Breaking News

Monthly Archives: February 2025

డ్రైన్లు నిర్మాణం చేసిన అనంతరమే రోడ్లు నిర్మాణం చేపట్టాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో నూతనంగా రోడ్లు ఏర్పాటు చేసే ప్రాంతాల్లో తొలుత డ్రైన్లు నిర్మాణం చేసిన అనంతరమే రోడ్లు నిర్మాణం చేపట్టాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం రెడ్డిపాలెం, గోరంట్ల, ఇన్నర్ రింగ్ రోడ్ తదితర ప్రాంతాల్లో పర్యటించి, అభివృద్ధి, పారిశుధ్య పనులను పరిశీలించి, సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్  మాట్లాడుతూ డివిజన్ల వారీగా ఎండ్ టు ఎండ్ నూతన రోడ్ల …

Read More »

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 95523 00009 నంబర్ ద్వారా వాట్సాప్ గవర్నెన్స్ సేవలు….

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 95523 00009 నంబర్ ద్వారా వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ప్రారంభించిందని, ప్రజలు కార్యాలయాల చుట్టూ రోజుల తరబడి తిరగకుండా, వారి అవసరాలకు అనుగుణంగా సేవలు ఇంటి దగ్గర నుంచి అందించడానికి ప్రభుత్వం అవకాశం కల్పించిందని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్  మాట్లాడుతూ ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ఏదైనా సమస్య కోసం రోజుల తరబడి తిరగకుండా ఉండేందుకు ఏపీ …

Read More »

నదీ జలాలను పరిరక్షించే కార్యక్రమాలలో ప్రజలు భాగస్వామ్యులు కావాలి… : కమిషనర్ కేతన్ గార్గ్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మనిషి జీవనానికి అత్యవసరమైన నీటిని వృధా కానివ్వకుండా పరిరక్షించుకోవాలని భవిష్యత్తరాలకు స్వచ్ఛమైన నీటిని అందించడానికి జరిగే కృషిలో ప్రజలందరు భాగస్వామ్యులు కావాలని కమిషనరు కేతన్ గార్గ్ పిలుపునిచ్చారు. కేంద్ర జలవనరుల శాఖ జలశక్తి విభాగము మరియు నదీ జలాల పరిరక్షణ సంస్థ సూచనల మేరకు శుక్రవారం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పుష్కరఘాట్ వేదికగా వివిధ కార్యక్రమాలు చేపట్టుట జరిగినది. ది.25-02-2025 వ తేది హై స్కూలు స్థాయిలో జలసంరక్షణపై అవగాహన కల్పించు నిమిత్తం నగరపాలక సంస్థకు చెందిన …

Read More »

త్రాగునీటి సరఫరా ఎటువంటి ఆటంకం లేకుండా చర్యలు

రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : శుక్రవారం రాష్ట్ర ప్రథాన కార్యదర్శి ఎమ్. విజయానంద్ అమరావతి నుంచీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కి స్ధానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం సమావేశ మందిరం నుంచి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, జెసి ఎస్ చిన్న రాముడు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో భాగంగా ఎజెండా అంశాలుగా పింఛన్ల పంపిణి , తాగునీటి సరఫరా వేసవి కార్యాచరణ ప్రణాళిక , ప్రజా రవాణా ,నిత్యావసర సరుకుల పంపిణీ, రియల్ టైమ్ గవర్నెన్స్ , …

Read More »

MDU ఆపరేటర్ లతో సమావేశం…

రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని పలు MDU ఆపరేటర్ ల పై రేషన్ సరుకులు డెలివరీ సమయములో సరుకుల ధర కంటే ఎక్కువ ధర వసూలు చేస్తున్నారని మరియు రేషన్ సరుకులు ఇవ్వడంలేదని అందుతున్న ఫిర్యాదులను దృష్టి లో ఉంచుకొని సమావేశం ఏర్పాటుచేసినట్లు ఇన్చార్జి జిల్లా పౌర సరఫరాల అధికారి ఎమ్ నాగంజనేయులు పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం తూర్పుగోదావరి జిల్లాలోని MDU ఆపరేటర్ లతో సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంలో నాగంజనేయులు సమావేశములో మాట్లాడుతూ , …

Read More »

ఘనంగా డిపిఆర్వో కాశయ్య పదవీ విరమణ వేడుక

-విశ్రాంత జీవనం ఆనందంగా గడపాలని పలువురు ఆకాంక్ష -కాశయ్య దంపతులకు కలెక్టర్ , జెసి , డి ఆర్వో , సిబ్బంది తదితరుల సత్కారం రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 28: ప్రభుత్వానికి, సమాచార సాధనాలకు మధ్య వారధిగా నిలిచి, ప్రజలకు సత్వర సమాచారం అందడంలో కీలక భూమిక పోషించి, అందరి మన్ననలూ అందుకున్న ఐకా కాశయ్య అభినందనీయులని జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, డిఆర్వో టి సీతారామ మూర్తి తదితరులు పేర్కొన్నారు. విశ్రాంత జీవనం నిండు నూరేళ్లు ఆనందంగా …

Read More »

వేస‌విలో నీటి ఎద్దడి తలెత్తకుండా తక్షణ చర్యలు తీసుకోండి

– ప్రజలు, పశుప‌క్ష్యాదుల‌కు తాగునీటి నీటి సమస్య అనేది రాకూడ‌దు – అధికారులు స‌మ‌న్వ‌యంతో ప్ర‌ణాళిక ప్ర‌కారం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలి. – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వేసవికాలంలో ప్రజలు, ప‌శుప‌క్ష్యాదుల‌కు నీటి ఎద్దడి సమస్య అనేది తలెత్తకుండా అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. జి.ల‌క్ష్మీశ అధికారుల‌ను ఆదేశించారు. క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ శుక్ర‌వారం క‌లెక్ట‌రేట్‌లో గ్రామీణ నీటిస‌ర‌ఫ‌రా.. ఇత‌ర శాఖ‌ల అధికారుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న …

Read More »

చిన్న పరిశ్రమల సర్వే వేగవంతం చేయండి..

– పారిశ్రామిక యూనిట్లను చేయిప‌ట్టి న‌డిపించేందుకే స‌ర్వే – మార్చి 15లోగా స‌చివాల‌య సిబ్బందికి వివ‌రాలు ఇవ్వండి – నిస్సంకోచంగా యూనిట్ల య‌జ‌మానులు స‌మాచార‌మివ్వొచ్చు – అధికారులూ క్షేత్ర‌స్థాయిలో అందుబాటులో ఉండి అవ‌గాహ‌న క‌ల్పించండి – ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సూక్ష్మ‌, చిన్న‌, మ‌ధ్య‌త‌ర‌హా పారిశ్రామిక యూనిట్ల (ఎంఎస్ఎంఈ) ప్ర‌స్తుత ప‌రిస్థితిని క్షుణ్నంగా తెలుసుకొని.. అవి ప్ర‌గ‌తి ప‌థంలో వ‌డివ‌డిగా ముందుకు ప‌య‌నించేందుకు చేయిప‌ట్టి న‌డిపించేందుకే ప్ర‌భుత్వం ప్ర‌త్యేక స‌ర్వే చేస్తోంద‌ని.. చిరువ్యాపారులు, ప‌రిశ్ర‌మ‌లు …

Read More »

స‌కాలంలో టీకాలు వేయండి.. ప‌శు వ్యాధుల‌ను అరిక‌ట్టండి..

– మార్చి 1 నుంచి గాలికుంటు వ్యాధి , బ్రుసెల్లోసిస్ టీకాల కార్య‌క్ర‌మం – అవ‌గాహ‌న పోస్ట‌ర్ల‌ను ఆవిష్క‌రించిన జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప‌శువుల‌కు అవ‌స‌ర‌మైన టీకాల‌ను స‌కాలంలో అందించి, పూర్తిస్థాయిలో వ్యాధుల‌ను అరిక‌ట్టేందుకు కృషిచేయాల‌ని, జాతీయ ప‌శువ్యాధి నియంత్ర‌ణ ప‌థ‌కం ద్వారా ప‌శు సంర‌క్ష‌ణ‌పై రైతుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. శుక్ర‌వారం క‌లెక్ట‌రేట్‌లో క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌.. ప‌శుసంవ‌ర్థ‌క శాఖ అధికారుల‌తో క‌లిసి గాలికుంటు వ్యాధి, బ్రూసెల్లోసిస్ వ్యాధి నిరోధ‌క …

Read More »

జిల్లాలో 2,29,913 పెన్ష‌న్ల‌కు రూ. 98.20 కోట్లు విడుద‌ల

– పెన్ష‌న్ల పంపిణీ స‌జావుగా సాగేలా స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయండి – క్షేత్ర‌స్థాయి అధికారుల‌తో జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో మార్చి 1వ తేదీన ఎన్‌టీఆర్ భ‌రోసా పెన్ష‌న్ల కింద 2,29,913 పెన్ష‌న్ల‌కు రూ. 98.20 కోట్లు పంపిణీ చేయ‌డం జ‌రుగుతుంద‌ని.. క్షేత్ర‌స్థాయిలో అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేసి పెన్ష‌న్ల పంపిణీ స‌జావుగా సాగేలా కృషిచేయాల‌న్నారు. శుక్ర‌వారం క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌.. డీఆర్‌డీఏ పీడీ, ఆర్‌డీవోలు, మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్లు, ఎంపీడీవోలతో ఎన్‌టీఆర్ భ‌రోసా పెన్ష‌న్ల పంపిణీపై టెలీకాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. మార్గ‌ద‌ర్శ‌కాల‌కు …

Read More »