-అతిక్రమిస్తే జరిమానాలు తప్పవు… -రద్దీ ప్రాంతాలలో 144వ సెక్షన్ అమల్లో వుంటుంది… -థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు సర్వం సన్నద్ధం… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కరోనా వైరస్ విజృంభణ కొంత మేరకు తగ్గినప్పటికి ప్రజలు అప్రమత్తతతో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని నిబంధనలను అతిక్రమిస్తే జరిమానాలు తప్పవని జిల్లా కలెక్టర్ జె.నివాస్ చెప్పారు. థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం ముందస్తు ప్రణాళికతో సిద్ధంగా ఉందన్నారు. కోవిడ్ – 19 కట్టడికి తీసుకున్న చర్యలు అవగాహన కార్యక్రమాల నిర్వహణ నిబంధనలు అమలు తదితర …
Read More »Telangana
ఇళ్ల లేఅవుల్లో మౌలిక సదుపాయల పనులు జూలై నెలఖారునాటికి పూర్తి చేయండి… : కలెక్టర్ జె. నివాస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో పేదలకోసం చేపట్టిన గృహనిర్మాణాలు లేఅవుట్ ల్లో మౌలిక వసతులు సదుపాయల పనులను జూలై నెలఖారునాటికి నూరు శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జె. నీవాస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇళ్ల లేఅవుట్లల్లో మౌలిక సదుపాయల కల్పన పురోగతిపై గృహనిర్మాణం ఆర్డబ్ల్యుఎస్ విద్యుత్ తదితర శాఖ అధికారులతో స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో మంగళవారం కలెక్టర్ జె.నివాస్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ ఇళ్ల లేఅవుట్లో మౌలిక సదుపాయల కల్పన పనులు జూలై …
Read More »అంబేద్కర్ స్మృతి వనం పనుల కోసం తక్షణమే కార్యాలయాలను ఖాళీ చేయండి … : కలెక్టరు జె.నివాస్..
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అంబేద్కర్ స్మృతివనం నిర్మాణ పనుల కోసం స్వరాజ్యమైదానంలో ఉన్న కార్యాలయ భవనాలను వారం రోజుల్లో ఖాళీ చేయాలని జిల్లా కలెక్టరు జె.నివాస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అంబేద్కర్ స్మృతివనం నిర్మాణపనులపై మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టరు జె. నివాస్ విజయవాడ లోని ఆయన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ స్వరాజ్య మైదానంలో అంబేద్కర్ స్మృతివనం నిర్మాణపనులను కాంట్రాక్టరుకు అప్పగించిన 14 నెలల్లో పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. నిర్మాణ పనులకు ఎటువంటి ఆటంకం …
Read More »రూ.41 వేల కోట్లు అవకతవకలు జరిగాయన్న పిఏసి ఛైర్మన్ ఆరోపణలు అవాస్తవం… : మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్
-అత్యుత్సాహం సరికాదు.. సరైన సమాచారంతో ఆరోపణలు చేస్తే బాగుంటుంది… -ప్రజలను అయోమయానికి గురిచేయడం ప్రతిపక్షాలకు తగదు… -ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాల కింద రూ. లక్ష కోట్లు ప్రజల బ్యాంకు ఖాతాలకు నేరుగా జమచేశాం… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వంలో రూ. 41 వేల కోట్ల రూపాయలు అవకతవకలు జరిగాయనే ఆరోపణలు అవాస్తవం అని ఇందుకు సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయని అవాస్తవాలను ప్రచారం చేయడం పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మనక్కు తగదని రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ …
Read More »విజయవాడ నగర అధ్యక్షుడు గా నన్ను నియమించిన పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు…
-నాకు పదవి ఇవ్వడం అంటే బలహీనవర్గాలను గుర్తించడమే… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో విజయవాడ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ విజయవాడ నగర అధ్యక్షుడు గా నన్ను నియమించిన పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు, నాకు పదవి ఇవ్వడం అంటే బలహీనవర్గాల గుర్తించడమేనని, పార్టీ కేటాయించిన పదవుల్లో 50 శాతం బిసి ఎస్సీ ముస్లింలకు కేటాయించడం హర్షణీయంమని, కమిటీల కూర్పులో మహిళలకు యువతకు పెద్ద పీట వేశారని, పార్టీ …
Read More »జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏ ఒక్క సామాజికవర్గానికి అన్యాయం జరగదు… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రభ కాలనీలోని ఎమ్మెల్యే కార్యాలయంలో శాసనసభ్యులు మల్లాది విష్ణు ని ఆంధ్రప్రదేశ్ దళిత, గిరిజన, బహుజన క్రైస్తవ ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు కలిసారు. దళితులు, గిరిజనులు ఏ మతంలోనైనా చేరే స్వేచ్ఛను కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రయత్నం చేయాలని కమిటీ సభ్యులు విన్నవించారు. 1950 లో తీసుకువచ్చిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పేరా 3ను సవరించేలా అసెంబ్లీ తీర్మానం చేయడంతో పాటు తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రపతికి పంపాలని వినతిపత్రం అందజేసారు. తమ విన్నపాన్ని ముఖ్యమంత్రి …
Read More »ప్రజాసమస్యల పరిష్కారానికే వార్డు పర్యటనలు : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగర సర్వతోముఖాభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. గుడ్ మార్నింగ్ విజయవాడ సెంట్రల్ కార్యక్రమంలో భాగంగా 64 వ డివిజన్ లో ఆయన విస్తృతంగా పర్యటించారు. స్థానిక కార్పొరేటర్ యరగొర్ల తిరుపతమ్మ తో కలిసి NSC బోస్ నగర్, కండ్రిక ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వీధులలో పారిశుద్ధ్యం …
Read More »సంక్షేమ పథకములు లబ్దిదారులకు చేరువ చేయాలి… : ప్రాజెక్ట్ అధికారి డా.జె.అరుణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద, బడుగు బలహీన వర్గ ప్రజలకు అండగా ఉండాలనే ఉదేశ్యంతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అనేక అభివృద్ధి సంక్షేమ పథకములను ప్రవేశ పెట్టి విజయవంతముగా అమలు చేస్తున్నారని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ & ప్రాజెక్ట్ ఆఫీసర్ డా.జె.అరుణ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకoగా అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకముల యొక్క పురోగతిపై మంగళవారం తుమ్మలపల్లి వారి కళాక్షేత్రం నందు ప్రాజెక్ట్ అధికారి డా.జె.అరుణ సి.డి.ఓ లు, సి.ఓ లు, సోషల్ వర్కర్స్ మరియు …
Read More »ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వ పాలన : దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా,బడుగుబలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తూ పాలన సాగిస్తోంది అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. మంగళవారం నియోజకవర్గ పరిధిలోని 5 వ డివిజన్ సున్నంబట్టీల సెంటర్ ప్రాంతంలో పర్యటించిన అవినాష్ ఇంటి ఇంటికి వెళ్లి వారి సమస్యలను, సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మార్గదర్శనం లో …
Read More »నీతి, నిజాయితీ…నిబద్దత కు మారు పేరు ఉదయలక్ష్మి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వృతి ఏది అయినా కావచ్చు, ఆర్ధిక పరిస్థితులు ఎలాగైన ఉండవచ్చు, అయితే నేమి తను నమ్ముకొన్న సిద్ధాంతం .. అన్నిటికి మించి నీతి, నిజాయితి జీవితాంతం నిలుస్తుంది…గుర్తింపు కుడా లభిస్తుంది దీనికి బి. ఉదయలక్ష్మి తార్కారణం.. భర్త వో పోలీస్ అధికారి అయినా ఏనాడు కుడా కించిత్తు గర్వం లేదుకదా .. తన ముందున్న కర్తవ్యాన్ని తోటి అధికార యంత్రాంగం ద్వారా నడిపించారు. ప్రిన్సిపల్ సెక్రెటరీ గా పనిచేసి రిటైర్డ్ అయిన బి. ఉదయలక్ష్మి ని రాష్ట్ర …
Read More »
Prajavartha Online Telugu News