న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) బుధవారం ఢిల్లీలోని డీఆర్డీఓ భవన్లో భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) ఛైర్మన్ డాక్టర్ సమీర్ విక్రాంత్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ శివనాథ్, డీఆర్డీఓ ఛైర్మన్కు తిరుపతి ప్రసాదం అందజేశారు. వీరిద్దరూ రక్షణ రంగానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఎపి నూతన రాజధాని అమరావతి లో భాగమైన విజయవాడ పరిసర ప్రాంతాలు పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి రక్షణ ఉత్పత్తి పరిశ్రమలను ఏర్పాటు చేయాలని ఎంపీ …
Read More »Tag Archives: delhi
ఏపీలో భూగర్భఉష్ణ శక్తి ఉత్పత్తి ప్లాంట్ ప్రతిపాదనలు లేవు
-కేంద్ర మంత్రి శ్రీపాద యశో నాయక్ వెల్లడి -ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) అడిగిన ప్రశ్నకు సమాధానం న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్లో భూగర్భఉష్ణ శక్తి (Geothermal Energy) ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటుకు ఎలాంటి ప్రతిపాదనలు లేవని కేంద్ర విద్యుత్, నూతన పునరుత్పాదక ఇంధన శాఖ సహాయ మంత్రి శ్రీపాద యశో నాయక్ వెల్లడించారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు బుధవారం ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. భూఉష్ణ శక్తిపై పరిశోధనలు, దేశవ్యాప్త అధ్యయనం భారత ప్రభుత్వం …
Read More »కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురి అధ్యక్షతన జరిగిన ఎన్డీయే ఎంపిల సమావేశానికి ఎంపి కేశినేని శివనాథ్ హాజరు
ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి అధ్యక్షతన జరిగిన ఎన్డీయే ఎంపిల సమావేశంలో విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ పాల్గొన్నారు. ఎన్డీయే ప్రభుత్వం ఎన్డీయే కూటమిలోని పార్లమెంట్ సభ్యుల నియోజకవర్గాల సమస్యలు, కేంద్ర పథకాల అమలు, నిధుల అవసరాల గురించి తెలుసుకునేందుకు కేంద్రమంత్రులకు కొంతమంది ఎంపిలను గ్రూపులుగా అప్పగించి ప్రతి మూడు నెలలకొకసారి సమావేశం కావాలని ఆదేశించింది. కేంద్రమంత్రి హార్టీప్ సింగ్ కి అధ్యక్షతన వున్న ఎన్డీయే ఎంపిల గ్రూపులో …
Read More »పార్లమెంట్ లో అరకు కాఫీ స్టాల్స్ ను సందర్శించిన ఎంపి కేశినేని శివనాథ్
ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) పార్లమెంట్ లో సంగం 1, 2 కోర్ట్ యార్డ్ వద్ద ఎపి గిరిజన సహకార సంఘం ఏర్పాటు చేసిన అరకు కాఫీ స్టాల్స్ ను మంగళవారం సందర్శించారు. అరకు కాఫీ తాగటంతో పాటు అరకు బ్రాండ్ కాఫీ ప్యాకెట్ ను కొనుగోలు చేశారు. అలాగే కాఫీ స్టాల్స్ సిబ్బంది తో కాసేపు మాట్లాడి అరకు కాఫీ కి దక్కుతున్న ఆదరణ గురించి అడిగి తెలుకున్నారు. అరకు కాఫీ బ్రాండ్ను ప్రోత్సహించేందుకు …
Read More »భూసార పరీక్షల్లో ఎపిలో 1.42 కోట్ల మంది రైతులకు లబ్ధి
-కేంద్ర వ్యవసాయం, రైతుల సంక్షేమ శాఖ సహాయ మంత్రి రామనాథ్ ఠాకూర్ వెల్లడి -మొబైల్ భూసార పరీక్షా ప్రయోగశాలల పై ప్రశ్నించిన ఎంపి కేశినేని శివనాథ్ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : నేల ఆరోగ్యం, విత్తనోత్పత్తి పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మట్టి నమూనాలను పరీక్షించి, రైతులకు భూసార పరీక్ష కార్డులు (సాయిల్ హెల్త్ కార్డ్లు, ఎస్హెచ్సి) పంపిణీ చేస్తుంది. ఇప్పటి వరకు ఏపీలో భూసార నిర్ధారణ నిమిత్తం 38,58,795 మట్టి నమూనాలను పరీక్షించగా 1,42,57,644 మంది రైతులకు లబ్ధి చేకూరిందని …
Read More »2023-24 లో ఏపీ లైబ్రరీ అథారిటీ నుంచి నిధుల మంజూరు కోరుతూ ఎలాంటి ప్రతిపాదన రాలేదు
-కేంద్ర సంస్కృతి ,పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వెల్లడి -జాతీయ గ్రంథాలయాల మిషన్ (NML) పథకంపై ప్రశ్నించిన ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని), ఎంపి దగ్గుమళ్ళ ప్రసాద రావు ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ లో గత మూడేళ్లలో రాజా రామ్మోహన్ రాయ్ గ్రంథాలయ ఫౌండేషన్ (RRRLF) ద్వారా 61 గ్రంథాలయాలు మాత్రమే సహాయం పొందాయి. 2021-22 లో 22 గ్రంథాలయాలు, 2022-23 లో 21 గ్రంథాలయాలు, 2023-24 లో 18 గ్రంథాలయాలు రాజా రామ్మోహన్ రాయ్ గ్రంథాలయ …
Read More »ఈ.ఎస్.డి.పి పథకం ద్వారా కొత్త పరిశ్రమలకు ప్రత్యక్ష ఆర్థిక మద్దతు వుండదు
-కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సుశ్రీ శోభ కరంద్లాజే వెల్లడి -ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని), ఎంపి దగ్గుమళ్ల ప్రసాదరావు అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వకంగా సమాధానం ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : గత ఐదేళ్లలో ఎంత మంది పారిశ్రామికవేత్తలు శిక్షణ పొందారని, వారిలో మహిళా పారిశ్రామికవేత్తలు ఎంత మంది ఉన్నారని, ఎంటర్ప్రెన్యూర్షిప్ కమ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కాంపోనెంట్ కింద గత ఐదేళ్లలో ఎన్ని కొత్త ఎంటర్ప్రైజెస్కు అనుమతి ఇచ్చారని లోక్ సభలో గురువారం ఎంపీ …
Read More »తానా సభలకు విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ కు ఆహ్వానం
ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) రెండేళ్లకోసారి నిర్వహించే మహాసభలకు రావాల్సిందిగా విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) ను తానా సంఘం ప్రతినిధులు ఆహ్వానించారు. తానా సంఘం ప్రతినిధులు ఢిల్లీలో గురువారం ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) ను ఈ ఏడాది జులై 3 నుంచి 5 వరకు అమెరికాలోని డెట్రాయిట్లో జరిగే తానా 24వ ద్వై వార్షిక మహాసభలకు రావాల్సిందిగా ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా తానా చేస్తున్న సేవా కార్యక్రమాలను ఎంపి …
Read More »ఢిల్లీలో బిల్ గేట్స్ తో ఏపి సిఎం చంద్రబాబు భేటీ
-ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం – గేట్స్ ఫౌండేషన్ మధ్య అవగాహన ఒప్పందం -ఆరోగ్య, వ్యవసాయ, విద్య రంగాల్లో టెక్నాలజీ వినియోగంపై గేట్స్ ఫౌండేషన్ తో ఒప్పందం -బిల్ గేట్స్ ను రాష్ట్రానికి ఆహ్వానించి ముఖ్యమంత్రి చంద్రబాబు న్యూ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గేట్స్ ఫౌండేషన్ తో ఒప్పందం చేసుకుంది. పరిపాలనతో పాటు వివిధ శాఖల్లో టెక్నాలజీ ఆధారిత కార్యక్రమాలను అమలు చేయడానికి అవగాహన ఒప్పందం చేసుకుంది. ఆరోగ్య సంరక్షణ, మెడ్టెక్, విద్య, వ్యవసాయ రంగాల్లో ఖర్చు తగ్గింపు, ఉపాధి కల్పన …
Read More »సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికిన ఎంపి కేశినేని శివనాథ్
ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి ఢిల్లీ విమానాశ్రయంలో విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ పార్టీ సహచర ఎంపిలతో కలిసి స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం రాత్రి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కుమార్తె వివాహా కార్యక్రమానికి హాజరు కానున్నారు.
Read More »
Prajavartha Online Telugu News