Breaking News

ప్రజలందరూ స్నేహాభావంతో, మానవ దృక్పధంతో కలిసి మెలిసి జీవించాలి… : మేదర సురేష్ కుమార్ 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రపంచ దేశాల్లోని ప్రజలందరూ స్నేహాభావంతో, మానవ దృక్పధంతో కలిసి, మెలిసి జీవించాలని బైబిల్ లో ఉందని వరల్డ్ హీలింగ్ డే రాష్ట్ర కో ఆర్డినేటర్ మేదర సురేష్ కుమార్ తెలిపారు. బుధవారం విజయవాడ ప్రెస్ క్లబ్ లో ప్రపంచ హీలింగ్ డే ను పురస్కరించుకొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మేదర  సురేష్ కుమార్ మాట్లాడుతూ 148 దేశాలు ప్రపంచ పుస్తక దినోత్సవం ని జరుపుకుంటూ మానవులందరూ కలిసిమెలసి జీవించాలని ఇప్పుడున్న ఈ సమయంలో ఎన్నో కుటుంబాలు కొన్ని వ్యాధుల వలన ఇబ్బంది పడుతున్న కుటుంబాల కోసం వారి కుటుంబాలకు స్వస్థత చేకోరాలని  ఏసుప్రభు బోధించారని తెలిపారు.  ఏసుక్రీస్తు బోధనలు అనుసరించడం వల్ల కుటుంబానికి ప్రేమ, కుటుంబ ఐక్యత , శాంతి ప్రేమ కరుణ కలిగి ఉంటారని అన్నారు. బిషపు మంగళ పూడి జోసఫ్, పాస్టర్ మరియదాసు, బాబు, పిల్ల వెంకట తదితరులు పాల్గొన్నారు

Check Also

సమాజ సేవలో స్వచ్ఛంధ సంస్థలు భాగస్వామ్యం కావాలి

-కలక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం కలెక్టరేట్ లో “మదర్ థెరీసా చారిటబుల్ సొసైటి”, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *