రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మంగళవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయస్థాన ఆవరణలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె. ప్రత్యూష కుమారి , వివిధ ఇన్షూరెన్స్ కంపెనీల వారితో ముందస్తు లోక్ అదాలత్ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో సెప్టెంబరు 9వ తేదీన జరగనున్న జాతీయ లోక్ అదాలత్ లో మోటారు వాహనాల యాక్సిడెంట్ కేసుల పరిష్కారానికి సంబంధించి పిటీషనర్లు, ఇన్షూరెన్స్ సంస్థల అధికారులు మరియు ఇరు పక్షాల న్యాయవాదుల మధ్య సమన్వయం కుదిర్చే విధంగా చర్చలు జరిగాయి. రానున్న జాతీయ లోక్ అదాలత్ లో ఎక్కువ మొత్తంలో కేసులు పరిష్కారమయ్యేoదుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి. గంధం సునీత సూచించారు.
Prajavartha Online Telugu News