గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీసీపీడీసీఎల్ డైరెక్టర్ (ప్రాజెక్ట్స్ & హెచ్ఆర్) టీవీఎస్ఎన్ మూర్తి వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంట గ్రామంలోని మలినేని ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పరీక్షా కేంద్రంలో అభ్యర్థులకు కల్పించిన సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు, పరీక్ష నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను డైరెక్టర్ పరిశీలించారు.పరీక్షలు పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. అభ్యర్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.ఈ సందర్శనలో CRDA సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ చల్లా రమేష్, టెక్నికల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హరిబాబు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News