Breaking News

Daily Archives: February 12, 2025

పి.బి. సిద్ధార్ధ కళాశాలలో జీవశాస్త్రాల సృజనశాల

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సాంకేతికత వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో యువతరం నైపుణ్యాలు పెంపొందించుకోవాలని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి. సింహాచలం అన్నారు. బుధవారం విజయవాడలోని పి.బి. సిద్ధార్థ కళాశాలలో జీవశాస్త్ర విభాగాలు (వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం, జీవసాంకేతికశాస్త్రం) సంయుక్తంగా నిర్వహించిన సియన్షియా కార్యక్రమాన్ని ఆచార్య సింహాచలం ప్రారంభిస్తూ ప్రస్తుతం హాస్పిటల్ మేనేజ్ మెంటు, ఆక్వాకల్చర్ రంగాల్లో ఎమ్మెస్సీ కోర్సులు చేసినవారికి ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మేకా రమేష్, జంతుశాస్త్ర విభాగాధిపతి, కళాశాల …

Read More »

ప్ర‌భుత్వాసుప‌త్రుల సూప‌రింటెండెంట్లు, అడ్మినిస్ట్రేట‌ర్ల‌కు వైద్య, ఆరోగ్య శాఖ తీవ్ర హెచ్చ‌రిక‌

-ఆసుప‌త్రుల్లో ఉన్న‌త ప్ర‌మాణాల‌తో కూడిన ప‌రిశుభ్ర వాతావ‌ర‌ణాన్ని నెల‌కొల్పాలి -స‌త్ఫ‌లితాలు రాక‌పోతే క‌ఠిన చ‌ర్య‌లుంటాయ‌న్న ప్ర‌భుత్వ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి -ప్ర‌భుత్వాసుప‌త్రుల్లో మెరుగ‌వుతున్న సేవ‌ల ప‌ట్ల ప్రజాస్పంద‌న‌ను వివ‌రించిన ఎం.టి.కృష్ణ‌బాబు -256 ప్ర‌భుత్వాసుప‌త్రుల సూప‌రింటెండెంట్లు, అడ్మినిస్ట్రేట‌ర్ల‌తో వీడియో స‌మీక్ష‌ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ముఖ్య‌మంత్రి స్థాయిలో ప్ర‌భుత్వాసుప‌త్రుల ప‌నితీరుపై నిరంత‌ర స‌మీక్ష జ‌రుగుతోంద‌ని, ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతున్న అంశాల్లో అన‌తి కాలంలో సానుకూల‌త సాధించ‌కుంటే ఆసుప‌త్రుల సూప‌రింటెండెంట్లు, అడ్మినిస్ట్రేట‌ర్ల‌పై క‌ఠిన చ‌ర్య‌లుంటాయ‌ని రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎం.టి.కృష్ణ‌బాబు …

Read More »

ప్ర‌తి గామ‌పంచాయ‌తీ రూ. 300 దిన‌స‌రి వేత‌న ల‌క్ష్యాన్ని చేరుకోవాల్సిందే..

– ఉపాధి హామీ ప‌థ‌కం ప్ర‌తి అంశంలోనూ పురోగ‌తి క‌నిపించాలి – సిబ్బంది ప‌నితీరులో బాధ్య‌తా రాహిత్యం క‌నిపిస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వు – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ గ్రామీణ ఉపాధి హ‌మీ ప‌థ‌కం ద్వారా కూలీలు దిన‌స‌రి స‌గ‌టు వేత‌నం రూ. 300 హ‌క్కుగా పొందేలా క్షేత్ర‌స్థాయి అధికారులు, సిబ్బంది స‌రైన ప్ర‌ణాళిక‌తో ప‌నులు చేప‌ట్టేలా వ్య‌వ‌హ‌రించాల‌ని, ప్ర‌తి గ్రామ పంచాయ‌తీలోనూ పురోగ‌తి క‌నిపించాల‌ని, సిబ్బంది ప‌నితీరులో బాధ్య‌తా రాహిత్యం క‌నిపిస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని …

Read More »

త‌క్కువ వ్య‌యంతో అధిక దిగుబడులు సాధించాలి..

– రైతులు పొలం పిలుస్తోంది కార్య‌క్ర‌మాన్ని స‌ద్వినియోగం చేసుకోవాలి – వ్య‌వ‌సాయ శాస్త్ర‌వేత్త‌లు, అధికారుల సూచ‌న‌లు పాటించాలి – ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ జ‌గ్గ‌య్య‌పేట‌, నేటి పత్రిక ప్రజావార్త : పంట‌ల సాగు వ్య‌యాన్ని త‌గ్గించి, అధిక దిగుబ‌డుల‌తో పాటు మెరుగైన ఆదాయాలు పొందాల‌నే ల‌క్ష్యంతో పొలం పిలుస్తోంది కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌డం జ‌రుగుతోంద‌ని, ఈ కార్య‌క్ర‌మాన్ని రైతులు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. బుధ‌వారం క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌.. జ‌గ్గ‌య్య‌పేట మండ‌లంలో ప‌ర్య‌టించి, క్షేత్ర‌స్థాయిలో ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను ప‌రిశీలించారు. …

