విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్ ధారా విక్రం ఆదివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన ప్రకారం ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోరాటాలు చేసిన వారు కానీ, రాజకీయాలకు చెందిన వారు కానీ ఉండకూడదని, వివిధ రంగాలలో నైపుణ్యం కలిగిన వారే పెద్దల సభలో ఉండాలని కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల స్వతంత్ర …
Read More »Daily Archives: February 23, 2025
నూతన వధూవరులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ లబ్బీపేటలోని ఎస్.ఎస్. కన్వెన్షన్ సెంటర్ నందు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు రెండో కుమార్తె లక్ష్మీ చంద్రిక, వేంకట సుబ్రహ్మణ్య సాయి కిరణ్ ల వివాహ వేడుక ఆదివారం వైభవంగా జరిగింది. ఈ వేడుకకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. హాజరైన వారిలో వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నాని, వెలంపల్లి శ్రీనివాస్, …
Read More »ప్రజా గొంతును అసెంబ్లీలో వినిపిద్దాం
-ప్రజల సమస్యలు, ఆకాంక్షలను చట్టసభల్లో చర్చిద్దాం -చర్చల్లో మన సభ్యులు చురుగ్గా పాలుపంచుకోవాలి -మనం మాట్లాడే భాష హుందాగా ఉండాలి -వైసీపీ భాష వద్దు -జనసేన పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో సభ్యులకు దిశానిర్దేశం చేసిన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో జనసేన పార్టీ సామాన్యుడి గొంతుగా ఉండాలి. ప్రజల సమస్యలను, ఆకాంక్షలను, ఆశలను, సంక్షేమాన్ని, చట్టసభల్లో వినిపించేలా పార్టీ తరఫున ఎన్నికైన ప్రతి శాసనసభ్యుడు, శాసనమండలి సభ్యులు చర్చల్లో పాల్గొనాలి’ అని …
Read More »కమ్యూనిస్టు ఉద్యమ పునరేకీకరణకు కృషి
-వామపక్ష వాదులు, కష్టజీవుల ఆకాంక్ష -వందేళ్ల ప్రస్తానంలో అనేక పోరాటాలు. -భూమి కోసం, భుక్తి కోసం ఉద్యమం -దేశ వ్యాప్తంగా అనేక పోరాటాలు -సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ -మార్క్సిస్టు ఆలోచనా పరుల వేదిక సదస్సు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కమ్యూనిస్టు ఉద్యమ పునరేకీకరణకు సమైక్యంగా కృషి చేద్దామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పునరుద్ఘాటించారు. దేశ రాజ్యాంగాన్ని, లౌకికవాదాన్ని కాపాడటానికి, కమ్యూనిస్టు ఉద్యమాన్ని బలోపేతం చేసుకోవడానికి మనమందరమూ సమైక్యం కావాలని కోరారు. విజయవాడ సివిల్ కోర్టుల సమీపంలోని బుక్ ఫెస్టివల్ సొసైటీ …
Read More »మహా శివ రాత్రి బ్రహ్మోత్సవాలకి పట్టు వస్త్రాలు సమర్పన…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహా శివ రాత్రి బ్రహ్మోత్సవాలు 2025 ను పురస్కరించుకొని శ్రీ శైలం భ్రమరాంబసమేత మల్లికార్జున స్వామి వారికి విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వరుల తరపున తేదీ 23.02.2025 సాయంత్రం ఆలయ కార్యనిర్వహణాధికారి కె. రామచంద్ర మోహన్ పట్టు వస్త్రాలు సమర్పించారు. శ్రీ శైలం ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాస రావు, వేద పండితులు, అర్చకులు విజయవాడ నుండి విచ్చేసిన బృందాన్ని స్వాగతించి, ఆలయ మర్యాదలతో ఆలయం లోనికి తోడ్కోని వెళ్లారు. పట్టు వస్త్రాల సమర్పణ అనంతరం వేద ఆశీర్వచనం …
Read More »ఖజానా శాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కృషి
-అప్టస జిల్లా అధ్యక్షులు కాకాని నాగేశ్వరరావు -ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ అండ్ ఎకౌంట్స్ సర్వీస్ అసోసియేషన్ ఎన్టీఆర్ జిల్లా -ఉద్యోగుల సంఘం ఎన్నికలు ఏకగ్రీవం -నూతన కార్యవర్గాన్నిఅభినందించిన ఉద్యోగ సంఘాల నేతలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అపరిష్కృతంగా ఉన్న ఖజానా విభాగం ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ అండ్ ఎకౌంట్స్ సర్వీస్ అసోసియేషన్ ఎన్టీఆర్ జిల్లా సంఘ నూతన కార్యవర్గం శక్తివంచన లేకుండా కృషి చేస్తుందని సంఘ నూతన అధ్యక్షులు కాకాని నాగేశ్వరరావు అన్నారు. ఎన్టీఆర్ జిల్లా ఖజానా శాఖ …
Read More »జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-2 మెయిన్స్
-పేపర్-1కు 83.89 శాతం, పేపర్-2కు 83.62 శాతం హాజరు -జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఆదివారం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ)- గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఓ ప్రకటనలో తెలిపారు. విజయవాడలో 19 కేంద్రాల్లో 8,792 మంది అభ్యర్థులకు పరీక్ష రాసేందుకు ఏర్పాట్లు చేయగా.. ఉదయం జరిగిన పేపర్-1కు 83.89 శాతం (7,376), మధ్యాహ్నం జరిగిన పేపర్-2కు 83.62 శాతం (7,352) మంది హాజరైనట్లు వెల్లడించారు. పరీక్షను …
Read More »మూడవ సమావేశ ఏర్పాట్లకు సంబంధించి సమీక్షా సమావేశం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 47వ మండలి సమావేశం, 16వ శాసనసభ మూడవ సమావేశ ఏర్పాట్లకు సంబంధించి ఆదివారం స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హరీష్ కుమార్ గుప్తాతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశపు ముఖ్యాంశాలు: గవర్నర్ ప్రసంగం జరిగే రోజు ఉదయం 9.30 గంటలకు సభ్యులందరూ సభలో హాజరు కావాల్సి ఉంటుంది. బడ్జెట్ సమావేశాలకు ఎమ్మెల్యేలు, అధికారుల వ్యక్తిగత సహాయకులకు (PA) పాసులు …
Read More »నగరంలో మొహంతి సిల్వర్ ప్యాలెస్ షోరూం ప్రారంభం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆభరణాల ప్రియులకు నగరంలో నూతనంగా మొహంతి సిల్వర్ ప్యాలెస్ ప్రారంభమైంది. ఆదివారం ఏలూరురోడ్డులోని సీతారాంపురం, ఇన్నవోలువారి వీధిలో నూతనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు, యజమాని మహంతి గౌతమి వాసుదేవరావు మాట్లాడుతూ షోరూంలో ఆకట్టుకునే డిజైన్లతో ఉన్న వెండి ఆభరణాలను, వస్తువులను అందజేస్తున్నామన్నారు. అత్యున్నత ప్రమాణాలతో రూపుదిద్దుకున్న ఆభరణాలు, వస్తువులు ఇప్పుడు విజయవాడలో అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు. వెండి సామాను, మెట్టలు నుండి, కాళ్ళకు పెట్టుకునే పట్టీలు, బ్రైడల్ జ్యువెలరీ, తదితర వస్తువులు అధునాతన, సాంప్రదాయ డిజైన్లకు ప్రత్యేకమైన …
Read More »రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర కార్యవర్గ సమావేశం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆథవాలే) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆదివారం గాంధీనగర్ శ్రీ రామ ఫంక్షన్ హాల్ నందు జరిగింది, పేరం శివ నాగేశ్వరావు నేషనల్ సెక్రటరీ రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటామని నిరంతరం ప్రజల్లో తిరుగుతామని అంబేద్కర్ ఆశయాలని ముందుకు తీసుకెళ్తూ బలహీన వర్గాలకు అండగా ఉంటానని తెలియజేశారు మరియు రామిశెట్టి రమేష్ ని రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆథవాలే) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర …
Read More »
Prajavartha Online Telugu News