-దిల్లీలో బాక్సర్ విజేందర్ సింగ్తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి భేటీ
-బాక్సింగ్ అభివృద్ధిపై విజేందర్ సింగ్తో మంత్రి చర్చలు
న్యూ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్లో అంతర్జాతీయ ప్రమాణాలతో బాక్సింగ్ అకాడమీ ఏర్పాటు లక్ష్యంగా రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఢిల్లీలో ప్రముఖ భారత మాజీ బాక్సర్ విజేందర్ సింగ్ బనీవాల్ను మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో బాక్సింగ్ క్రీడాభివృద్ధి, యువతకు ప్రపంచస్థాయి శిక్షణా అవకాశాలు కల్పించడం, అకాడమీ స్థాపనకు సంబంధించిన అంశాలపై ఈ సందర్భంగా వారు చర్చించారు.
Prajavartha Online Telugu News