-వంద సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా నిర్మిస్తున్న చర్చి పనులపై -ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రత్యేక దృష్టి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మంగళవారం ఉదయం గుణదల మేరీ మాత చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ 101వ గుణదల మేరీమాత ఉత్సవాల సందర్భంగా జరుగుతున్న ప్రార్థనల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. గత మూడు రోజులుగా మేరిమాతను లక్షలాది మంది భక్తులు వచ్చి వారి కోర్కెలను మేరీమాతకు …
Read More »Daily Archives: February 11, 2025
బాధలున్నా… బకాయిలు చెల్లింపు
-రూ.22,507 కోట్ల పాత బకాయిలు చెల్లించాం -ఇది ఈ ప్రభుత్వ నిబద్దత -ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలివ్వాల్సిందే -త్వరలోనే మెగా డీఎస్సీ -ఆర్థిక శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గత ప్రభుత్వం వల్ల ఏర్పడ్డ నష్టాలు వెంటాడుతున్నా, ఆర్థిక ఇబ్బందులు, బాధలున్నప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ ఎనిమిది నెలల్లోనే రూ.22,507 కోట్ల పాత బకాయిలను చెల్లించగలిగిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇది ఈ ప్రభుత్వ నిబద్దకు నిదర్శనమన్నారు. చాలా క్లిష్ట …
Read More »14% మార్జిన్ పెంపుతో ప్రభుత్వ ఆదాయానికి ఎటు వంటి గండి పడదు
-బాటిల్పై రూ.10 పెంపుతో ప్రభుత్వానికి ఏటా రూ.100 కోట్ల వరకు ఆదాయం -90 వేల దరఖాస్తులే షాపుల కేటాయింపులో పారదర్శకతకు నిదర్శనం -గీత కులాల షాపుల్నీ పారదర్శకంగా కేటాయిస్తున్నాం -నవోదయం 2.0తో సారా రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దుతాం -రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మధ్యం దుఖాణాలకు 14 శాతం మార్జిన్ పెంపుతో ప్రభుత్వ ఆదాయానికి ఏ మాత్రం గండి పడే అవకాశం లేదని రాష్ట్ర గనులు, భూగర్భ …
Read More »రోడ్లపై గుంతలు కనిపించకూడదు
-గతంలో రహదార్లపై ప్రయాణించాలంటే భయమేసేది -ఇప్పుడిప్పుడే రోడ్లు బాగుపడుతున్నాయి -ఇప్పుడు మొదలు పెట్టిన రోడ్డు నిర్మాణ పనులన్నీ 4ఏళ్లలో పూర్తి కావాలి -అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశం -ఈ నెలాఖరుకు గుంతల రహిత రహదార్ల లక్ష్యం సాధిస్తామన్న అధికారులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఎక్కడా కూడా తనకు గుంతలున్న రహదార్లు కనిపించకూడదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గతంలో రహదార్లపైన ప్రయాణించాలంటే ప్రజలు భయపడే పరిస్థితి ఉండేదని, దాన్ని పోగొట్టి ఇప్పుడు మన ప్రభుత్వం రహదార్లను …
Read More »రాష్ట్ర అభివృద్దికి దిక్సూచీగా మంత్రులు మరియు కార్యదర్శుల సమావేశం
-రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖామాత్యులు కొలుసు పార్థసారధి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర అభివృద్దిలో అన్ని శాఖల అధికారులను బాగస్వామ్యం చేస్తూ వారికి దశ దిశ నిర్థేశించే విధంగా మరియు రాష్ట్రాభివృద్దికి ఒక దిక్సూచీగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు అద్యక్షతన రాష్ట్ర మంత్రులు, కార్యదర్శుల సమావేశం జరిగిందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల, గృహ నిర్మాణ శాఖమాత్యులు కొలుసు పార్థసారధి పేర్కొన్నారు. మంగళవారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రజల …
Read More »రాష్ట్ర పర్యాటక రంగానికి మహర్దశ
-త్వరలోనే రాష్ట్రంలో పట్టాలెక్కనున్న మరిన్ని పర్యాటక ప్రాజెక్టులు -కేంద్ర పర్యాటక శాఖకు సమర్పించిన వివిధ ప్రాజెక్టుల డీపీఆర్ లను త్వరితగతిన ఆమోదించాలన్న మంత్రి కందుల దుర్గేష్ అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ -కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్, టూరిజం ఎండీ ఆమ్రపాలి కాట -కేంద్ర ప్రభుత్వ పథకాలైన ప్రసాద్, స్వదేశీ దర్శన్ 2.0, శాస్కి స్కీమ్ ల సహకారంతో రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధి జరుగుతుందని మంత్రి …
Read More »ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.2,458.84 కోట్ల విలువైన అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుంది..
-రాష్ట్ర మంత్రి టి.జి భరత్ బెంగళూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఏరోఇండియా 2025లో నాలుగు ప్రముఖ ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ కంపెనీలతో ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్ (APEDB) అవగాహన ఒప్పందాలు (MOUలు) కుదుర్చుకుందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ తెలిపారు. ఇది రాష్ట్ర పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడంలో ఒక ముఖ్యమైన ముందడుగు వేసినట్లే అని చెప్పారు. ఈ ఒప్పందాలు సమిష్టిగా రూ.2,458.84 కోట్ల పెట్టుబడిని సూచిస్తాయన్నారు. అంతేకాకుండా 8వేలకు పైగా ప్రత్యక్షంగా, …
Read More »నకిలీ విత్తనాల విషయంలో కఠినంగా వ్యవహరించండి
-ట్రేసబిలిటీ మరియు సర్టిఫికేషన్ విధానాన్ని పటిష్టంగా అమలు పర్చాలి -వ్యవసాయ శాఖ ఎక్స్అఫిషియే స్పెషల్ సిఎస్ ను ఆదేశించిన ముఖ్యమంత్రి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించే నకిలీ విత్తనాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని, వాటి ట్రేసబిలిటీ మరియు సర్టిఫికేషన్ విధానాన్ని పటిష్టంగా అమలు పర్చాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రులు మరియు కార్యదర్శుల సదస్సులో భాగంగా వ్యవసాయ, అనుబంధ రంగాల్లో ఈ ఆర్థిక …
Read More »అర్జీల పరిష్కారంలో అలసత్వం వద్దు
-మంత్రులు, అధికారులు అందరూ దృష్టి పెట్టాలి -అపరిష్కృత అర్జీలు లేకుండా చూసుకోండి -అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం -మూడు జిల్లాల నుంచే అత్యధిక ఫిర్యాదులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల నుంచి అందిన అర్జీలు, ఫిర్యాదుల పరిష్కారంలో అధికారులు ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించరాదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో జరిగిన మంత్రులు, కార్యదర్శుల సదస్సులో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ ఎస్)పై ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్పై ఆయన మాట్లాడుతూ అర్జీలు ఏవీ కూడా …
Read More »iGOT కర్మయోగి సమీక్షా వివరాలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగుల సామర్థ్యాభివృద్ధికి ఐగోట్ కర్మయోగి పోర్టల్ స్వర్ణ ఆంధ్ర 2047 లక్ష్య సాధనలో భాగంగా నైపుణ్యాభివృద్ధికి, మానవ వనరుల అభివృద్ధికి ఇది ఒక వ్యూహాత్మక సాధనంగా ఉపయోగపడుతుంది. ఇటీవల, కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ (CBC) మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. దీనిలో భాగంగా ఐగోట్ కార్యక్రమాన్ని రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేయనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు శిక్షణ అందించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ నాలెడ్జ్ సొసైటీ మరియు కెపాసిటీ బిల్డింగ్ పాలసీ …
Read More »