– క్షేత్రస్థాయి అధికారులు సమన్వయంతో పనిచేయాలి: ఇన్ఛార్జ్ కలెక్టర్ డా. నిధి మీనా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లాలో గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ (పీసీ, పీఎన్డీటీ) చట్టం పటిష్టంగా అమలయ్యేలా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ఆల్ట్రా సౌండ్ స్కానింగ్ ప్రక్రియ దుర్వినియోగం కాకుండా పటిష్ట నిఘా కొనసాగించాలని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ డా. నిధి మీనా సూచించారు. శనివారం కలెక్టరేట్లో జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ డా. నిధి మీనా అధ్యక్షతన లింగ నిర్ధారణ …
Read More »Daily Archives: November 16, 2024
ధాన్యం కొనుగోలులో రైతులకు పూర్తి భరోసా
– అధికారులు పటిష్ట సమన్వయంతో క్రియాశీలంగా పనిచేయాలి. – విజయవాడ డివిజన్ పరిధిలో 45 కొనుగోలు కేంద్రాలు. – ధాన్యం సేకరణ విధానంపై రైతులకు పూర్తి అవగాహన కల్పించాలి. – విజయవాడ ఆర్డీవో కావూరి చైతన్య విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రైతు శ్రేయస్సు దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ధాన్యం కొనుగోలులో అధికారులు పటిష్ట సమన్వయంతో క్రియాశీలంగా పనిచేయాలని విజయవాడ ఆర్డీవో కావూరి చైతన్య అన్నారు. శనివారం విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్డీవో చైతన్య.. ఖరీఫ్ (2024-25) ధాన్యం …
Read More »అమ్మ సౌందర్యమే శాశ్వతం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సమాజ హితమే భక్తికి పరమార్థం కావాలని, అప్పుడే కనకదుర్గాదేవి అనుగ్రహం లభిస్తుందని ప్రముఖ ప్రవచనకర్త పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ గరికిపాటి నరసింహారావు అన్నారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఇంద్రకీలాద్రి ఎస్ కే పి వి హిందూ హైస్కూల్ కమిటీ సంయుక్త నిర్వహణలో రెండు రోజులపాటు నిర్వహించనున్న ప్రవచన కార్యక్రమం శనివారం కేబీఎన్ కళాశాలలో ప్రారంభమైంది. గరికపాటి మాట్లాడుతూ అమ్మవారి సౌందర్యం మాత్రమే శాశ్వతమైందని, మిగిలినదంతా ఎప్పటికైనా రూపుమాసిపోతుందన్నారు. దుర్గా అనే పదాన్ని …
Read More »గోదావరి పుష్కరాలు 2027 ఏర్పాట్లపై మేధో మథనం
-జిల్లా కలెక్టర్ అధ్యక్షతన అధికారులతో సమావేశం -శాఖల వారి చేపట్టే పనులపై కమిటి ల వారీగాసమీక్ష -జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాబోయే 2027 పుష్కరాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారని, అందుకు అనుగుణంగా నియమించిన కమిటీ లు ముందస్తు కార్యాచరణతో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో ఇప్పటి నుంచే ఏర్పాట్ల కోసం సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆదేశించారు. శనివారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో …
Read More »గృహ లబ్దిదారులతో సంఘాలు ఏర్పాటు చెయ్యండి
-లబ్దిదారులతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలి -ఆదివారం ఒకరోజు లబ్దిదారులు అర్జీలు పరిష్కారం కోసం అందుబాటులో ఉండాలి -కలెక్టర్ పి. ప్రశాంతి రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : పేదలందరికీ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసేలా డిసెంబరు నెల చివరి నాటికి 2333 ఇళ్ల నిర్మాణ లక్ష్యం కాగా ఇప్పటి వరకూ 306 (13 శాతం) పూర్తి చెయ్యడం జరిగిందని , మిగిలిన లక్ష్యాలు సాధించడానికి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. శనివారం వెలుగుబంద హౌసింగ్ కాలనీ …
