Breaking News

Monthly Archives: February 2025

కాసేపట్లో 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి పయ్యావుల కేశవ్.

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కాసేపట్లో 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి పయ్యావుల కేశవ్. ఉదయం 10:08 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి పయ్యావుల. తన నివాసంలో ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో మంత్రి పయ్యావుల భేటీ. బడ్జెట్ కాపీలను మంత్రి పయ్యావులకు అందచేసిన ఉన్నతాధికారులు. బడ్జెట్ ప్రతులకు శాస్త్రోకంగా పూజలు. బడ్జెట్ ప్రతులతో అసెంబ్లీకి బయలుదేరిన మంత్రి పయ్యావుల. సీఎం చంద్రబాబుకు బడ్జెట్ ప్రతులను అందచేయనున్న పయ్యావుల. కెబినెట్ భేటీలో బడ్జెట్టుకు ఆమోదం తెలపనున్న ప్రభుత్వం.

Read More »

బడ్జెట్ కేవలం అంకెల గారడీ మాత్రమే

-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్ర ప్రజలను నిరుత్సాహపరిచిందని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. పేదలకు ఈ బడ్జెట్‌ తో ఒరిగిందేమీ లేదని.. ఎన్నో విషయాలపై అస్పష్టత ఉందన్నారు. గ‌త బ‌డ్జెట్‌లో కూడా కూట‌మి ప్ర‌భుత్వం అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను దారుణంగా మోసం చేసింద‌ని ఆరోపించారు. వైఎస్ జ‌గ‌న్ కంటే డ‌బుల్ ఇస్తామ‌ని ఎన్నిక‌ల్లో నమ్మించి అధికారంలోకి …

Read More »

రూ.45 లక్షలతో మచిలీపట్నం సర్వజన ఆసుపత్రిలో మౌలిక వసతులు జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కార్పొరేట్ సామాజిక బాధ్యత (సిఎస్ఆర్) నిధులు రూ.45 లక్షలతో మచిలీపట్నం సర్వజన ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్ లోని తన ఛాంబర్లో వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమావేశమై మచిలీపట్నం సర్వజన ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలు, మౌలిక వసతుల కల్పనపై చర్చించారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు ప్రభుత్వ ఆసుపత్రిలో పరిస్థితులను వివరిస్తూ ఆసుపత్రికి రోగుల తాకిడి పెరుగుతున్న దృష్ట్యా అదనంగా మంచాలు, ఎక్సరే వైద్య పరికరాలు, ఆపరేషన్ …

Read More »

సర్కిల్ కార్యాలయాల్లో ఓపెన్ ఫోరం

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి శుక్రవారం సర్కిల్ పరిధిలో గల సర్కిల్ కార్యాలయాల్లో నిర్వహించే ఓపెన్ ఫోరంను విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం సర్కిల్ కార్యాలయాల్లో అసిస్టెంట్ సిటీ ప్లానర్లు నిర్వహించారు. ఈ ఫోరం ద్వారా ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం, బిల్డింగ్ పెనాల్టీ స్కీమ్ లో భాగంగా దరఖాస్తు చేసుకున్న వారి సందేహాలను తీర్చారు. అంతేకాకుండా లయోలా కాలేజ్ రోడ్డు, బి ఆర్ పి రోడ్ వద్దగల …

Read More »

దోమల నివారణకు చర్యలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాల మేరకు నగరంలో పెరుగుతున్న దోమలను అరికట్టేందుకు ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ఫ్రైడే డ్రైడే ను ఈ శుక్రవారం 28వ డివిజన్ భాను నగర్ లో మలేరియా సిబ్బంది నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇంటి పరిసరాల్లో నిల్వ ఉన్న నీటిలో ఉత్పత్తి అయిన దోమలను చూపించడమే కాకుండా వాటిని ఎలా అరికట్టాలి ప్రతి శుక్రవారం మన ఇంటి పరిసరాల్లో ఉన్న చిన్న చిన్న నీటి నిల్వలను ఎలా పారివేయాలి …

Read More »

గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రం ఆర్థికంగా అతలాకుతలం అయింది

-ఈ ఏప్రియల్ నుంచి మున్సిపాల్టీల నిధులు ఆయా మున్సిపాల్టీల అభివృద్దికి మాత్ర‌మే ఖ‌ర్చు -అమ‌రావ‌తిపై అవాస్తవాల‌తో ప్ర‌జ‌ల‌ను ప‌క్క‌దోవ ప‌ట్టించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు -అమ‌రావ‌తి నిర్మాణం కోసం ప్ర‌జ‌ల‌పై ఒక్క రూపాయి కూడా భారం వేసేది లేదు -ఇంజినీర్ల క‌మిటీ నిర్ణ‌యం మేర‌కే టెండ‌ర్ ధ‌ర‌ల నిర్ధార‌ణ‌ -ఎన్నిక‌ల కోడ్ తో అమ‌రావ‌తి ప‌నులు ఆల‌స్యం -వ‌చ్చే నెల 10 త‌ర్వాత అమ‌రావ‌తి నిర్మాణ ప‌నులు ప్రారంభం -పొంగూరు నారాయణ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ శాఖామాత్యులు అమ‌రావ‌తి, నేటి పత్రిక …

Read More »

ఒకేషనల్ ట్రైనర్లకు 5 రోజుల వర్క్ షాప్

-సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు  విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న వృత్తి విద్యా శిక్షకులకు (ఒకేషనల్ ట్రైనర్లకు) ఐదు రోజుల పాటు శిక్షణ శుక్రవారం ప్రారంభించినట్లు సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు IAS.,  తెలిపారు. సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో 9 నుండి 12 తరగతుల విద్యార్థులకు 10 ట్రేడుల్లో వృత్తి విద్యా కోర్సు అందిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మరింత నైపుణ్యంతో కూడిన విద్యను అందించడానికి ఒకేషనల్ ట్రైనర్లకు శిక్షణ ఇస్తున్నామన్నారు. తొలి …

Read More »

వేసవిలో త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలి

-ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వేసవిలో త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా పటిష్టమైన ముందస్తు చర్యలను చేపట్టాలని, అందుకు తగ్గట్టుగా వేసవి కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అదేశించినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ తెలిపారు. అందు తగ్గట్టుగా జిల్లాల వారీగా పటిష్టమైన చర్యలను చేపట్టాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆయన ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయం సి.ఎస్. సమావేశ మందిరం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్పరెన్సు నిర్వహించి …

Read More »

ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అభివృద్ధికి బాటలు వేసే బడ్జెట్ అందించిన చంద్రబాబుకు ధన్యవాదాలు : మంత్రి టీజీ భరత్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజారంజకంగా ఉందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్‌ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. బడ్జెట్‌పై మంత్రి మాట్లాడుతూ… రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా.. సూపర్ సిక్స్ హామీలను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్‌ కేటాయించడం జరిగిందన్నారు. అన్ని శాఖలకు ప్రాధాన్యత ఇస్తూ బడ్జెట్‌లో నిధులు కేటాయించారని చెప్పారు. ప్రధానంగా ఇండస్ట్రీయల్ డిపార్ట్‌మెంట్‌కు రూ.3,156 కోట్లు కేటాయించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. తమ ప్రభుత్వం …

Read More »

రాజమహేంద్రవరం రీజనల్ సైన్స్ సెంటర్ కి ‘స్వామి జ్ఞానానంద’ పేరు ప్రతిపాదన

-కేంద్ర సాంస్కృతిక శాఖకు లేఖ రాసిన రాష్ట్ర ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం విభాగం, ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు ఉమ్మడిగా రాజమహేంద్రవరంలో నిర్మాణం పూర్తి చేసుకున్న రీజనల్ సైన్స్ సెంటర్ కు ‘స్వామి జ్ఞానానంద’ పేరును రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రతిపాదించారు. ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శికి …

Read More »