Daily Archives: January 13, 2025

పండుగ పూటా ప్రజాసేవలోనే

-సంక్రాంతి వేడుకలకు కుటుంబ సమేతంగా సొంతూరుకి సీఎం -క్షణం తీరిక లేకుండా అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాలకు హాజరు -సీసీ రోడ్లు, పాఠశాల భవనాలు, విద్యుత్ సబ్ స్టేషన్‌ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన సీఎం -మహిళల స్వయం ఉపాధికి ఈ-ఆటోలు అందజేత -అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల మానసిక వికాసానికి కేర్ అండ్ గ్రో సంస్థతో ఒప్పందం నారావారిపల్లె, నేటి పత్రిక ప్రజావార్త : సంక్రాంతి పండుగకు కుటుంబ సమేతంగా స్వగ్రామం నారావారిపల్లె వెళ్లిన సీఎం చంద్రబాబు అక్కడా తీరిక లేకుండా ప్రజాసేవా కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. సాధారణ …

Read More »

ఎంతో వైభవంగా ధనుర్మాస వ్రత మహోత్సవాలు…

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : బాపూజీ విద్యాలయం నందు,శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో సోమవారం అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి ధనుర్మాస మహోత్సవాలులో 29వ రోజున 29వ పాశురాన్ని శ్రీ స్వామి వారు వివరించారు. అనంతరం గోదాఅమ్మవారికి అష్టోత్తరం, తీర్థప్రసాద గోష్టి, మంగళ శాసనముతో ఈ కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగినది. ధనుర్మాస వ్రత మహోత్సవాలలో ఈరోజు చివరి రోజు కావున అంగరంగ వైభవంగా శ్రీ గోదా రంగనాథ కళ్యాణ మహోత్సవం శ్రీశ్రీశ్రీ తిరగండి చిన్న జీయర్ స్వామి …

Read More »

ఇంద్రకీలాద్రి పై భోగి మంటలతో ప్రారంభమైన సంక్రాంతి వేడుకలు..

-ప్రత్యేక ఆకర్షణ గా బొమ్మలకొలువు -పౌర్ణమి సందర్బంగా గిరి ప్రదక్షిణ కార్యక్రమం -పాల్గొన్న ఆలయ ఈవో కే రామచంద్ర మోహన్ మరియు డిప్యూటీ ఈవో ఎం. రత్నరాజు  -పూర్ణాహుతి తో ముగిసిన శివకామసుందరీ సమేత నటరాజ స్వామి వారి కల్యాణ మహోత్సవం ఇంద్రకీలాద్రి,  నేటి పత్రిక ప్రజావార్త : తేదీ. 13-01-2025 నుండి తేదీ. 15-01-2025 వరకు సంక్రాంతి వేడుకలు సందర్బంగా సోమ‌వారం ‘భోగి’ రోజున ఉదయాన్నే చిన్న రాజ గోపురం వద్ద ఉన్న ప్రాంగణం నందు భోగి మంటలు కార్యక్రమం శాస్త్రోక్తముగా నిర్వహించడం …

Read More »

ఇంద్రకీలాద్రి పై భోగి పండ్లు కార్యక్రమం

ఇంద్రకీలాద్రి,  నేటి పత్రిక ప్రజావార్త : భోగి సందర్బంగా సోమ‌వారం దేవస్థానం మహమండపం 7 వ అంతస్తు నందు పెద్ద రాజగోపురం ఎదురుగా ఉన్న ప్రాంగణం నందు బొమ్మల కొలువు దగ్గరలో విద్యార్థినులచే సంధ్య గొబ్బెమ్మలు ఏర్పాటు చేసి, పూజలు నిర్వర్తించి, గొబ్బి పాటలు పాడి, నృత్యం చేసి, చిన్నారులకు మరియు విధ్యార్థినులకు భోగి పండ్లు పోయు కార్యక్రమం శాస్త్రోక్తముగా నిర్వహించడం జరిగినది. అనంతరం వీరికి ప్రసాదం అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద శర్మ, ఆలయ సిబ్బంది, అర్చక …

Read More »

రాష్ట్రంలో ఎక్కడా పండుగ వాతావరణం లేదు

-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ,  నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో సంక్రాంతి పండుగ వాతావరణం ఎక్కడా కనిపించడం లేదని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. మూడురోజులపాటు జరిగే సంక్రాంతి సంబరాలలో భాగంగా సోమవారం తెల్లవారుజామున బీసెంట్ రోడ్డులో భోగి వేడుకలను మల్లాది విష్ణు ప్రారంభించారు. యువత, మహిళలు కేరింతలు కొడుతూ సందడి చేశారు. తమ కష్టాలు, బాధల్ని అగ్ని దేవుడికి ఆహుతి చేస్తూ సుఖసంతోషాలు ప్రసాదించాలని.. భోగి మంటల చుట్టూ తిరుగుతూ …

Read More »

