Breaking News

అస్వస్థతకు గురైన విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందించేందుకు ఆదేశాలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అల్లూరి జిల్లా డంబ్రిగూడ మండలం గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారంతో విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటనపై ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు జిల్లా అధికారులతో మాట్లాడారు. అనారోగ్యంతో అరకులోయ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై జిల్లా అధికారులతో మాట్లాడారు. వారిని అప్రమత్తం చేశారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *