-రాజధానిలో వ్యాపార రంగం పుంజుకుంటుంది : ఎంపి కేశినేని శివనాథ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ బందర్ రోడ్డు లో బృహస్పతి ల్యాబ్ గ్రోన్ డైమండ్ జ్యువలరీ మెగా షోరూమ్ ను శనివారం ఎంపి కేశినేని శివనాథ్ , ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తో కలిసి ప్రారంభించగా, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం షోరూమ్ అధినేతలు శ్రీరాం సీతారామ్మూర్తి, శ్రీరాం జయరాముడు ఎంపి కేశినేని శివనాథ్ సత్కరించారు. ఈ సందర్భంగా కేశినేని చిన్ని మాట్లాడుతూ గత ఐదేళ్లుగా విజయవాడలో వ్యాపారస్తులు వ్యాపారం చేయటానికి ఆసక్తి చూపించలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని ప్రాంతం విజయవాడలో వ్యాపారస్తులు వ్యాపారం చేయటానికి ముందడుగు వేస్తున్నారు.ఇది శుభపరిణామమని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా సతీమణి సుజాత పాల్గొన్నారు.