తెలుగు వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు

-రైతులు అందరూ కూటమి ప్రభుత్వం లో సంతోషంగా ఉన్నారు -గత ప్రభుత్వంలో ఎగ్గొట్టిన సబ్సిడీలు అన్నీ పునరుద్ధరించాం -సూపర్ 6 పథకాలు అమలు చేస్తున్నాం -జగన్ వ్యవహార శైలి మార్చుకోవడం లేదని పార్టీలో అందరూ పారిపోతున్నారు విజయవాడ,  నేటి పత్రిక ప్రజావార్త : సంక్రాంతి ఎవరికో అవగాహన లేకుండా జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారని.. సంక్రాంతి పండుగ అంటేనే రైతుల పండుగన్న విషయం జగన్ తెలుసుకోవాలని సమాచార పౌరసంబంధాలు, గృహ నిర్మాణ శాఖల మంత్రి కొలుసు పార్థసారధి ఎద్దేవ చేశారు. ఎన్జీఆర్ కలెక్టరేట్ లో …

Read More »

రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్రాంతి శుభాకాంక్షలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : మకర సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు నా శుభాకాంక్షలు. తెలుగు వారికి విశిష్టమైన ఈ సంక్రాంతి పండుగ మీ జీవితాల్లో సుఖసంతోషాలు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పాడిపంటలతో విరాజిల్లే పల్లె సీమలు మరింత కళకళలాడాలని, ఆధునికతను సంతరించుకున్నా మరచిపోని మన సాంప్రదాయాలను ఒడిసిపట్టాలని ఆకాంక్షిస్తున్నాను. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే ఈరోజు శాస్త్రపరంగా అన్ని విధాలుగా ప్రాముఖ్యత కలిగినది. అందుకే మన పెద్దలు చెప్పిన సాంప్రదాయాలను పాటిస్తూ సంక్రాంతిని మరింత ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ మరొక్కమారు అందరికి …

Read More »

ధర్మవరం పట్టణంలో సంక్రాంతి సంబరాలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : భోగి, మరియు మకర సంక్రాంతి పండుగ సందర్భంగా ఈరోజు ధర్మవరం పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఈ వేడుకలను ధర్మవరం ఎమ్మెల్యే, ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ప్రారంభించారు. తొలుత సాంప్రదాయ పద్ధతిలో ఎద్దుల బండిలో సంక్రాంతి పండుగ వేషధారణలో పంచ కట్టి క్రీడా మైదానంలోకి ప్రవేశించారు. అనంతరం క్రీడా మైదానంలో ఉన్నటువంటి బిజెపి నాయకులను కార్యకర్తలను అధికారులను మాట్లాడి వారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. తదుపరి భోగిమంటలను ప్రారంభించారు. భోగి …

Read More »

ఎన్డీయే కార్యాలయంలో ఘనంగా భోగి వేడుకలు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : భోగి పండుగను తెలుగు ప్రజలందరూ ఘనంగా జరుపుకొని సంక్రాంతికి స్వాగతం పలికారు. భవానిపురం లోని ఎన్డీయే కార్యాలయంలో సంక్రాంతి సంబరాలను భోగి మంటలు వేసి ప్రారంభించారు. ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ పాల్గొని స్నేహపూర్వక వాతావరణంలో భోగి మంటలను వేసి సంక్రాంతి సంబరాలను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు షేక్ బాజీ, నూతలపాటి బాల కోటేశ్వరరావు, యేదుపాటి రామయ్య, గుడివాడ నరేంద్ర రాఘవ, బోగవల్లి …

Read More »

ప‌ట్టుద‌ల కార్య‌ద‌క్ష‌త గ‌ల‌ రాజ‌కీయ నాయకుడు వ‌ల్లూరు పూర్ణ‌చంద్ర‌రావు : ఎంపి కేశినేని శివ‌నాథ్

-క‌స్తూరి పూర్ణ‌చంద్ర ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో ఆర్ధిక సాయం విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : గ‌త ప‌ద‌మూడు సంవ‌త్స‌రాలుగా విద్య‌కు ప్రాధ్యాన‌త ఇస్తూ…పేద విద్యార్ధుల‌కు స్కాల‌ర్ షిప్స్ అందించ‌ట‌మే కాకుండా ఆ పేద విధ్యార్ధుల త‌ల్లిదండ్రుల‌కు చేయూత‌గా వుండేందుకు కూడా ఆర్థిక సాయం చేస్తున్న‌ క‌స్తూరి పూర్ణ‌చంద్ర ఫౌండేష‌న్ సేవ‌లు అభినంద‌నీయ‌మ‌ని విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ అన్నారు. ప్ర‌ముఖ రాజ‌కీయ నాయ‌కుడు వ‌ల్లూరు పూర్ల‌చంద్ర‌రావు, ఆయ‌న స‌తీమ‌ణి వ‌ల్లూరు క‌స్తూరి బాయి జ్ఞాప‌కార్థం ఏర్పాటు చేసిన క‌స్తూరి పూర్ణ‌చంద్ర ఫౌండేష‌న్ ఆధ్వర్యంలో సోమ‌వారం …

Read More »