Read More »ఫంక్షన్ హాల్స్, కళ్యాణ మండపాలు, హోటల్స్ యజమానులతో పోలీస్ కమిషనర్ ఎస్ వి రాజ శేఖర బాబు సమావేశం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరములో మరియు పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ఫంక్షన్ హాల్స్, కళ్యాణ మంటపాలు, బొంకేట్ హాల్స్ లో జరుగుచున్న వివాహములు/బర్త్ డే/ఇతర కార్యక్రమములు జరుగు సందర్భములలో సదరు ఫంక్షన్ హాల్స్ పరిసర ప్రాంతములు మరియు వాటికి వెళ్ళు మార్గములలో ట్రాఫ్ఫిక్ అంతరాయములు గుర్తించిన మీదట, వాటిని పరిష్కారము చేయు ఉద్దేశ్యముతో ఎస్. వి. రాజ శేఖర్ బాబు, ఐ.పి.యస్, ఎన్.టి.ఆర్.జిల్లా పోలీసు కమీషనర్ వారి ఆదేశముల మేరకు ది16-11-2024 వతేదీన పోలీసు కమాండ్ కంట్రోల్ రూమ్ నందు …
Read More »బ్యాంకర్లతో పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు సమావేశం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సమాజంలో వివిధ రకాల సైబర్ నేరాలు జరుగుతున్నాయి, నేరాలు జరిగిన తరువాత దర్యాప్తు చేసేకంటే, అవి జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మరియు సైబర్ ద్వారా జరిగే నేరాల గురించి అవగాహన కల్పించడం ద్వారా నేరాలకు అడ్డుకట్ట వేయాలనే ప్రధాన ఉద్దేశ్యంతో పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు, ఐ.పి.ఎస్., పర్యవేక్షణలో డి. సి. పి. గౌతమి షాలి ఐ. పి. ఎస్., క్రైమ్ డి.సి.పి. తిరుమలేశ్వర రెడ్డి ఐ.పి.ఎస్ ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్లు …
Read More »వికలాంగుల అభ్యర్దనను పరిశీలించి సత్వర న్యాయం జరిగేలా చర్యలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో వికలాంగ వీధి వ్యాపారులకు వ్యాపారాల నిర్వహణలో ఎటువంటి అభ్యంతరాలు లేకుండా సముచిత స్థలాన్ని కేటాయించాలని శనివార సాయంత్రం కమీషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఎ.యస్ ని నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా స్పందించిన కమీషనర్ వికలాంగుల అభ్యర్దనను పరిశీలించి సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. వారికి నగర పాలక సంస్థ గుర్తింపు కార్డులు లేకుండుట గమనించి సోమవారం నుండి నగర పాలక సంస్థ ఏర్పాటు చేసిన …
Read More »వీధులలో సచరించు ఆవులు, దూడలు, గేదెలు, ఎద్దులు నియంత్రణ కొరకు ప్రత్యేక టీములు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగర పాలక సంస్ధ పరిధిలో వీధులలో సచరించు ఆవులు, దూడలు, గేదెలు, ఎద్దులు నియంత్రణ కొరకు శానిటరీ ఇన్ స్పెక్టర్ల పర్యవేక్షణలో 4 ప్రత్యేక టీములను ఏర్పాటుచేసి ప్రతీరోజు 2 వాహనములలో పట్టి వెంగళాయిపాలెం నగర పాలక సంస్ధ వారు ఏర్పాటు చేసిన గోశాలకు తరలించి బందెలదొడ్డి నిర్వహణ జరుగుచున్నది. వీటి సంరక్షణ కొరకు ఆరుగురు వర్కర్లను నియమించి పశుగ్రాసము, మంచినీరు, వైద్యము, ఆహారము అందించుట జరుగుచున్నది. నగర పాలక సంస్ధ చేపడుతున్న ప్రత్యేక చర్యలలో …
Read More »వీధి వ్యాపారులు గుర్తింపు కార్డు కొరకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలోని వీధి వ్యాపారులు గుర్తింపు కార్డు కొరకు దరఖాస్తు చేసుకొనుటకు సోమవారం నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయం మరియు నగర పాలక సంస్థ సర్కిల్ కార్యాలయం నందు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామని ప్రతి ఒక్క తోపుడు బండి వీధి వ్యాపారి గుర్తింపు కార్డు పొందుటకు నగర పాలక సంస్థ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ ఆవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నగర కమీషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఎ.యస్ తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గుంటూరు …
Read More »
Prajavartha Online Telugu News