రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : 800 మంది విద్యార్థులు / బూత్ స్థాయి అధికారులు, గ్రామ రెవెన్యు అధికారులతో ర్యాలీ పనిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 10.30 నుండి 10.50 వరకు సాంస్కృతిక కార్యక్రమాలు, జిల్లా ఎన్నికల అధికారి, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు సందేశం, తదుపరి సీనియర్ సిటిజన్స్ / ట్రాన్స్జెండర్ / పిడబ్ల్యుడి ఓటర్లకు సన్మానం కార్యక్రమం నిర్వహించ నున్నట్లు తెలిపారు. వ్యాస రచన / డిబేట్ విజేతలకు సర్టిఫికెట్ల ప్రథాన కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. స్ధానిక ఎస్ కే వీ …
Read More »Daily Archives: January 24, 2025
వెంకట్రామయ్యనగర్ లోని ఇన్ డోర్ స్టేడియంను సత్వరమే పూర్తి చేసి అందుబాటులోకి తీసుకు రావాలి
-అమృత్ పధకంలో నిర్మిస్తున్న ఎస్.టి.పి. పనులు వేగవంతం చేయాలి -మురుగునీటి శుద్ధి నాణ్యతను నిరంతరం పర్యవేక్షణ చెయ్యాల్సి -కమీషనర్ కేతన గార్గ్ కలిసి క్షేత్ర స్థాయిలో తనిఖీలు -జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి, రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : వెంకట్రామయ్యనగర్ లోని ఇన్ డోరు స్టేడియంను సత్వరమే పూర్తి చేసి ప్రజలకు వినియోగములోకి తీసుకురావాలని , ద్రవ వ్యర్థ పదార్థాల సివరేజ్ ప్లాంట్ నిర్వహణ విషయంలో నిరంతర పర్యవేక్షణా తప్పనిసరి అని జిల్లా కలెక్టరు. పి. ప్రశాంతి నగరపాలక సంస్థ ఇంజనీరింగు విభాగము అధికారులను …
Read More »ప్రశాంతంగా మెయిన్స్ మూడోవ రోజు పరీక్షల నిర్వహణ
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : 2025 జనవరి 24 న మెయిన్స్ మూడోవ రోజు పరీక్షల నిర్వహణను అత్యంత పకడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహించడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి గురువారం ఒక ప్రకటనలో తెలియచేసారు. జె ఈ ఈ మెయిన్ -2025 పరీక్షలు ION డిజిటల్ జోన్ IDZ లూథర్గిరి, రాజీవ్ గాంధీ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, లూథర్గిరి, రాజమహేంద్రవరం నందు మూడో రోజూ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించడం జరిగింది. జె ఈ ఈ మెయిన్స్ పరీక్ష లకి హాజరయ్యే …
Read More »చారిత్రక సంపద కలిగిన కందుకూరి వీరేశలింగం జన్మ గృహాన్ని పర్యటక ప్రదేశంగా అభివృద్ది చేయ్యాలి
-ఆనాటి ఘటనలు కళ్ళకి కట్టినట్టు త్రీడి ఎఫెక్టు ప్రదర్శన ఏర్పాటు చెయ్యండి -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కందుకూరి వీరేశలింగం జన్మ గృహాన్ని చారిత్రిక జ్ఞాపకాలు, ఘటనలు భవిష్యత్ తరాలకు అందించటానికి అనువుగా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అభివృద్ది చెయ్యాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. స్ధానిక వంకాయల వారి విధిలో ఉన్న సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు గారి జన్మ గృహాన్ని మునిసిపల్ కమిషనర్ కేతన గార్గ్, ఆర్కియాలజీ సహాయ సంచాలకులు తిమ్మరాజు, …
Read More »నాడు ఐటీ… నేడు పునరుత్పాదక విద్యుత్… చంద్రబాబు దార్శనికతకు నిదర్శనం
-పరిశోధనలతో.. యువత పారిశ్రామికవేత్తలుగా మారాలి -సీఎం చంద్రబాబు సంస్కరణలతోనే ఐటీ రంగం అభివృద్ధి -రాబోయే రోజుల్లో క్లీన్ ఎనర్జీదే కీలక పాత్ర -సిద్ధార్థ సేవలు మరింత విస్తరించాలి. -విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచపు ఆధునిక పోకడలను అందిపుచ్చుకుని అభివ్రుద్ధి సాధించాలంటే… ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వంటి దార్శనికత ఉన్న నేత అవసరమని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. విజయవాడలోని వీఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో ఐటీ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో …
Read More »గణతంత్ర దినోత్సవ వేడుకలకు విద్యుత్ కాంతులతో ముస్తాబైన తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : గణతంత్ర దినోత్సవం వేడుకలకు తిరుపతి జిల్లా కలెక్టరేట్ భవనం ప్రత్యేక ఆకర్షణగా త్రివర్ణ విద్యుత్ కాంతులతో ముస్తాబైంది. ఈ సందర్భంగా భవనం నలువైపులా త్రివర్ణ రంగుల కాంతులతో విరాజిల్లుతోంది. ఈ ప్రత్యేక అలంకరణ దేశభక్తిని ప్రతిబింబించేలా త్రివర్ణ పతాక రంగులతో ప్రదర్శించబడింది. కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వెలుగు కాంతులు ప్రజలను ఆకట్టుకుంటూ ఆకర్షణీయంగా ఉన్నాయి.
Read More »తిరుపతి జిల్లాలోని కల్లు గీత కార్మికులకు ఉప కులాల ప్రాతిపాదికన రిజర్వు చేయబడిన మద్యం షాపు కేటాయింపు ప్రక్రియ పారదర్శకంగా పూర్తి
-జిల్లా సంయుక్త కలెక్టర్ శుభం బన్సల్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లాలోని కల్లు గీత కార్మికులకు ఉప కులాల ప్రాతిపాదికన రిజర్వు చేయబడిన మద్యం షాపుల కేటాయింపును ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో గీత, ఉప కులాల ప్రతినిధుల సమక్షంలో పారదర్శకంగా పూర్తి చేయడమైనదని జిల్లా సంయుక్త కలెక్టర్ శుభం బన్సల్ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరం నందు ప్రభుత్వం వారు ఎక్సైజ్ శాఖ ద్వారా కల్లు గీత కార్మికులకు ఉప కులాల ( గౌడ , …
Read More »జాతీయ రహదారుల నిర్మాణం పనులను వేగవంతం చేయాలి
-భూసేకరణకు సంబంధించిన నిబంధనల ప్రకారం రైతులకు నష్ట పరిహారాన్ని అందించి సకాలంలో భూసేకరణ ప్రక్రియకు సంబంధించిన పనులను పూర్తి చేయాలి : జిల్లా కలెక్టరేట్ డా ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : నాయుడుపేట, తూర్పు కనుమూరు 6 లైన్ జాతీయ రహదారుల నిర్మాణం పనులు త్వరితగతిన పూర్తి చేయాలి అని జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. శుక్ర వారం స్తానిక కోట మండలం నందు apco క్యాంప్ కార్యాలయంలో నాయుడుపేట తూర్పు కనుపూరు 6 లైన్ జాతీయ …
Read More »బాలికల ఉన్నత పాఠశాలలో జాతీయ బాలిక దినోత్సవం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : స్త్రీ శిశు సంక్షేమ శాఖ రాస్ చైల్డ్ ఫండ్ సంయుక్త ఆధ్వర్యంలో రేణిగుంట మండలంలోని బాలికల ఉన్నత పాఠశాలలో జాతీయ బాలిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ సమావేశంలో డిసిపిఓ శివశంకర్ మాట్లాడుతూ బాలికల విద్యా బాలికలపై జరిపే దూషణలు మరియు పిల్లల రక్షణ కోసం పనిచేస్తున్నటువంటి వ్యవస్థల గురించి వివరించడం జరిగినది. ఐసిడిఎస్ సూపర్వైజర్ అనంతలక్ష్మి బాలికలు పోషకాహారంతోపాటు మంచి విద్యను అందుకున్నప్పుడే ఆరోగ్య వంతమైన సమాజానికి దోహద పడగలరని వివరించడమైనది . రాస్ …
Read More »తిరుపతిలో జాబ్ మేళా
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతిలోని ఎస్ వి సి సి డిగ్రీ కళాశాల(SVCC Degree College,Tirupati) నందు జాబ్ మేళా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, సీడ్ఆఫ్ మరియు డి ఆర్ డి ఎ సంయుక్త ఆధ్వర్యంలో ఎస్ వి సి సి డిగ్రీ కళాశాల, తిరుపతి ( SVCC Degree College,Tirupati) నందు 27-01- 2025 అనగా ఈ సోమవారం నాడు ఉదయం 9 గంటల నుంచి జాబ్ మేళా నిర్వహించబడును. జాబ్ మేళా నిర్వహించే ప్రదేశం: …
Read More »
Prajavartha Online Telugu News