అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 26వతేది ఆదివారం 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు జరగనున్న నేపధ్యంలో రాష్ట్ర అసెంబ్లీ మరియు సచివాలయ భవనాలను విద్యుత్ దీపాలతో అత్యంత సర్వాంగ సుందరంగా అలంకరించడంతో ఆభవనాలన్నీ విద్యుత్ వెలుగులు విరజిమ్ముతున్నాయి.ముఖ్యంగా సచివాలయం ప్రధాన ప్రవేశ మార్గానికి సమీపంలో గల సచివాయ ఐదవ భవనాన్ని మువ్వన్నెల జాతీయ జెండా నమూనా రంగులతో కూడిన విద్యుత్ దీపాలతో అలంకరించడంతో ఆభవనం అత్యంత ఆకర్షణీయంగా జాతీయత ఉట్టిపడేలా చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. రాష్ట్ర అసెంబ్లీ భవనంతో పాటు …
Read More »Daily Archives: January 24, 2025
దావోస్ ప్రతిపాదనలు ముందుకు తీసుకెళ్లడంపై సీఎం చంద్రబాబు ఫోకస్
-దావోస్ చర్చలతో త్వరలో రాష్ట్రానికి దిగ్గజ సంస్థల సీఈఓలు, ప్రతినిధులు -పెట్టుబడుల చర్చలు కార్యరూపం దాల్చేలా ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని అధికారులకు సీఎం ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దావోస్ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రపంచ ఆర్థిక సదస్సులో ఆయా సంస్థలతో జరిగిన చర్చలు, ప్రతిపాదనలు కార్యరూపం దాల్చడంపై దృష్టి పెట్టారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ఉండవల్లి నివాసానికి చేరుకన్న చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, సీఎంఓ అధికారులతో దావోస్ పర్యటనపై చర్చించారు. …
Read More »కడప రవాణా శాఖలో కీచక అధికారి పై మంత్రి వేటు..
-బాధిత మహిళలకు అండగా ఉంటాం..మంత్రి రాంప్రసాద్ రెడ్డి -రవాణా శాఖకు కీర్తి తెచ్చేలా విధులు నిర్వహించాలని ఉద్యోగులకు మంత్రి హితవు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉన్నత అధికారై ఉండి అసభ్య కార్యకలాపాలకు పాల్పడుతూ మహిళా ఉద్యోగుల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడటంపై రవాణా శాఖ మంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేసారు. ఈ రోజు వార్త పత్రికలలో సదరు అధికారి దుష్ప్రవర్తనపై వచ్చిన వార్త దురదృష్టకరమని తెలుపుతూ, మంత్రి ఈ సంఘటనను తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై సదరు ఉన్నత అధికారిని …
Read More »ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి స్వాగతం పలికిన మంత్రి కందుల దుర్గేష్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దావోస్ పర్యటనను విజయవంతంగా ముగించుకొని కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్ పోర్టు చేరుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఘన స్వాగతం పలికారు. ప్రపంచ పెట్టుబడుల సదస్సుకు వేదికైన దావోస్ లో పదుల సంఖ్యలో దిగ్గజ కంపెనీలు, యాజమాన్యాలతో భేటీ అయి రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న విస్తృత అవకాశాలపై తమదైన వాణి వినిపించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి, ఆయన బృందం చేసిన ప్రయత్నాలు …
Read More »ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఘన స్వాగతం పలికిన మంత్రి కొల్లు రవీంద్ర
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దావోస్ పర్యటన విజయవంతంగా ముగించుకొని వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి మంత్రి కొల్లు రవీంద్ర ఘన స్వాగతం పలికారు. వేలకోట్ల పెట్టుబడులు, పదుల సంఖ్యలో పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందాలు కుదుర్చుకుని రాష్ట్రానికి చేరుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఘన స్వాగతం పలికారు. గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. రాష్ట్రంలో …
