Breaking News

Tag Archives: delhi

భూసార ప‌రీక్ష‌ల్లో ఎపిలో 1.42 కోట్ల మంది రైతులకు లబ్ధి

-కేంద్ర వ్యవసాయం, రైతుల సంక్షేమ శాఖ సహాయ మంత్రి రామనాథ్ ఠాకూర్ వెల్ల‌డి -మొబైల్ భూసార ప‌రీక్షా ప్ర‌యోగ‌శాల‌ల పై ప్ర‌శ్నించిన ఎంపి కేశినేని శివ‌నాథ్ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : నేల ఆరోగ్యం, విత్తనోత్పత్తి పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మట్టి నమూనాలను పరీక్షించి, రైతులకు భూసార పరీక్ష కార్డులు (సాయిల్ హెల్త్ కార్డ్‌లు, ఎస్‌హెచ్‌సి) పంపిణీ చేస్తుంది. ఇప్పటి వరకు ఏపీలో భూసార నిర్ధారణ నిమిత్తం 38,58,795 మట్టి నమూనాలను పరీక్షించగా 1,42,57,644 మంది రైతులకు లబ్ధి చేకూరిందని …

Read More »

2023-24 లో ఏపీ లైబ్ర‌రీ అథారిటీ నుంచి నిధుల మంజూరు కోరుతూ ఎలాంటి ప్ర‌తిపాదన రాలేదు

-కేంద్ర సంస్కృతి ,పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వెల్ల‌డి -జాతీయ గ్రంథాలయాల మిషన్ (NML) పథకంపై ప్ర‌శ్నించిన ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని), ఎంపి దగ్గుమళ్ళ ప్రసాద రావు ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ లో గ‌త మూడేళ్ల‌లో రాజా రామ్మోహన్ రాయ్ గ్రంథాలయ ఫౌండేషన్ (RRRLF) ద్వారా 61 గ్రంథాల‌యాలు మాత్ర‌మే స‌హాయం పొందాయి. 2021-22 లో 22 గ్రంథాలయాలు, 2022-23 లో 21 గ్రంథాలయాలు, 2023-24 లో 18 గ్రంథాలయాలు రాజా రామ్మోహన్ రాయ్ గ్రంథాలయ …

Read More »

ఈ.ఎస్.డి.పి పథకం ద్వారా కొత్త ప‌రిశ్ర‌మ‌ల‌కు ప్ర‌త్య‌క్ష ఆర్థిక మ‌ద్ద‌తు వుండ‌దు

-కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ స‌హాయ‌ మంత్రి సుశ్రీ శోభ కరంద్లాజే వెల్ల‌డి -ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని), ఎంపి ద‌గ్గుమ‌ళ్ల ప్ర‌సాద‌రావు అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వకంగా సమాధానం ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : గత ఐదేళ్లలో ఎంత మంది పారిశ్రామికవేత్తలు శిక్షణ పొందారని, వారిలో మహిళా పారిశ్రామికవేత్తలు ఎంత మంది ఉన్నారని, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కమ్ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం కాంపోనెంట్ కింద గత ఐదేళ్లలో ఎన్ని కొత్త ఎంటర్‌ప్రైజెస్‌కు అనుమతి ఇచ్చారని లోక్ సభలో గురువారం ఎంపీ …

Read More »

తానా సభలకు విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ కు ఆహ్వానం

ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఉత్త‌ర అమెరికా తెలుగు సంఘం (తానా) రెండేళ్ల‌కోసారి నిర్వ‌హించే మ‌హాస‌భ‌ల‌కు రావాల్సిందిగా విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) ను తానా సంఘం ప్ర‌తినిధులు ఆహ్వానించారు. తానా సంఘం ప్ర‌తినిధులు ఢిల్లీలో గురువారం ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) ను ఈ ఏడాది జులై 3 నుంచి 5 వరకు అమెరికాలోని డెట్రాయిట్‌లో జరిగే తానా 24వ ద్వై వార్షిక మ‌హాస‌భ‌ల‌కు రావాల్సిందిగా ఆహ్వాన పత్రాన్ని అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా తానా చేస్తున్న సేవా కార్య‌క్ర‌మాల‌ను ఎంపి …

Read More »

ఢిల్లీలో బిల్ గేట్స్ తో ఏపి సిఎం చంద్రబాబు భేటీ

-ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం – గేట్స్ ఫౌండేషన్ మధ్య అవగాహన ఒప్పందం -ఆరోగ్య, వ్యవసాయ, విద్య రంగాల్లో టెక్నాలజీ వినియోగంపై గేట్స్ ఫౌండేషన్ తో ఒప్పందం -బిల్ గేట్స్ ను రాష్ట్రానికి ఆహ్వానించి ముఖ్యమంత్రి చంద్రబాబు న్యూ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గేట్స్ ఫౌండేషన్ తో ఒప్పందం చేసుకుంది. పరిపాలనతో పాటు వివిధ శాఖల్లో టెక్నాలజీ ఆధారిత కార్యక్రమాలను అమలు చేయడానికి అవగాహన ఒప్పందం చేసుకుంది. ఆరోగ్య సంరక్షణ, మెడ్‌టెక్, విద్య, వ్యవసాయ రంగాల్లో ఖర్చు తగ్గింపు, ఉపాధి కల్పన …

Read More »

సీఎం చంద్ర‌బాబుకు స్వాగ‌తం ప‌లికిన ఎంపి కేశినేని శివ‌నాథ్

ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : రెండు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం ఢిల్లీ విచ్చేసిన ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కి ఢిల్లీ విమానాశ్ర‌యంలో విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ పార్టీ స‌హ‌చ‌ర ఎంపిల‌తో క‌లిసి స్వాగ‌తం ప‌లికారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు మంగ‌ళ‌వారం రాత్రి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కుమార్తె వివాహా కార్య‌క్రమానికి హాజ‌రు కానున్నారు.

Read More »

గ‌త ఐదేళ్ల‌లో ఎపికి ఎన్.బి.హెచ్.ఎమ్ కింద మంజూరైన ప్రాజెక్ట్ ఒక్క‌టే, ప్ర‌యోజ‌నం పొంద‌ని ఎఫ్‌.పి.వోలు

-కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ స‌హాయ మంత్రి రామ‌నాథ్ ఠాకూర్ వెల్ల‌డి -జాతీయ తేనెటీగ‌ల పెంప‌కం, తేనె మిష‌న్ (ఎన్.బి.హెచ్.ఎమ్) పై ప్ర‌శ్నించిన ఎం.పి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ తేనెటీగ‌ల పెంప‌కం, తేనె మిష‌న్ (ఎన్.బి.హెచ్.ఎమ్) 2020-21 నుండి అమలవుతుంది. ఇప్ప‌టి వ‌రకు దేశ‌వ్యాప్తంగా ఎన్.బి.హెచ్.ఎమ్ కింద 298 ప్రాజెక్టులు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (FPOs) 51 మంజూర‌య్యాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ కి గ‌త ఐదేళ్ల‌లో ఎన్.బి.హెచ్.ఎమ్ కింద ఒక్క ప్రాజెక్టు మంజూరు కాగా, ఒక్క …

Read More »

రాష్ట్ర‌ప‌తి అల్పాహార విందుకు హాజరైన‌ ఎంపి కేశినేని శివ‌నాథ్

ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతి భవన్ లో ఇచ్చిన అల్పాహార విందు కార్యక్రమంలో కేంద్ర ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ , స్పీకర్ ఓం బిర్లా, బి.జె.పి జాతీయ అధ్యక్షుడు ఎంపి జెపి న‌డ్డా, కేంద్ర‌మంత్రులు, స‌హ‌చ‌ర‌ ఎంపిల‌తో క‌లిసి విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) సోమ‌వారం పాల్గొన్నారు. రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌దీ ముర్ము ఈ అల్పాహార విందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ , కేర‌ళ‌, క‌ర్ణాట‌క‌, హార్యానా రాష్ట్రాల‌కు చెందిన ఎంపిల‌ను ఆహ్వానించారు. ఈ విందులో …

Read More »

ఆంధ్రప్రదేశ్‌లో గిరిజన సంక్షేమానికి పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థల ప్రతిపాదనల సంఖ్య 15

-కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి దుర్గాదాస్ ఉకే వెల్ల‌డి -గిరిజ‌న‌ సంక్షేమం కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలకు అంద‌జేసే స‌హాయ నిధి పై ప్ర‌శ్నించిన ఎంపి కేశినేని శివ‌నాథ్ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో గిరిజన సంక్షేమానికి పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థల (VOs)కు అందజేసే ‘సహాయం నిధి’ పథకం కింద 2022-23 నుంచి 2024-25 (07.03.2025) వ‌ర‌కు ఆమోదించబడిన ప్రతిపాదనలు 15 మాత్ర‌మే.ఈ కాలంలో ఎపికి 12 ఎన్జీవోలు, 15 ప్రాజెక్టులు మంజూరు చేసిన‌ట్లు కేంద్ర గిరిజన …

Read More »

2021-2025 మ‌ధ్య ఎపికి ఏడు ఇంక్యుబేట‌ర్లు, 46 స్టార్టప్‌లు ఎంపిక

-కేంద్ర వాణిజ్య ప‌రిశ్ర‌మ శాఖ స‌హాయ మంత్రి జితిన్ ప్రసాద్ వెల్ల‌డి -ఇంక్యుబేట‌ర్స్ అండ్ స్టార్ట‌ప్స్ పై కేంద్ర వాణిజ్య ప‌రిశ్ర‌మ‌ల మంత్రిత్వ‌శాఖ‌ను ప్ర‌శ్నించిన ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ (SISFS) కింద దేశ‌వ్యాప్తంగా 31 జ‌న‌వరి 2025 నాటికి మొత్తం 217 ఇంక్యుబెట‌ర్లు ఎంపిక చేయ‌బ‌డ్డాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో 7 ఇంక్యుబెట‌ర్లు , 46 స్టార్ట‌ప్ లు ఎంపిక అయ్యాయి. ఎంపికైన 7 ఇంక్యుబేట‌ర్ల‌కు రూ. 29.40 కోట్లు …

Read More »