Breaking News

మాస శివరాత్రిని పురస్కరించుకుని శివయ్యకు ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రత్యేక పూజలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పరమశివునికి ప్రీతిపాత్రమైన మాస శివరాత్రిని పురస్కరించుకుని బుధవారం శివాలయాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. గవర్నర్ పేటలోని శ్రీ కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ దేవస్థానం భక్తజన సంద్రమైంది. తెల్లవారు జామునుంచే పెద్ద సంఖ్యలో భక్తులు శివయ్యను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి మహాశివుడిని ప్రసన్నం చేసుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థానంలో నిర్వహించిన సర్వదేవతా హోమాలు, పూర్ణాహుతిలో సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు పాల్గొన్నారు. తొలుత ఆలయ ప్రాంగణంలోని విఘ్నాధిపతికి ఆది పూజ నిర్వహించారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య స్వామి వారికి రుద్రాభిషేకం నిర్వహించారు. మాస శివరాత్రిని పురస్కరించుకుని అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని మల్లాది విష్ణు అన్నారు. సృష్టి లయకారుడు, ఓంకార స్వరూపుడైన శంకరుని భక్తి ప్రపత్తులతో ధ్యానిస్తే కష్టాలన్నీ తొలగిపోయి.. సకల శుభాలు కలుగుతాయన్నారు. ఆ ముక్కంటి కరుణా కటాక్షాలు నియోజకవర్గ ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని కాంక్షించారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. తదనంతరం వేదపండితులు ఆశీర్వచనాలు పలికి పరమశివుని తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో డివిజన్ ఇంఛార్జి ఆత్మకూరు సుబ్బారావు, డివిజన్ కోఆర్డినేటర్ ఒగ్గు విక్కీ, నాయకులు అంగిరేకుల నాగేశ్వరరావు, భోగాది మురళి, రత్నారావు, మానం వెంకటేశ్వరరావు, సౌమ్య బాబు, ధర్మకర్తల మండలి ఛైర్మన్ వడ్డి వాసు, ఈవో సాంబశివరావు, భక్తులు పాల్గొన్నారు.

Check Also

స్వచ్చంద సంస్థలు యాంటి బర్త్ కంట్రోల్ (ఏబిసి)కి సహకరించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో వీధి కుక్కల నియంత్రణకు స్వచ్చంద సంస్థలు యాంటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *