అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
శుక్రవారం మంత్రులు శాఖలు కేటాయింపు జరిగిన వెంటనే విజయవాడలో అందుబాటులో ఉన్న ఆర్దికశాఖామాత్యులు పయ్యాల కేశవ ని, కలసి ఏపిజేఏసి అమరావతి రాష్ట్రకమిటి తరుపున శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఉద్యోగులు కోరుకున్న ప్రభుత్వం రాష్ట్రంలో నేడు అధికారంలోకి రావడం చాలా ఆనoదంగా ఉందని తెలియజేస్తూ, భవిష్యత్ లో ఉద్యోగులందరికీ మేలుజరుగుతుందని బావిస్తున్నామని ఏపిజేఏసి అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, స్టేట్ సెక్రటరీ జెనరల్ పలిశెట్టి దామోదరరావు, కోశాధికారి వి.వి.మురళికృష్టనాయుడు అన్నారు. ఈ శుభాకాంక్షలు తెలియజేసిన కార్యక్రమంలో ఏపిరేవిన్యూసర్వీసెస్ అసోషియేషన్ కె.రమేష్ కుమార్, ఏపిపోలీస్ అధికార్లు సంఘం రాష్ట్రఅధ్యక్షులు జనకుల శ్రీనివాసరావు, ఏపీ క్లాస్ -IV ఎంప్లాయీస్ అసోషియేషన్ రాష్ట్ర అధ్యక్షులు యస్. మల్లేశ్వరరావు, ఏపి లేబర్ ఆఫీసర్సు అసోషియేషన్ బి.కిశోర్ కుమార్, ఏపీ జెఏసి అమరావతి మహిళా విభాగం చైర్ పర్సన్ శ్రీమతి పారే లక్ష్మి, సెక్రటరీ జెనరల్ శ్రీమతి పొన్నూరు విజయలక్ష్మి, గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు వేల్పుల అర్లయ్య, యన్టీఆర్ జిల్లా రెవిన్యూసర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు/కార్యదర్శి దేవరపల్లి శ్రీనివాస్, బత్తిన రామకృష్ట తధితరులు కలసి శుభాకాంక్షలు ఏపిజేఏసి అమవారతి మరియు అనుబందసంఘాల రాష్ట్రకమిటిల తరుపున శుభాకాంక్షలు తెలియజేసారు.
Tags amaravathi
Check Also
గుంటూరులో అక్టోబర్ 13న ఇండియా పోస్ట్ రన్-2024
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ తపాలా వారోత్సవాల సందర్భంగా అక్టోబర్ 13న గుంటూరులో ఇండియా పోస్ట్ రన్ …