-శ్రీ వల్లీదేవసేన సమేతుడైన శ్రీ మురుగన్ స్వామికి ప్రత్యేక పూజలు -షష్ట షణ్ముఖ క్షేత్ర దర్శనం ఆనందాన్నిచ్చింది -ప్రజలందరికీ శ్రీ సుబ్రహ్మణ్యుడు సుఖశాంతులు కలిగించాలని ఆకాంక్షించిన పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తమిళనాడులోని తిరుత్తణిలో కొలువైన శ్రీ వల్లీదేవసేన సమేతుడైన శ్రీ మురుగన్ స్వామిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. శనివారం మధ్యాహ్నం షష్ట షణ్ముఖ క్షేత్ర యాత్రలో భాగంగా తిరుత్తణి చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ కి ఆలయ పండితులు సంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు. వినాయకుడి దర్శనానంతరం …
Read More »Daily Archives: February 15, 2025
నేడు(ఈనెల 16) ఢిల్లీకి మంత్రి సవిత
-భారత్ టెక్స్-2025 లో పాల్గొన్ననున్నమంత్రి -రాష్ట్రంలో పెట్టుబడులకు పలు పారిశ్రామికవేత్తలతో భేటీ -చేనేత వస్త్రాల మార్కెటింగ్ విస్తరణకు చర్చలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఢిల్లీలో జరుగుతున్న భారత్ టెక్స్-2025 కార్యక్రమంలో రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత పాల్గొననున్నారు. ఈ మేరకు ఆదివారం ఉదయం ఆమె ఢిల్లీ బయలుదేరి వెళుతున్నారు. చేనేత వస్త్రాలకు మరింత మార్కెట్ సదుపాయం కల్పించాలన్న లక్ష్యంతో పాటు పెట్టుబడుల కోసం కేంద్ర ప్రభుత్వం భారత్ టెక్స్-2025 ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేసింది. ఈ నెల …
Read More »స్వచ్చాంధ్ర లక్ష్య సాధనలలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
-పరిశుభ్రతతోనే ప్రజలకు ఆరోగ్యం, మెరుగైన సమాజం సాధ్యమవుతుంది -గత ప్రభుత్వం చెత్తపై పన్ను వేస్తే…మేము చెత్తతో సంపద సృష్టిస్తున్నాం -8 నెలల్లోనే అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నాం -ఆడబిడ్డల జోలికొస్తే ఎవర్నీ వదిలిపెట్టం, నేరస్తుల గుండెల్లో నిద్రపోతాం -కందుకూరును ప్రకాశం జిల్లాలో కలిపేందుకు అందరికి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటాం -వెలుగొండను పూర్తిచేసి కందుకూరుకు నీరందిస్తాం -ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు -నెల్లూరు జిల్లా కందుకూరులో స్వర్ణాంధ్ర -స్వచ్చాంధ్ర కార్యక్రమానికి హాజరైన సీఎం చంద్రబాబు నెల్లూరు జిల్లా, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీని స్వచ్చాంధ్ర చేయాలని సంకల్పించాం. …
Read More »అరుల్మిగు సోలైమలై మురుగన్ సేవలో పవన్ కళ్యాణ్
-పూర్ణకుంభ స్వాగతం పలికిన ఆలయ అధికారులు -క్షేత్ర విశిష్టతను వివరించిన అర్చకులు -తిరుత్తణి క్షేత్ర దర్శనంతో పూర్తికానున్న షష్ట షణ్ముఖ యాత్ర అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : షష్ట షణ్ముఖ క్షేత్ర యాత్రలో భాగంగా శనివారం ఉదయం తమిళనాడు రాష్ట్రం మధురై జిల్లాలో అళగర్ కొండల్లో కొలువైన పలముదిర్చోలై అరుల్మిగు సోలైమలై మురుగన్ ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు పవన్ కళ్యాణ్ కి పూలమాలలు, శాలువాతో సత్కరించి పూర్ణకుంభ …
Read More »ప్రజాసేవకే ఎన్టీఆర్ ట్రస్ట్ అంకితం
-తలసేమియా బాధితులకు అండగా నిలిచేందుకే యూఫోరియా మ్యూజికల్ నైట్ -ప్రజల స్పందన చూశాక మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలనే ధైర్యం, ప్రోత్సాహం వచ్చాయి -రక్తదానం ప్రాణదానంతో సమానం -నారా భువనేశ్వరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజాసేవకే ఎన్టీఆర్ ట్రస్ట్ అంకితం. తలసేమియా వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించి, ఆ వ్యాధితో బాధపడే బిడ్డలను ఆదుకోవాలనే లక్ష్యంతోనే యూఫొరియా మ్యూజికల్ నైట్ నిర్వహిస్తున్నామని సీఎం చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. తలసేమియా బాధితుల సహాయార్థం ఏర్పాటు …
Read More »ఎన్టీఆర్ ఆశయ సాధనకు కట్టుబడి ఉన్నాం
-సేవా కార్యక్రమాల్లో ముందుండే ఎన్టీఆర్ ట్రస్ట్ ను అభినందిస్తున్నాను -తలసేమియా బాధితులకు అండగా మ్యూజికల్ నిర్వహణ మంచి నిర్ణయం -మంచి కార్యక్రమాలకు ప్రజల మద్దతు ఎప్పుడూ ఉంటుంది -ఎన్టీఆర్ లాగే నారా భువనేశ్వరి కూడా మొండిఘటం -ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తలసేమియా బాధితుల కోసం ఏర్పాటు చేసిన యుఫోరియా మ్యూజికల్ నైట్ కు హాజరైన సీఎం చంద్రబాబు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ సభకు వచ్చిన ప్రతి ఒక్కరికీ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తరపున ధన్యవాదాలు. హెరిటేజ్ నే కాదు, …
Read More »పట్టభద్రులంతా ఆలపాటికి పట్టం కట్టాలి
-జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ గద్దె అనురాధ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి కృష్ణా – గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్డీఎ కూటమి అభ్యర్థిగా బరిలో నిలిచిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు వారి మొదటి ప్రాధాన్యతా ఓటు వేసి పట్టభద్రులంతా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను గెలిపించాలని జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ గద్దె అనురాధ కోరారు. శనివారం ఉదయం మొగల్రాజపురంలోని మోడరన్ అకాడమీలోని ఉపాధ్యాయులను గద్దె అనురాధ కలిసి కూటమి అభ్యర్థి రాజేంద్రప్రసాద్ …
Read More »పట్టబధ్రుల సమస్యలు తెలిసినవాడు ఆలపాటి
-ఆలపాటి విజయం నల్లేరు పై నడకే -జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ గద్దె అనురాధ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మంత్రిగా, తెనాలి శాసనసభ్యుడిగా గతంలో పనిచేశారని, పట్టభద్రుల సమస్యలపై ఆయనకు ఎంతో అవగాహన ఉందన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, బీజేపీ పెద్దలు బలపరిచిన ఆలపాటిని గెలిపించి శాసనమండలికి పంపిస్తే అక్కడ పట్టభద్రుల వాణి వినిపిస్తారన్నారు. ఆలపాటి రాజా విజయం నల్లేరుపై నడక అని కానీ అత్యధిక మెజార్టీ అందించి కూటమి ప్రభుత్వ మంచి …
Read More »ఇచ్చిన హామీని నెరవేర్చిన సుజనా చౌదరి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సుజనా ఫౌండేషన్ తరపున ఇచ్చిన హామీని నెరవేర్చి ఎమ్మెల్యే సుజనా చౌదరి మాటను నిలుపుకున్నారని శ్రీ కామాక్షి స్వర్ణకార సంఘం అధ్యక్షులు కేశనం బావన్నారాయణ అన్నారు. వన్ టౌన్ లోని కామాక్షి స్వర్ణకార సంఘం నేతలతో ఎమ్మెల్యే సుజనా గతంలో సమీక్ష నిర్వహించారు. సుమారు ఎనిమిది వేల మంది స్వర్ణకారులు పనిచేస్తున్న స్వర్ణకార సంఘం భవనానికి లిఫ్టు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని తెలపడంతో సుజనా ఫౌండేషన్ తరపున లిఫ్టు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. సొంత నిధులతో …
Read More »రాజకీయాలు మానేద్దాం..విజయవాడలో పారిశ్రామిక రంగ అభివృద్ది కోసం ఆలోచిద్దాం : ఎంపి కేశినేని శివనాథ్
-ఎపి ఎమ్.ఎస్.ఎమ్.ఈ ఇండస్ట్రీయస్ అసోసియేషన్ ఫెసిలిటేట్ సెంటర్ సందర్శన -udyam రిజిస్ట్రేషన్ సెంటర్ ను ప్రారంభించిన ఎంపీ కేశినేని శివనాథ్ -ఆటో మొబైల్ రంగాన్ని అప్గ్రేడ్ చేసేందుకు ఆటోమొబైల్ రంగం పారిశ్రామికవేత్తల సలహాలు, సూచనలు -రాజధాని అమరావతి ప్రాంతానికి స్పోర్ట్స్ సిటీ క్లస్టర్, లెదర్ క్లస్టర్, డిఫెన్స్ క్లస్టర్ తీసుకురావటం కోసం ఎంపి కేశినేని శివనాథ్ ప్రయత్నం -ఆటోమొబైల్ ఇండస్ట్రీను అభివృధ్ది చేయటమే లక్ష్యమన్న ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఒకప్పుడు హైదరాబాద్ కి ధీటుగా పారిశ్రామికంగా …
Read More »
Prajavartha Online Telugu News