Breaking News

పట్టభద్రులంతా ఆలపాటికి పట్టం కట్టాలి

-జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ గద్దె అనురాధ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉమ్మడి కృష్ణా – గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్డీఎ కూటమి అభ్యర్థిగా బరిలో నిలిచిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు వారి మొదటి ప్రాధాన్యతా ఓటు వేసి పట్టభద్రులంతా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను గెలిపించాలని జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ గద్దె అనురాధ కోరారు. శనివారం ఉదయం మొగల్రాజపురంలోని మోడరన్ అకాడమీలోని ఉపాధ్యాయులను గద్దె అనురాధ కలిసి కూటమి అభ్యర్థి రాజేంద్రప్రసాద్ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ గద్దె అనురాధ మాట్లాడుతూ విద్యావంతులంతా ఈనెల 27న జరిగే పట్టభద్రుల ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మోడరన్ అకాడమీ ప్రిన్సిపల్ సుంకర పాపారావు, పేరేపి ఈశ్వర్, పెనుగొండ శ్రీనివాస్, మల్లెల రామకృష్ణ, కోటా శివ లక్ష్మి, కర్రీ రాజేష్, కలపాల విక్రమ్ తదితరులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

స్వర్ణాంధ్ర , స్వచ్ఛ ధర్మవరం లక్ష్యంగా ముందుకు సాగుదాం.

-ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి సాధ్యం… -మంత్రి సత్య కుమార్ యాదవ్ ధర్మవరం, నేటి పత్రిక ప్రజావార్త : పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *