ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త :
ఒంగోలు రెవిన్యూ డివిజన్ అధికారి (ఆర్డీవో) కె.లక్ష్మిప్రసన్నని ఒంగోలులోని వారి కార్యాలయంలో భారతీయ జనతా మజ్దూర్ సెల్ (BJMC) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ ఖలీఫాతుల్లాబాషా మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్బంగా ఒంగోలు నగర శివారున వెంగముక్కపాలెంలో ఉన్న భగీరథ కెమికల్ ఫ్యాక్టరీలో కార్మికుల పలు సమస్యలు తమ దృష్టికి వచ్చాయని దీని పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. భగీరథ కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న అసంఘటిత కార్మికులకు కల్పిస్తున్న సౌకర్యాలు నామమాత్రంగా ఉన్నాయన్న సమాచారంతో పాటు అక్కడి కార్మికులకు PF, ESI లు ఎంతమందికి వర్తిస్తున్నాయో దీనిపై సమగ్ర విచారణ జరిపించి అక్కడి కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. అన్ని రంగాలలో పనిచేస్తున్న అసంఘటిత కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం కార్మికుల భద్రత గుర్తింపునిస్తూ ఈ – శ్రమ్ కార్డును ఇవ్వడం జరిగింది, అయితే ఈ కార్డు గురించి చాలా మందికి తెలియక ఈ – శ్రమ్ కార్డు పొందలేకపోతున్నారని ఒంగోలు రెవిన్యూ డివిజన్ పరిధిలో ఉన్న అసంఘటిత కార్మికులు భద్రత దృష్టిలో ఉంచి తమ సిబ్బందితో అవగాహనా కార్యక్రమం ఏర్పాటు చేసి కార్మికులకు ఈ-శ్రమ్ కార్డులు అందేటట్లు చూడాలని కోరారు. కార్మికుల సమస్యలపై వెంటనే స్పందిస్తూ అసంఘటిత కార్మికుల శ్రేయస్సు భద్రత దృష్టిలో ఉంచి తన పూర్తి సహకారం అందిస్తానని ఆర్డీవో లక్ష్మి ప్రసన్న హామీ ఇచ్చారు.
Prajavartha Online Telugu News