-ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావన కలిగి ఉండాలి -ఆలయాల అభివృద్ధిపై ఎన్డీఏ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది -ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆ పరమశివుని ఆశీస్సులతో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలి. మహాశివ రాత్రి పర్వదినంలో మహా గ్రూప్ ఆధ్వర్యంలో మహా భక్తి చానల్ ప్రారంభం కావడం సంతోషాన్ని కలిగిస్తోంది. రంజని అఖాడా మహామండలేశ్వర్ స్వామి కైలాసానంద గిరి జీ మహరాజ్ తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఈ సందర్భంగా …
Read More »Daily Archives: February 26, 2025
ఘనంగా అవతార్ మెహెర్ బాబా జయంతి వేడుకలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అవతార్ మెహెర్ బాబా 131వ జన్మదినోత్సవ వేడుకలలో భాగంగా విజయవాడ, సత్యనారాయణపురం అవతార్ మెహెర్ బాబా ఆలయ ప్రాగణంలో ఫిబ్రవరి 4వ నుండి ఫిబ్రవరి 25 వ తేదీ వరకు ప్రతి రోజు సా. 6 గం.ల నుండి రా.8.00 గం.ల వరకు అత్యంత వైభవంగా జరిగాయి. వేడుకలలో చివరి రోజు అయిన ఫిబ్రవరి 25 వ తేదీన అవతార్ మెహెర్ బాబా 131 వ జయంతి సందర్భంగా ఉదయం 4 గంటల నుండి సంకీర్తనలు, 5 …
Read More »స్వేచ్ఛాయుత వాతావరణంలో పారదర్శక పోలింగ్కు పకడ్బందీ ఏర్పాట్లు
– ఈ 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ – అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా భద్రతా చర్యలు – 112 పోలింగ్ స్టేషన్లలోనూ వెబ్క్యాస్టింగ్కు ఏర్పాట్లు – అన్ని పోలింగ్ స్టేషన్లకూ మైక్రో అబ్జర్వర్ల నియామకం – పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా నిరంతర పర్యవేక్షణ – ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా-గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికల పోలింగ్ను ప్రశాంత, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎలాంటి …
Read More »ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు స్థానిక సెలవు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా-గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ శాసన మండలి ఎన్నికల దృష్ట్యా జిల్లా ఎన్నికల అధికారి, గౌరవ కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆదేశాల మేరకు ఈనెల 27వ తేదీ గురువారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు స్థానిక సెలవు ప్రకటించడం జరిగిందని జిల్లా విద్యాశాఖ అధికారి యూవీ సుబ్బారావు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ఉప విద్యా శాఖాధికారులు, మండల విద్యా శాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, యాజమాన్యాలు.. ఆదేశాల అమలుపై పూర్తి పర్యవేక్షణ చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి ఆ …
Read More »మహాశివరాత్రి లింగోద్భవ అభిషేకం, కళ్యాణం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహా శివరాత్రిని పురస్కరించుకొని 26.02.2025 బుధవారం రాత్రి మల్లేశ్వర స్వామి వారి ఆలయం లో రాత్రి 9 గంటల నుండి మహన్యాసం నిర్వహించగా, తదుపరి లింగోద్భవ అభిషేకం, మహా నివేదన, హారతి మంత్రపుష్పం కార్యక్రమములు భక్తి శ్రద్దలతో జరిగాయి. అనంతరం శ్రీ గంగా, పార్వతీ (దుర్గా) సమేత మల్లేశ్వరస్వామి వార్ల దివ్య లీలా కళ్యాణోత్సవ క్రతువు వైభవంగా ప్రారంభమై, పండితుల మంత్రాలు, మంగళవాయిధ్యాల నడుమ కన్నుల పండువుగా ఆది దంపతుల కళ్యాణం జరిగింది. ఈ కార్యక్రమం లో …
Read More »రాష్ట్ర ప్రజలపై నియోజకవర్గ ప్రజలపై పరమేశ్వరుని కరుణాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలి… : MLA బొండా ఉమ
-మహాశివుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చల్లపల్లి బంగ్లా దగ్గర ఉన్న శివాలయంలో నందు బుధవారం ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు సకుటుంబ సమేతంగా పవిత్రమైన మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొని రాష్ట్ర ప్రజలపై పరమేశ్వరుని కరుణాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని, మహాశివుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆ దేవదేవుని ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా బొండా ఉమ మాట్లాడుతూ… ఈరోజు మహాశివరాత్రి పురస్కరించుకొని …
Read More »అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో పోతిన వెంకట మహేష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహా శివరాత్రి పర్వ దినం సందర్భంగా కృష్ణానదిలో పుణ్య స్థానాలు ఆచరించడనికి విచ్చేసిన భక్తులకు గంగానమ్మ ఆలయంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోతిన వెంకట మహేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు తదితరులు పాల్గొన్నారు.
Read More »దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా భక్తులకు డ్రింక్స్, మంచినీటి సరఫరా, అల్పాహార వితరణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తూర్పు నియోజకవర్గ పరిధిలోని 21వ డివిజన్ నందు వేంచేసి ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత కాశీవిశ్వేశ్వర స్వామి దేవస్థానం నందు ఎన్టీఆర్ జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు, తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్ వైసీపీ శ్రేణులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, వైయస్ జగన్మోహన్ రెడ్డి మరలా ముఖ్యమంత్రి పీఠం అధిష్టించాలని ప్రార్దించారు. దేవస్థానం వద్ద గల కృష్ణవేణి ఘాట్ నందు కృష్ణానదిలో పుణ్య స్థానాలు …
Read More »శివుని అనుగ్రహంతోనే రాష్ట్రాభివృద్ధి సాకారం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడ దుర్గా ఘాట్ వద్ద కృష్ణా నదిలో మహాశివరాత్రి పుణ్యస్నానం చేసి, పితృదేవతలకు తర్పణాలు పిండప్రదానం గావించారు. అనంతరం ముత్యాలంపాడులోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో అభిషేకార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి మహాశివుని ఆశీస్సులు అందించాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ పర్వదినాన ఉదయాన్నే లేచి నదీ తీరప్రాంతాలలో స్నానాలు చేసి …
Read More »ఎన్నికల ఓటింగ్ కు ఏర్పాట్లు పూర్తిస్థాయిలో సిద్ధం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల ఓటింగ్ కు ఏర్పాట్లు పూర్తిస్థాయిలో సిద్ధం చేసినట్టు రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి తెలిపారు బుధవారం ఏసీ కళాశాలలోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల పోలింగ్ మెటీరియల్ పోలింగ్ అధికారులకు పంపిణీని రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, సంయుక్త కలెక్టర్ ఏ భార్గవతేజ నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులతో …
Read More »
Prajavartha Online Telugu News