పెద్దాపురం, నేటి పత్రిక ప్రజావార్త :
శనివారం పెద్దాపురంలోని జవహర్ నవోదయ విద్యాలయాన్ని శనివారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె. ప్రత్యూష కుమారి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయులతో మాట్లాడుతూ విద్యార్థులకు అందిస్తున్న సదుపాయాలు, శిక్షణా ప్రణాళిక తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. సందర్శన సమయంలో పాఠశాల ఆవరణ, ఆట స్థలం, టాయ్ లెట్స్, డార్మిటరీలు, భోజనశాల, వంటశాలను పరిశీలించారు. విద్యార్ధులకు అందిస్తున్న ఆహారం యొక్క రుచిని ప్రత్యూష కుమారి పరిశీలించారు.
Prajavartha Online Telugu News