ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త :
ఒంగోలు నగరం సౌత్ బైపాస్ నందు చల్ల రాజా ధన వర్మ కొత్తగా పెట్టిన నయర క్రాంతి ఫ్యూయల్ స్టేషన్ పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న ఆల్ ఇండియా పోర్ట్ ట్రాస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ( AIPTWF ) ఏపీ ఛైర్మన్ షేక్ ఖలీఫా తుల్లా బాషా ప్రారంభించినారు. ఈ సందర్బంగా షేక్ ఖలీఫా తుల్లా బాషా మాట్లాడుతూ సోదరుడు చల్ల రాజా ధన వర్మ ఏర్పాటు చేసిన నయర పెట్రోల్ బంక్ దిన దిన అభివృద్ధి చెందుతూ లాభాలా బాటలో నడవాలని దివిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పెట్రోల్ బంకులో ఉన్నా కార్మిక సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం కార్మిక శ్రేయస్సు కోసం అందిస్తున్న ఈ శ్రామ్ కార్డులను ఏర్పాటు చేస్తాము అనీ అన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం వెల్ఫర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ రఫీ, BJMC ప్రకాశం జిల్లా అధ్యక్షులు పఠాన్ సాజిద్ ఖాన్, షేక్ ఆహీత్ తదితరులు ఉన్నారు. అనంతరము నయర పెట్రోల్ బంక్ ప్రొపరైటర్ చల్లా రాజా ధనవర్మ షేక్ ఖలీఫా తుల్లా బాషా ని ఘనముగా సత్కరించారు.
Prajavartha Online Telugu News