Breaking News

Monthly Archives: February 2025

వక్ఫ్ బోర్డ్ కు ఆదాయం పెంచే దిశగా అడుగులు వేస్తున్నాం.

-తొలి అడుగు లోనే విజయం సాధించాం. -త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా డైరెక్ట్ మేనేజ్మెంట్ లో ఉన్న దర్గాలకు టెండర్లు పిలుస్తాం. -షేక్. అబ్దుల్ అజీజ్, ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వక్ఫ్ బోర్డ్ కు ఆదాయం పెంచే విధంగా అడుగులు వేస్తున్నామని ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. ఈ మేరకు వేసిన తొలి అడుగులోనే విజయం సాధించామని ఆయన తెలిపారు. కర్నూల్ జిల్లా ఎల్లార్తి గ్రామం షేక్ షావలి షాషావలి దర్గా టెండర్ల …

Read More »

సీఎం చంద్రబాబును కలిసిన అమరావతి బ్రాండ్ అంబాసిడర్‌ అంబుల వైష్ణవి

-అభినందించిన సీఎం….రాజధానిపై విస్తృత ప్రచారం కల్పించాలని సూచన అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి రాజధానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులైన వైద్య విద్యార్థిని అంబుల వైష్ణవి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిశారు. వైష్ణవిని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తూ సీఆర్డీయే ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబును వైష్ణవి సచివాలయంలో శుక్రవారం కలిశారు. అతిచిన్న వయసులోనే అంబాసిడర్‌గా నియమితులైన వైష్ణవిని సీఎం అభినందించారు. రాష్ట్రాభివృద్ధిలో యువత పాలుపంచుకోవాలని, అలాంటి వారికి వైష్ణవి ఆదర్శంగా నిలుస్తుందని సీఎం అభిప్రాయపడ్డారు. అమరావతి కోసం విరాళాలు సేకరించాలన్నది …

Read More »

రాష్ట్ర పునర్నిర్మాణానికి బాటలు వేసిన 2025-26 బడ్జెట్

-పతనమైన ఆర్థిక వ్యవస్థకు ప్రాణం పోసే దిశగా బడ్జెట్ -ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనికతకు అభినందనలు -వైద్య ఆరోగ్య, వైద్య విద్యకు రూ.19,265 కోట్లు -అందరికీ రూ.25 లక్షల ఆరోగ్య బీమా -డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకానికి రూ.4,000 కోట్లు -మొత్తం బడ్జెట్లో వైద్య ఆరోగ్యానికి దాదాపు 6 శాతం కేటాయింపులు -2023-24తో పోలిస్తే ఏకంగా రూ.1420 కోట్లు (29శాతం )అదనం -సంక్షేమం, అభివృద్ధి అవసరాలను సమతుల్యం చేసేందుకు చర్యలు -మూల ధన వ్యయానికి పెరిగిన కేటాయింపులు -‘ఆరోగ్యకరమైన, సంపన్నమైన, సంతోషకరమైన’ ఏపీ లక్ష్యాన్ని …

Read More »

రాష్ట్ర సమ్మిళిత అభివృద్ధికి దోహదం చేసే బడ్జెట్… : మంత్రి కొండపల్లి శ్రీనివాస్

-విద్య, వైధ్యం, వ్యవసాయానికి ప్రథమ ప్రాధాన్యత -ఎస్సీ, ఎస్టీ, బీసీ,మహిళల అభివృద్ధికి పెద్దపీట అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రాధాన్యత రంగాలకు పెద్దపీట వేస్తూ ప్రగతి పధంలో పయనించేందుకు రాష్ట్ర బడ్జెట్ దోహదపడుతుందని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మద్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈరోజు శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ పై మంత్రి స్పందించారు. ఈ …

Read More »

పరమశివుని ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి

-ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావన కలిగి ఉండాలి -ఆలయాల అభివృద్ధిపై ఎన్డీఏ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది -ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆ పరమశివుని ఆశీస్సులతో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలి. మహాశివ రాత్రి పర్వదినంలో మహా గ్రూప్ ఆధ్వర్యంలో మహా భక్తి చానల్ ప్రారంభం కావడం సంతోషాన్ని కలిగిస్తోంది. రంజని అఖాడా మహామండలేశ్వర్ స్వామి కైలాసానంద గిరి జీ మహరాజ్ తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఈ సందర్భంగా …

Read More »

ఘనంగా అవతార్ మెహెర్ బాబా జయంతి వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అవతార్ మెహెర్ బాబా 131వ జన్మదినోత్సవ వేడుకలలో భాగంగా విజయవాడ, సత్యనారాయణపురం అవతార్ మెహెర్ బాబా ఆలయ ప్రాగణంలో ఫిబ్రవరి 4వ నుండి ఫిబ్రవరి 25 వ తేదీ వరకు ప్రతి రోజు సా. 6 గం.ల నుండి రా.8.00 గం.ల వరకు అత్యంత వైభవంగా జరిగాయి. వేడుకలలో చివరి రోజు అయిన ఫిబ్రవరి 25 వ తేదీన అవతార్ మెహెర్ బాబా 131 వ జయంతి సందర్భంగా ఉదయం 4 గంటల నుండి సంకీర్తనలు, 5 …

Read More »

స్వేచ్ఛాయుత వాతావరణంలో పార‌ద‌ర్శ‌క పోలింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు

– ఈ 27న ఉద‌యం 8 గంట‌ల నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు పోలింగ్‌ – అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌ల‌కు ఆస్కారం లేకుండా భ‌ద్ర‌తా చర్యలు – 112 పోలింగ్ స్టేష‌న్ల‌లోనూ వెబ్‌క్యాస్టింగ్‌కు ఏర్పాట్లు – అన్ని పోలింగ్ స్టేష‌న్ల‌కూ మైక్రో అబ్జ‌ర్వ‌ర్ల నియామ‌కం – పోలింగ్ ప్ర‌క్రియ స‌జావుగా జ‌రిగేలా నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ‌ – ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా-గుంటూరు ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ నియోజ‌క‌వ‌ర్గ ఎన్నిక‌ల పోలింగ్‌ను ప్ర‌శాంత‌, స్వేచ్ఛాయుత వాతావ‌ర‌ణంలో ఎలాంటి …

Read More »

ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు స్థానిక సెలవు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా-గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ శాసన మండలి ఎన్నికల దృష్ట్యా జిల్లా ఎన్నికల అధికారి, గౌరవ కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆదేశాల మేరకు ఈనెల 27వ తేదీ గురువారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు స్థానిక సెలవు ప్రకటించడం జరిగిందని జిల్లా విద్యాశాఖ అధికారి యూవీ సుబ్బారావు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ఉప విద్యా శాఖాధికారులు, మండల విద్యా శాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, యాజమాన్యాలు.. ఆదేశాల అమలుపై పూర్తి పర్యవేక్షణ చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి ఆ …

Read More »

మహాశివరాత్రి లింగోద్భవ అభిషేకం, కళ్యాణం 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహా శివరాత్రిని పురస్కరించుకొని 26.02.2025 బుధవారం రాత్రి మల్లేశ్వర స్వామి వారి ఆలయం లో రాత్రి 9 గంటల నుండి మహన్యాసం నిర్వహించగా, తదుపరి లింగోద్భవ అభిషేకం, మహా నివేదన, హారతి మంత్రపుష్పం కార్యక్రమములు భక్తి శ్రద్దలతో జరిగాయి. అనంతరం శ్రీ గంగా, పార్వతీ (దుర్గా) సమేత మల్లేశ్వరస్వామి వార్ల దివ్య లీలా కళ్యాణోత్సవ క్రతువు వైభవంగా ప్రారంభమై, పండితుల మంత్రాలు, మంగళవాయిధ్యాల నడుమ కన్నుల పండువుగా ఆది దంపతుల కళ్యాణం జరిగింది. ఈ కార్యక్రమం లో …

Read More »

రాష్ట్ర ప్రజలపై నియోజకవర్గ ప్రజలపై పరమేశ్వరుని కరుణాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలి… : MLA బొండా ఉమ

-మహాశివుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చల్లపల్లి బంగ్లా దగ్గర ఉన్న శివాలయంలో నందు బుధవారం ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు  సకుటుంబ సమేతంగా పవిత్రమైన మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొని రాష్ట్ర ప్రజలపై పరమేశ్వరుని కరుణాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని, మహాశివుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆ దేవదేవుని ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా బొండా ఉమ మాట్లాడుతూ… ఈరోజు మహాశివరాత్రి పురస్కరించుకొని …

Read More »