Breaking News

Tag Archives: rajamendri

పెంపుడు జంతువులను ప్రేమించే  వారందరూ క్రమం తప్పకుండా వాటికి వ్యాక్సినేషన్  తప్పనిసరిగా వేయించాలి.

-పశు వైద్యశాలలో  పెంపుడు జంతువులకు ఉచిత వ్యాక్సినేషన్ అందిస్తున్న కార్యక్రమాన్ని ప్రజల సద్వినియోగం చేసుకోవాలి. -ఏరియా పశు వైద్యశాలలో నిర్వహించు అంతర్జాతీయ జూనోసిస్ డే కార్యక్రమాన్ని ప్రారంభించిన.. -సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పెంపుడు జంతువులను ప్రేమించే ప్రతి ఒక్కరూ వాటి ఆరోగ్యంతో పాటు వాటి నుంచి మనుషులకు వ్యాధులు సంక్రమించకుండా ఉండేందుకు సకాలంలో వ్యాక్సినేషన్ అందించాలని రాజమండ్రి సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) పిలుపునిచ్చారు. ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా స్థానిక ఏరియా …

Read More »

ప్రవేటు స్కూల్ నీ తనిఖీ చేసిన ఆర్డీఓ చైత్ర వర్షిణి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి ఫ్రీ సీటు లలో ప్రైవేటు పాఠశాలలో జాయిన్ అయిన విద్యార్థులకు అక్కడ అందచేస్తున్న విద్యా బోధన విధానాన్ని పరిశీలించడం జరిగిందని రాజమండ్రీ రెవిన్యూ డివిజనల్ అధికారి ఏ. చైత్ర వర్షిణి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక లిట్టిల్ ప్యారడైజ్ స్కూల్ ను జిల్లా పాఠశాల విద్యా అధికారి కె. వాసుదేవరావు , ఇతర అధికారులతో కలసి ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సంధర్భంగా ఆర్డీఓ చైత్ర వర్షిణి మిగిలిన విద్యార్థుల తో పాటుగా ఉచిత …

Read More »

మధురపూడి ఎయిర్పోర్ట్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికిన మంత్రి కందుల దుర్గేష్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం మూడు రోజులు పర్యటన సందర్భంగా సోమవారం మధురపూడి విమానాశ్రయానికి విచ్చేసిన సందర్భంగా రాష్ట్ర పర్యాటక, సంస్కృతిక సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి లు మర్యాదపూర్వకంగా కలసి స్వాగతం పలికారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ వద్ద స్వాగతం పలికిన వారిలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, శాసన సభ్యులు బత్తుల బల …

Read More »

ప్రభుత్వ పథకాలు అమలుకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి

-సమన్వయం చేసుకుంటూ సహకారం అందించాలి -కార్యాలయ ఉత్తర ప్రత్యుత్తరాలు “ఈ-ఆఫీసు” లోనే నిర్వర్తించాలి -విధుల నిర్వహణలో అధికారులు జవాబుదారీ తనం కలిగి ఉండాలి -జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాను అభివృద్ది పథంలో నడిపేందుకు , ప్రజా సమస్యల పరిష్కారానికి , ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలు అమలు చేయటం లో అధికారులు సమన్వయం చేసుకోవాలని, పూర్తి స్థాయిలో సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లో కలెక్టరు గా బాధ్యతలు చేపట్టిన …

Read More »

ప్రభుత్వ ప్రాధాన్యత  పథకాలను చివరి లబ్ధిదారుని వరకు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం

-జూలై 1వ తేదీన  ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ సజావుగా నిర్వహిస్తాం. -జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా  త్రాగునీరు శానిటేషన్ పై  ప్రత్యేక దృష్టి సారిస్తాం. -కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలను చివరి లబ్ధిదారుని వరకు అందించాలన్నదే ప్రభుత్వ పధాన లక్ష్యమని ఆ దిశగా జిల్లాలో ప్రభుత్వ అమలు చేస్తున్న కార్యక్రమాలను వేగవంతంగా ప్రజలకు చేరవేయటం జరుగు తుందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పేర్కొన్నారు. శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ లో జాయింట్ …

Read More »

జూలై 1 నుండి ఆగస్టు 31 వరకు డయేరియా నియంత్రణపై ప్రచార కార్యక్రమం

-రానున్న వర్షాకాలం దృష్ట్యా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలి -డయేరియా కేసులు నమోదు కాకుండా తగిన కార్యాచరణ సిద్ధం చేయాలి -కలెక్టరు మాధవీలత సిఎస్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : డయేరియా నియంత్రణపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు జూలై 1వ తేదీ నుండి ఆగస్టు 31 వరకు జిల్లా స్థాయిలో ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని, జిల్లాలో ఒక్క డయేరియా కేసు నమోదు కాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుంచి …

Read More »

సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి నిర్మూలన దినోత్సవం

-సికిల్ సెల్ ఎనీమియా అంటువ్యాధి కాదు. -జన్యుపరంగా తల్లిదండ్రుల నుండి మాత్రమే సంక్రమిస్తుంది. -వ్యాది నివారణకు ఏఎన్ఎం లు అందచేసే మందులు క్రమం తప్పకుండా వాడాలి. -జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. కే. వెంకటేశ్వరరావు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సికిల్ సెల్ ఎనీమియా అంటువ్యాధి కాదని, జన్యుపరంగా తల్లిదండ్రుల నుండి మాత్రమే సంక్రమిస్తుందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. కే. వెంకటేశ్వరరావు అన్నారు. సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి నిర్మూలన దినోత్సవం సందర్బంగా బుధవారం స్థానిక జిల్లా ట్రైబల్ …

Read More »

కేంద్ర కారాగారంలో ఖైదీ సోదరులకు మొక్కల తయారీలో శిక్షణాకార్యక్రమం 

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం కేంద్ర కారాగారములో ఉద్యానవన శాఖ, రాజమహేంద్రవరం మునిసిపల్ కార్పోరేషన్ వారిచే లోపల ఉన్న ముద్దాయిలకు కారాగార పర్యవేక్షణాధికారి శ్రీరామ రాహుల్ ఆధ్వర్యంలో వివిధరకాల పండ్లమొక్కలు, క్రోటాన్స్, పూలమొక్కలు తయారుచేయుట, పెంచుట మరియు నిర్వహించుట, మెళకువలను శిక్షణా తరగతుల యందు ది. 18.06.2024 నుండి 30.06.2024 వరకు మొదటి విడత నిర్వహించుచున్నారు. కె. స్వాతి, అసిస్టెంట్ డైరెక్టర్, రాజమహేంద్రవరం మునిసిపల్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ప్రారంభించి, ముద్దాయిలను ఉద్దేశించి మాట్లాడుతూ మొక్కలను ఎన్నివిధాలు గా అభివృద్ది చేయవచ్చు, …

Read More »

కౌంటింగ్ సూపర్‌వైజర్లు, అసిస్టెంట్ మరియు మైక్రో అబ్జర్వర్‌లకు మొదటి రౌండ్ శిక్షణ

-కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా సిబ్బంది తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలి. -ఎన్నికల ఫలితాలు ప్రకటనలో కౌంటింగ్ సిబ్బంది పనితీరు కీలకం -విధుల్లో భాగంగా సంయమనం పాటించాలి -కలెక్టర్, ఎన్నికల అధికారి  డా. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా సిబ్బంది తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి  డా. మాధవీలత ఆదేశించారు. సోమవారం స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో కౌంటింగ్ సూపర్‌వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, …

Read More »

స్ట్రాంగ్ రూమ్ కి పోస్టల్ బ్యాలెట్ తరలింపు…

రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమండ్రీ రూరల్ నియోజక వర్గ పరిధిలో నీ పోస్టల్ బ్యాలెట్ పత్రాలను స్ట్రాంగ్ రూమ్ లో భద్ర పరుచుట జరిగినదని జాయింట్ కలెక్టర్, రూరల్ ఆర్వో ఎన్ తేజ్ భరత్ తెలియ చేశారు. శుక్రవారం నన్నయ్య యూనివర్సిటీ ఆవరణలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ కి పోస్టల్ బ్యాలెట్ తరలించారు. ఈ సందర్బంగా 2024 సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో 3,033 పోస్టల్ బ్యాలెట్ పత్రాలను న్యాఖ్ భవనంలోనీ రూరల్ నియోజక వర్గ తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ నుంచి …

Read More »