Breaking News

Daily Archives: January 9, 2025

ఉలి చెక్కిన కల

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర చెక్క కళాకారుల వారసత్వం చెక్క మలిచే కళాకారుల పరస్పర సహకార సంస్థ ఆంధ్రప్రదేశ్ యొక్క శిల్పకళాకారుల వారసత్వాన్ని ప్రదర్శిస్తుంది. 1970లలో పి. ముని ఆచారి చే స్థాపితమైన ఈ సహకార సంఘం ఎంతో కష్టతరమైన దేవుడు మరియు దేవత విగ్రహాలు, గోడ పలకలు, ఫర్నిచర్, బొమ్మలు మరియు ఆలయ అవసరాలకు తగినట్లుగా డిజైన్ చేయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. 2016 నుంచి నాబార్డ్ మద్దతుతో, 200 నుంచి 500 మంది కళాకారులకు ఈ సమూహం పెరిగింది. …

Read More »

సత్యసాయి జిల్లాలో జరిగిన ప్రమాదంపై మంత్రి అచ్చెన్నాయుడు విచారం

-గొర్రెల కాపరి ఓబులపతికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించిన మంత్రి అచ్చెన్నాయుడు  -రహదారి ప్రమాదంలో గొర్రెల కాపరి ఓబులపతికి గాయాలు , 13 గొర్రెలు మృతి -బాధిత కుటుంబానికి నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ అమలు చేసేందుకు పరిశీలించాలని ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం కోడేకండ్ల వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గొర్రెల కాపరి ఓబులపతి తీవ్ర గాయాలవడం, 13 గొర్రెలు మృతి చెందడం పట్ల రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక శాఖామంత్రి అచ్చెన్నాయుడు …

Read More »

సోలార్ పవర్ కార్పోరేషన్ 2025 డైరీ, క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి గొట్టిపాటి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ సోలార్ పవర్ కార్పోరేషన్ 2025 డైరీ, క్యాలెండర్ ను చీఫ్ సెక్రటరీ కే. విజయానంద్ తో కలిసి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సచివాలయంలోని మూడో బ్లాక్ లోని మంత్రి ఛాంబర్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మాట్లాడారు. పునరుత్పాదక రంగానికి ఏపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. ఇందులో భాగంగానే ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ ని రూపొందించినట్లు పేర్కొన్నారు. గతంలో రాష్ట్రాన్ని …

Read More »

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు పని కల్పించడమే లక్ష్యం -సంక్రాంతికి చేనేత వస్త్రాలు ధరించుదాం : మంత్రి సవిత పిలుపు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో చేనేత కార్మికులకు ఆర్థిక భరోసా కలిగించేలా ప్రతి నెలా ఎగ్జిబిషన్లు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర చేనేత, జౌళి, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఎగ్జిబిషన్లు, ఎక్స్ పోలు నిర్వహణతో చేనేత వస్త్రాలు విక్రయాలు …

Read More »

సీఎం దార్శ‌నిక‌త‌కు నిద‌ర్శ‌నం ఆర్టీజీఎస్‌

-క్షేత్ర‌స్థాయి స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి డాటా ఎంతో ముఖ్యం -ప్ర‌భుత్వ ప‌నితీరులో ఆర్టీజీ స‌హ‌కారం ఎంతో అవ‌స‌రం -పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి నాదేండ్ల మ‌నోహ‌ర్‌ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ముందుచూపు, దార్శ‌నిక‌త‌కు రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ ఒక నిద‌ర్శ‌న‌మ‌ని రాష్ట్ర పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి నాదేండ్ల మ‌నోహ‌ర్ అన్నారు. టెక్నాలజీలో పాల‌న కొత్త పుంత‌లు తొక్కించ‌గ‌ల‌మ‌ని ఆర్టీజీఎస్ ద్వారా సీఎం నిరూపించార‌ని తెలిపారు. గురువారం ఆయ‌న స‌చివాల‌యంలోని రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ సొసైటీ ని సంద‌ర్శించారు. ఆర్టీజీఎస్ …

Read More »

కరువు సాయం నివేదికను కేంద్రానికి అందచేస్తాం- కేంద్ర బృందం

-రాష్ట్రంలో ఖరీఫ్ 2024 కరువు పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక -ఖరీఫ్ కరువు పరిస్థితులను అధ్యాయనం చేసిన కేంద్ర బృందం.. -నష్టపోయిన పంట వివరాలపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక.. -రైతులను ఆదుకోవడానికి సత్వరమే రూ.151.77 కోట్లు సాయం చేయాలి.. -ఆర్పీ సిసోడియా, స్పెషల్ సీఎస్, రెవెన్యూ శాఖ (ల్యాండ్స్, విపత్తుల నిర్వహణ, స్టాంప్స్& రిజిస్ట్రేషన్) అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఖరీఫ్ కరువు పరిస్థితులను అర్థం చేసుకుని సాయం అందించే విషయంలో ఉదారంగా స్పందించాలని రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో అధ్యాయనం చేసిన కేంద్రబృందాన్ని రెవెన్యూ …

Read More »

ఉమ్రా యాత్రకు మంత్రి ఫరూక్

-మక్కా, మదీనా ప్రార్థన మందిరాల సందర్శన అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఉమ్రా యాత్రకు బయలుదేరనున్నారు. ఈనెల 10వ తేదీ శుక్రవారం రాత్రి బయలుదేరి వెళ్లనున్నారు.ఉమ్రా యాత్రలో భాగంగా మక్కా, మదీనా ప్రార్థన మందిరాల సందర్శన అనంతరం 18వ తేదీన మంత్రి ఫరూక్ తిరిగి రానున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్రా యాత్రకు బయలుదేరుతున్న మంత్రి ఫరూక్ ను మైనార్టీ సంక్షేమ శాఖ ముఖ్య అధికారులు, ఇంకా పలువురు ముఖ్యులు అమరావతిలోని క్యాంపు …

Read More »

అధికారికంగా ఈ నెల 11 న వడ్డే ఓబన్న జయంతి వేడుకలు

-అన్ని జిల్లా కేంద్రాలతో పాటు గుంటూరు ఏ1 కన్వేన్షన్ హాల్లో రాష్ట్ర స్థాయి వేడుకలు -బీసీల సంక్షేమానికి, అభివృద్దికి అత్యధిక ప్రాధాన్యత రాష్ట్ర బి.సి.,ఇ.డబ్ల్యు.ఎస్. సంక్షేమం, చేనేత మరియు టెక్సటైల్స్ శాఖ మంత్రి ఎస్.సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామానికి ముందే దక్షిణ భారతదేశంలో బ్రిటీష్ వలస పాలకుల ఆగడాలు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా మొట్ట మొదటి స్వాతంత్ర్య పోరాటం జరిపిన రేనాటి యోధుడు వడ్డే ఓబన్న జయంతి వేడుకలను ఈ నెల 11 న రాష్ట్ర స్థాయిలోనూ మరియు …

Read More »

తిరుపతిలో తప్పు జరిగింది… క్షమించండి

-టీటీడీ ఈ.వో. శ్యామలరావు, అడిషినల్ ఈవో వెంకయ్య చౌదరి బాధ్యతల నిర్వహణలో విఫలం -అధికారులు చేసిన తప్పిదానికి ప్రభుత్వం నిందలు మోస్తోంది -మృతుల ఇళ్లకు టీటీడీ సభ్యులు వెళ్ళి క్షమాపణలు కోరాలి -టీటీడీ వ్యవహారాల్లో ప్రక్షాళన మొదలవ్వాలి… వి.ఐ.పి.లపై కాదు సామాన్యుల దర్శనాలపై దృష్టిపెట్టాలి -తిరుపతి తొక్కిసలాట ఘటన ప్రదేశం పరిశీలన… క్షతగాత్రులకు పరామర్శ అనంతరం మీడియాతో మాట్లాడినా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్  తిరుప‌తి, నేటి పత్రిక ప్రజావార్త : వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా తిరుపతిలో చోటుచేసుకున్న …

Read More »

తిరుప‌తి ఘ‌ట‌న నా మ‌న‌సును క‌ల‌చివేసింది…

– శ్రీ వేంక‌టేశ్వ‌రుని స‌న్నిధిలో ఎలాంటి అప‌శ్రుతీ జ‌ర‌క్కూడ‌దు.. – తిరుమ‌ల‌ను ప‌విత్ర‌మైన దివ్య‌క్షేత్రంగా ఎప్పుడూ నిల‌బెట్టాల‌న్న‌దే నా త‌ప‌న‌ – తిరుమ‌ల ప‌విత్ర‌త‌ను కాపాడే బాధ్య‌త నాది – భ‌విష్య‌త్తులో ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా స‌రైన నిర్ణ‌యాలు – ఘ‌ట‌నపై న్యాయ విచార‌ణ జ‌రిపిస్తాం – మృతుల కుటుంబాల‌కు రూ. 25 ల‌క్ష‌లు చొప్పున ఆర్థిక స‌హాయం – కాంట్రాక్టు ఉద్యోగాలూ ఇచ్చి అన్నివిధాలా ఆదుకుంటాం – తిరుమ‌ల ప‌విత్ర‌త‌ను కాపాడాల్సిన బాధ్య‌త ప్ర‌తిఒక్క‌రిపైనా ఉంది – మీడియాతో రాష్ట్ర ముఖ్య‌మంత్రి …

Read More »