మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా బుధవారం నగరంలోని పిన్నమనేని టీచర్స్ గిల్డ్ భవనంలో జిల్లా స్థాయి యోగా పోటీలు ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. జూనియర్ల విభాగంలో యోగా బృందం ప్రదర్శన, యోగ గీతాలు, స్కిట్, రోల్ ప్లే, చిత్రలేఖనం, సమ్మిళిత వయోబృందం యోగ ప్రదర్శనల పోటీలు జరిగాయి. ఈ కార్యక్రమంలో యోగాంధ్ర జిల్లా సమన్వయకర్త డిప్యూటీ కలెక్టర్ పోతురాజు, జిల్లా ఆయుష్ అధికారి, డాక్టర్ జావేద్ ఖాన్, ఆయుష్ అధికారి డాక్టర్ భాగ్యలక్ష్మి న్యాయ నిర్నేతలు జి కృష్ణ, డాక్టర్ ఉషారాణి, రాగ లత, గాయత్రీ, ప్రెసిస్ యోగా సాధకులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News