Breaking News

ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అభివృద్ధికి బాటలు వేసే బడ్జెట్ అందించిన చంద్రబాబుకు ధన్యవాదాలు : మంత్రి టీజీ భరత్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజారంజకంగా ఉందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్‌ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. బడ్జెట్‌పై మంత్రి మాట్లాడుతూ… రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా.. సూపర్ సిక్స్ హామీలను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్‌ కేటాయించడం జరిగిందన్నారు. అన్ని శాఖలకు ప్రాధాన్యత ఇస్తూ బడ్జెట్‌లో నిధులు కేటాయించారని చెప్పారు. ప్రధానంగా ఇండస్ట్రీయల్ డిపార్ట్‌మెంట్‌కు రూ.3,156 కోట్లు కేటాయించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. తమ ప్రభుత్వం సంక్షేమం అందించడంతోపాటు రాష్ట్రాన్ని అభివృద్ధి పథం దిశగా ముందుకు తీసుకువెళుతుందన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు కృషి చేయడంతోపాటు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. బడ్జెట్ రూపకల్పనలో సీఎం చంద్రబాబు దార్శనికత స్పష్టంగా కనిపిస్తుంది అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *