Breaking News

Tag Archives: delhi

దేశవ్యాప్తంగా సిజేరియన్ డెలివరీల పెరుగుదలపై లోక్‌సభలో ప్రశ్నించిన ఎంపీ గురుమూర్తి

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి లోక్‌సభ సభ్యులు మద్దిల గురుమూర్తి నేడు పార్లమెంట్‌లో దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో సిజేరియన్ డెలివరీలు అధికంగా జరుగుతున్న అంశంపై కీలక ప్రశ్న లేవనెత్తారు. ఇది తల్లులు, శిశువులు, వారి కుటుంబాలను ఆందోళనకు గురిచేస్తున్న ప్రజా సమస్య అని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్‌రావు జాదవ్ లోక్‌సభలో సమాధానం ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం, గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో …

Read More »

ట్రామా కేర్ సేవలను మరింత బలోపేతం చేయడానికి దేశవ్యాప్తంగా 14 అత్యుత్త‌మ కేంద్రాలు (Centres of Excellence) ఏర్పాటు

-రెండు సంవత్సరాల్లో రూ.1.78 కోట్ల నిధులు – 212 మందికి పైగా వైద్య సిబ్బందికి శిక్షణ -కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్‌రావు గణపత్రావ్ జాదవ్ వెల్ల‌డి -ట్రామా కేర్ సేవ‌ల నిర్వహణకు అందిస్తున్న మద్ద‌తు పై ప్ర‌శ్నించిన ఎంపీ కేశినేని శివ‌నాథ్ (చిన్ని) న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ట్రామా కేర్ సేవలను మరింత బలోపేతం చేయడానికి దేశవ్యాప్తంగా 14 ప్రముఖ ఆసుపత్రులు / సంస్థలను అత్యుత్త‌మ కేంద్రాలు (CoE) గా ఏర్పాటు చేసిన‌ట్లు కేంద్ర ఆరోగ్య, …

Read More »

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ లేని పి.బి.టి.జి గృహాల కోసం రూ.8.37 కోట్లు మంజూరు, రూ.0.36 కోట్లు విడుదల

-కేంద్ర విద్యుత్‌ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్‌ యెస్సో నాయక్ వెల్ల‌డి -ఆంధ్రప్రదేశ్‌లో సౌర లైట్లు గిరిజన గృహాల విద్యుదీకరణపై ప్ర‌శ్నించిన ఎంపీకేశినేని శివ‌నాథ్ (చిన్ని) ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ లేని పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ( పి.బి.టి.జి) గృహాల కోసం రూ.8.37 కోట్లు మంజూరు చేయగా, ఇప్పటివరకు రూ.0.36 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర విద్యుత్‌ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్‌ యెస్సో నాయక్ వెల్ల‌డించారు. దేశవ్యాప్తంగా ఈ పథకం కింద మొత్తం రూ.44.1 కోట్లు …

Read More »

ఆంధ్రప్రదేశ్ రైల్వే అభివృద్ధిపై ఎంపీ కేశినేని శివ‌నాథ్ కీలక ప్రతిపాదనలు

-రాష్ట్రపతి ప్రసంగ ధన్యవాద తీర్మానానికి ఎంపీ కేశినేని శివ‌నాథ్ మద్దతు ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగంపై లోక్ స‌భ‌లో బుధ‌వారం ప్ర‌వేశ‌పెట్టిన ధన్యవాద తీర్మానానికి ఎంపీ కేశినేని శివ‌నాథ్ సంపూర్ణ మద్దతు తెలిపారు. రాష్ట్ర‌ప‌తి ప్రసంగం దేశం దేశం మౌలిక వసతుల ఆధారిత అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందనే అంశం ప్ర‌తిబింబిస్తోంద‌న్నారు. ఈ మేర‌కు ఎంపీ కేశినేని శివ‌నాథ్ ప్ర‌సంగం (లెడ్ ఆన్ ది టెబుల్) స‌భ‌కు దాఖ‌లు చేశారు. ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర‌మోదీ దూరదృష్టి గల నాయకత్వంలో …

Read More »

‘ఫాదర్ ఆఫ్ ఆల్ డీల్స్’గా పేర్కొనబడుతున్న భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందం ఖరారు కావడం ఒక చారిత్రాత్మక మైలురాయి

– భారత ఉత్పత్తులపై అమెరికా టారిఫ్‌లను 18 శాతానికి తగ్గించడం ఎగుమతుల రంగానికి పెద్ద ఊతం : ఫియో అధ్యక్షుడు న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త: ‘ఫాదర్ ఆఫ్ ఆల్ డీల్స్’గా అభివర్ణించబడుతున్న భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందం ఖరారైనందుకు భారత ఎగుమతి సంస్థల సమాఖ్య (ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎగ్జ్‌పోర్ట్ ఆర్గనైజేషన్స్ – FIEO) హృదయపూర్వక స్వాగతం పలికింది. ఈ ఒప్పందం ప్రకారం భారతదేశంలో తయారైన అన్ని ఉత్పత్తులపై అమెరికా విధించే టారిఫ్‌లను 18 శాతానికి తగ్గించేందుకు అమెరికా అంగీకరించింది. ఇది ఇరు దేశాల …

Read More »

ఏపీలో శాంతి భద్రతలు విఫలం – కేంద్రం జోక్యం కావాలని వైఎస్ఆర్‌సీపీ ఎంపీల డిమాండ్

-పార్లమెంటు అవతరణంలో నిరసన తెలిపిన వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త: కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు లక్ష్యంగా దాడులు, అక్రమ కేసులు పెరిగిపోయాయని వెరసి శాంతి భద్రతలు విఫలమయ్యాయని వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం పార్లమెంటు ఆవరణంలో ప్లకార్డులతో నిరసన చేపట్టారు. ఇళ్లు, కార్లు తగులబెట్టడం, తప్పుడు కేసులు నమోదు చేసి వేధించడం వంటి దుశ్చర్యలు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నాయని తెలిపారు. రాజ్యాంగ పాలనకు బదులు సొంతంగా రూపొందించుకున్న ‘రెడ్ బుక్ …

Read More »

విబి జి రామ్ జి కార్మికుల వేతనాలపై స్పష్టత కోరిన తిరుపతి ఎంపీ గురుమూర్తి

ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త: వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్ గ్రామీణ్ (విబి జి రామ్ జి) పథకం కింద గ్రామీణ కార్మికులకు అందించే వేతనాలు, పథక అమలుకు సంబంధించిన పలు అంశాలపై తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి పార్లమెంటులో ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కమలేష్ పాశ్వాన్ సమాధానం ఇచ్చారు. విబి జి రామ్ జి చట్టం 2025లోని సెక్షన్ 10 ప్రకారం, ఈ పథకానికి సంబంధించిన వేతన రేట్లను కేంద్ర …

Read More »

విజ‌య‌వాడ ఎయిర్ పోర్ట్ నిర్మాణ పనుల్లో చిన్న కాంట్రాక్టరులు న‌ష్ట‌పోకుండా ఎంపీ కేశినేని శివ‌నాథ్ చ‌ర్య‌లు

-ఆగిపోయిన బిల్లుల‌కు నిధులు మంజూరు చేయాల‌ని కేంద్ర మంత్రి రామ్మోహ‌న్ నాయుడుకి విజ్ఞ‌ప్తి -ఎంపీ కేశినేని శివ‌నాథ్ ఆధ్వ‌ర్వంలో కేంద్ర మంత్రి రామ్మోహ‌న్ నాయుడును క‌లిసిన గోల్డ్ మెడ‌ల్ డైరెక్ట‌ర్ ప్ర‌వీణ్ కుమార్ జైన్ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త: విజ‌య‌వాడ ఎయిర్ పోర్ట్ అంతర్జాతీయ టెర్మిన‌ల్ నిర్మాణ పనులకి సంబంధించి కాంట్రాక్ట‌ర్ మార‌టంతో….చిన్న చిన్న కాంట్రాక్ట‌ర్లు ఇబ్బంది ప‌డ‌కుండా ఎంపీ కేశినేని శివ‌నాథ్ త‌గు చ‌ర్య‌లు చేప‌ట్టారు. మంగ‌ళ‌వారం పార్ల‌మెంట్ లో కేంద్ర పౌర విమానాయ‌న శాఖ మంత్రి రామ్మోహ‌న్ నాయుడును ఆయ‌న …

Read More »

టిడిపి ఎంపీల‌కు లోక్ స‌భ స్పీక‌ర్ ఓం బిర్లా తేనీటి విందు

-హాజ‌రైన ఎంపీలు కేశినేని, వేమిరెడ్డి , తెన్నేటి, మాగుంటి, బైరెడ్డి -తొలిసారి సభకు వచ్చిన వారికి ఎక్కువ అవ‌కాశం ఇవ్వాల‌ని ఎంపీలు విజ్ఞ‌ప్తి -సానుకూలంగా స్పందించిన లోక స‌భ స్పీక‌ర్ ఓంబిర్లా ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త: లోక స‌భ స్పీక‌ర్ ఓంబిర్లా పార్ల‌మెంట్ లోని త‌న కార్యాల‌యంలో మంగ‌ళ‌వారం సాయంత్రం టిడిపి ఎంపీల‌కు ఇచ్చిన తేనీటి విందుకు బాప‌ట్ల ఎంపీ లోక్‌సభ ప్యానెల్ స్పీకర్‌ తెన్నేటి ప్ర‌సాద్, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి , ఒంగోలు ఎంపీ మాగుంటి శ్రీనివాసులు రెడ్డి, …

Read More »

కార్మికుల భద్రత, ఆరోగ్య రక్షణపై లోక్‌సభలో ఎంపీ గురుమూర్తి ప్రశ్న

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త: పారిశ్రామిక రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల భద్రత, ఆరోగ్య రక్షణపై తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి సోమవారం లోక్‌సభలో ప్రశ్నించారు. వృత్తిపరమైన భద్రత, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్–2020 అమలులో కార్మికుల భద్రత కోసం తీసుకుంటున్న చర్యలపై, ముఖ్యంగా నిర్మాణ రంగం, గనులు, కాంట్రాక్ట్ కార్మికులు వంటి ప్రమాదకర రంగాల్లో భద్రతా ఏర్పాట్లపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రశ్నకు కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే సమాధానం ఇస్తూ, 13 కేంద్ర …

Read More »