Read More »

ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్(ఆడిట్) గా బాధ్యతలు స్వీకరించిన శరత్ చతుర్వేది

-1994 బ్యాచ్ ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్ కు చెందిన శరత్ చతుర్వేది -ఇప్పటివరకు ఇన్ ఛార్జ్ ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ (ఎ అండ్ ఇ) ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ (ఆడిట్) గా వ్యవహరించిన ఎస్. శాంతి ప్రియ -శరత్ చతుర్వేదికి అభినందనలు తెలిపిన విజయవాడ ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించుకొని, అహర్నిశలు కష్టపడి పనిచేస్తూ సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్న 1994 …

Read More »

తిరువల్లం శ్రీ పరుశురాముని సేవలో పవన్ కళ్యాణ్ 

-ఆలయంలో ప్రత్యేక పూజలు… మొక్కులు చెల్లింపు -భక్తులతో కలిసి భజనలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : దక్షిణ భారతదేశ పవిత్ర పుణ్యక్షేత్రాల పర్యటనలో భాగంగా దేశంలోనే పురాతన ఆలయాల్లో ఒకటైన కేరళలోని తిరువల్లం శ్రీ పరశురామర్ క్షేత్రాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  బుధవారం సాయంత్రం దర్శించుకున్నారు. ట్రావెన్ కూర్ దేవస్వం బోర్డు అధికారులు, ప్రధాన అర్చకులు పవన్ కళ్యాణ్ కి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్  ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కులు …

Read More »

భక్తుల మనోభావాలు కాపాడాలి అన్నదే నా ఆవేదన

-తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో దోషులను అరెస్ట్ చేయడం సంతోషం -భవిష్యత్తులో కూడా ఎలాంటి తప్పులు జరగకుండా చూసుకోవలసిన బాధ్యత ఉంది -దక్షిణ భారతదేశ ఆలయాల సందర్శన పూర్తిగా వ్యక్తిగత అంశం -కేరళలోని శ్రీ అగస్త్య మహర్షి ఆలయ సందర్శన అనంతరం మీడియాతో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ‘తిరుమల బాలాజీకి దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఉన్నారు. తిరుమలకు వచ్చే భక్తులు ఎంతో నమ్మకంగా, ఆధ్యాత్మిక చింతనతో వస్తుంటారు. అలా వచ్చే వారి మనోభావాలు …

Read More »

దక్షిణ భారతదేశ ఆలయాల యాత్రకు శ్రీకారం చుట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 

-మొదటిగా కేరళలోని చొట్టనిక్కరలో ఉన్న శ్రీ అగస్త్య మహర్షి ఆలయం సందర్శన -అగస్త్య ఆశ్రమంలో ఆయుర్వేద చికిత్స గురించి అడిగి తెలుసుకున్న పవన్ కళ్యాణ్ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : దక్షిణ భారతదేశ ఆలయాల పర్యటనకు శ్రీకారం చుట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  బుధవారం ఉదయం కేరళ రాష్ట్రంలోని కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా చొట్టనిక్కరలోని శ్రీ అగస్త్య మహార్షి ఆలయానికి చేరుకున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి తో పాటు ఆయన తనయుడు అకిరా నందన్, టీటీడీ …

Read More »

ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవాలి… జీవనశైలి మార్చుకోవాలి

-ప్రజల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం -ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ కోసం ప్రత్యేక కార్యక్రమాలు…ప్రజలకు డిజిటల్ హెల్త్ కార్డులు -తక్కువ ఖర్చుతో పేదలకు నాణ్యమైన వైద్యం కోసం రూ.1618 కోట్లతో ఎయిమ్స్ నిర్మాణం -మంగళగిరి ఎయిమ్స్‌కు గత ప్రభుత్వం నీళ్లివ్వకుండా వేధింపులు…అధికారంలోకి రాగానే సమస్యను చక్కదిద్దాం -వైద్య రంగంలో కిమ్స్‌ది ప్రత్యేక స్థానం…అత్యాధునిక వైద్యసేవలు అందుబాటులోకి తెచ్చింది -గుంటూరులో కిమ్స్ శిఖర ఆస్పత్రి ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు నాయుడు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజల ఆరోగ్యంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక …

Read More »

గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రూ.2,378 కోట్ల గృహ నిర్మాణ నిధులు మురిగిపోయాయి

-PMAY Gramin క్రింద గత ప్రభుత్వం 1,39,243 లబ్దిదారులకు తొలగించింది -గృహ నిర్మాణ నిధులు రూ.3,598 కోట్లను మళ్లించి నిరుపేదలకు అన్యాయం చేసింది -గత తప్పిదాలను సరిదిద్దుతూ అర్హులు అందరికీ గృహాల మంజూరీకై చర్యలు చేపట్టాం -సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖామాత్యులు కొలుసు పార్థసారధి అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : గత ప్రభుత్వ హయాంలో సకాలంలో ఇళ్లను పూర్తి చేయకపోవడం వల్ల దాదాపు రూ.2,378 కోట్ల కేంద్ర నిధులు మురిగిపోయాయని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల, గృహ నిర్మాణ శాఖమాత్యులు …

Read More »