Read More »ఏపీ హైకోర్టులో ఇద్దరు అదనపు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం
-ఇద్దరు అదనపు జడ్జిలతో ప్రమాణం చేయించిన సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో కొత్తగా నియమితులైన ఇద్దరు అదనపు న్యాయమూర్తులు శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. జస్టిస్ అవధానం హరిహరనాథ శర్మ, జస్టిస్ డా.యడవల్లి లక్ష్మణరావు తో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించారు. అదనపు న్యాయమూర్తులుగా వీరిరువు శుక్రవారం బాధ్యలు చేపట్టడంతో హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 30 కి చేరింది. వీరిరువురిని పదోన్నతిపై హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని కోరుతూ …
Read More »జాతీయ ఓటర్ల దినోత్సవ ప్రతిజ్ణ చేయించిన ముఖ్య కార్యదర్శి ఎంకె మీనా
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఓటు హక్కు వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు భారత ఎన్నికల సంఘం ప్రతి ఏటా జనవరి 25వ తేదీన దేశవ్యాప్తంగా జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతోంది.ఈనెల 25వ తేదీ రాష్ట్ర సచివాలయానికి సెలవు దినమైనందున ఒకరోజు ముందుగానే ఈ15వ జాతీయ ఓటర్ల దినోత్సవ ఓటర్ల ప్రతిజ్ణ కార్యక్రమాన్ని శుక్రవారం రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాకు వద్ద సచివాలయ ఉద్యోగులతో సాధారణ పరిపాలన శాఖ(పొలిటికల్)ముఖ్య కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా జాతీయ ఓటర్ల దినోత్సవ ప్రతిజ్ణ చేయించారు.ఈసందర్భంగా …
Read More »సాయుధ దళాల పతాక నిధి సేకరణలో జిల్లా మూడవ స్థానం
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : సాయుధ దళాల పతాక నిధి సేకరణలో కృష్ణాజిల్లా రాష్ట్రంలోనే మూడో స్థానంలో నిలిచిందని జిల్లా సైనిక్ వెల్ఫేర్ అధికారి సర్జన్ లెఫ్ట్నెంట్ కల్నల్ డాక్టర్ కే. కళ్యాణ వీణ శుక్రవారం తెలిపారు. ఇందుకు సంబంధించి డిసెంబర్లో రాష్ట్ర గవర్నర్ గారి చేతుల మీదుగా మెమెంటో తీసుకోవలసి ఉండగా, అనివార్య కారణాలవల్ల ఆ కార్యక్రమం రద్దు కావడంతో, ఆ మెమెంటోను శుక్రవారం కలెక్టరేట్లో జిల్లాకలెక్టర్ డీకే బాలాజీ ని కలిసి జిల్లా సైనిక్ వెల్ఫేర్ అధికారి అందజేశారు. ఈ …
Read More »మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సమావేశం
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (MUDA) సమావేశం ముడా చైర్మన్ మట్టా ప్రసాద్ అధ్యక్షతన, కో- చైర్మన్ జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ లతో కలెక్టరేట్లో శుక్రవారం జరిగింది. ముడా పరిధిలో లేఅవుట్లకు ముడా నుండి నిబంధనల మేరకు తగిన అనుమతులు తప్పనిసరిగా పొందాలని, ముడా పరిధిలోని గ్రామాల్లో భవన నిర్మాణాలకు ఆన్లైన్ ద్వారా ముడా అనుమతులు పొందాలని, ముడా పరిపాలన భవనాన్ని నిర్మించేందుకు అవసరమైన స్థలం కేటాయించాలని సమావేశంలో తీర్మానించారు. …
Read More »కోడూరు మండలంలో పర్యటించిన జిల్లా కలెక్టర్
కోడూరు, నేటి పత్రిక ప్రజావార్త : శుక్రవారం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కోడూరు మండలంలో పర్యటించి మండలంలోని ఉల్లిపాలెంలో అంగన్వాడీ కేంద్రం, మండలపరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, కోడూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొదటగా జిల్లా కలెక్టర్ ఉల్లిపాలెంలో అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి పిల్లల హాజరు, బరువును నమోదు చేసే రిజిస్టర్లు, అదేవిధంగా పిల్లలకు పెడుతున్న మెనూపై ఆరా తీసి నాణ్యతను పరిశీలించారు. ఈ క్రమంలో ఆయన బరువు తూచే యంత్రంపై పిల్లలను స్వయంగా ఉంచి బరువును రిజిస్టరులో నమోదు …
Read More »
Prajavartha Online Telugu News