-ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి ఆహ్వానం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గొల్లపూడి మార్కెట్ యార్డ్ చైర్మన్ గా నియమితులైన నర్రా వాసు బుధవారం ఎంపీ కేశినేని శివనాథ్ ను గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో కలిశారు. ఈనెల 15వ తేదీన గొల్లపూడి మార్కెట్ యార్డ్ లో జరిగే తన ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేయాల్సిందిగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా నర్రా వాసు శాలువాతో ఎంపీ కేశినేని శివనాథ్ ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాణిజ్య విభాగ అధ్యక్షుడు గూడపాటి పద్మశేఖర్, తోట బాలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News