Breaking News

ఎపి రైస్ మిల్లర్ల సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక అవుట్లెట్ల ద్వారా తక్కువ ధరకు బియ్యం అమ్మకాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక అవుట్లెట్ల ద్వారా తక్కువ ధరకే బియ్యం విక్రయాలు చేస్తున్నట్లు ఏపీ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గుమ్మడి వెంకటేశ్వరరావు తెలిపారు. గురువారం గాంధీనగర్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాలులో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కిలో స్టీమ్ రైస్ ధర రూ.52 మాత్రమే. కిలో రా రైస్ ధర రూ.50కే ఇస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 130 రైతు బజార్లలో ప్రత్యేక బియ్యం కౌంటర్లు ఏర్పాటు చేసి, 500కు పైగా రైస్ మిల్లుల వద్ద కూడా నేరుగా సబ్సిడీ బియ్యం విక్రయిస్తామన్నారు. నిత్యావసరాల ధరల నియంత్రణకు మిల్లర్ల సంఘం సహకారం ఉంటుదని, ప్రజలందరూ ఈ ప్రత్యేక సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు తదితరులు  పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎన్.ఐ.డి. ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ ముందస్తు వేడుకలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *