటు, ప్రివిలేజ్ బస్ పాస్‌ల వినియోగానికి సంబంధించిన నిబంధనలను పాటించి, ఈ నూతన వ్యవస్థ విజయవంతమైన అమలుకు సహకరించాలని APSRTC యాజమాన్యం విజ్ఞప్తి చేసింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎన్.ఐ.డి. ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ ముందస్తు వేడుకలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *