Breaking News

పల్నాడు జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటన

-నర్సరావుపేట జేఎన్ టీయూకే కాలేజీలో నూతన హాస్టల్ భవనాలు ప్రారంభం
-రూ.70 కోట్ల వ్యయంతో విద్యార్థినీ, విద్యార్థులకు వసతి గృహాలు నిర్మాణం

నర్సరావుపేట, నేటి పత్రిక ప్రజావార్త :
పల్నాడు జిల్లాలో బుధవారం విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పర్యటించారు. నర్సరావుపేట మండలం కాకాని గ్రామంలోని జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, కాకినాడ(JNTUK) యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థినీ, విద్యార్థులకు గౌతమి, కృష్ణవేణి, నాగార్జున పేర్లతో నూతనంగా నిర్మించిన మూడు హాస్టల్ భవనాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ముందుగా కళాశాల ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు కాలేజీ యాజమాన్యం, విద్యార్థులు, సిబ్బంది ఘనస్వాగతం పలికారు. అనంతరం రూ.70 కోట్ల వ్యయంతో 1,600 మంది విద్యార్థినీ, విద్యార్థులకు అత్యాధునిక వసతులతో నిర్మించిన నూతన వసతి గృహాలను మంత్రి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం హాస్టల్ మొత్తం కలియతిరిగి వసతులను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, జాయింట్ కలెక్టర్ వి.సంజనా సిమ్హా, జేఎన్ టీయూకే వైస్ ఛాన్సలర్ సీఎస్ఆర్కే ప్రసాద్, రాజ్యసభ ఎంపీ భాష్యం రామకృష్ణ, మంత్రి గొట్టిపాటి రవికుమార్, నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు చదలవాడ అరవిందబాబు, జీవీ ఆంజనేయులు, జూలకంటి బ్రహ్మారెడ్డి, భాష్యం ప్రవీణ్, టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ బీటీ నాయుడు, మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *