మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల ఓటరుగా పేర్లను వచ్చే నవంబరు 6 వ తేదీ లోగా నమోదు చేసుకోవాలని సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ పిలుపునిచ్చారు. కృష్ణా గుంటూరు శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గానికి ఎన్నికల నేపథ్యంలో సోమవారం ఉదయం నగరంలోని కలెక్టరేట్లో ఓటర్లుగా పేరు నమోదు చేసుకొనుటకు మచిలీపట్నం ఆర్డిఓ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేశారు. సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ, జిల్లా రెవెన్యూ అధికారి కే చంద్రశేఖర రావు ప్రత్యేక కేంద్రాన్ని సందర్శించి …
Read More »Daily Archives: October 21, 2024
రాజధాని అమరావతిలో 25 అడుగుల విగ్రహం నెలకొల్పే ప్రయత్నం చేస్తాను
-శాసన సభ్యులు బొండా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఘంటసాల చైతన్య వేదిక రాష్ట్ర స్థాయి సమావేశం సోమవారం సాయంత్రం గాంధీనగర్ కౌతాపూర్ణానదం కళావేదికపై విజయవంతంగా జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిదిగా సెంట్రల్ నియోజకవర్గ శాసన సభ్యులు, టి డి పి పోలిట్బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్ర రావు మాట్లాడుతూ అమర గాయకుడు ఘంటసాల 25 అడుగుల విగ్రహాన్ని నెలకొల్పాలని, తెలుగు జాతిని జాగృత పరిచిన నందముూరి తారక రామారావు, ఘంటసాల లకు ప్రభుత్వం భారతరత్న ప్రకటించాలని, హైదరాబాద్ టాంక్ బండ్ మాదిరి …
Read More »విలువలు పాటించిన వ్యాపారి రతన్ టాటా
-ధార్మక సంస్థలకు ధారపోసిన 70 శాతం సంపాదన -ధూమ,మద్యపాన వ్యాపారానికి దూరం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఒకవ్యాపారవేత్త మరణిస్తే దేశం మొత్తం కన్నీళ్లు పెట్టడం అసాధారణం.మహోన్నుత వ్యక్తిత్వంగల రతన్ టాటా మరణం భరతమాత కన్నీరు పెట్టిందనడంలో అతిశయోక్తి లేదు. చివరివరకూ దేశభక్తి ఊపిరిగా,తాను సంపాదించిన ఆదాయంలో 70 శాతం ప్రజాశ్రేయస్సూ కు ఖర్చుపెట్టిన మహామనిషి రతన్ టాటా.వీలునామాలో కూడా వారసులకు 30 శాతం మాత్రమే ఇచ్చి మిగిలినది ట్రస్ట్ కు రాసిన వితరణశీలి.సాధారణంగా సామాన్యుల్లో అసామాన్యుడు అని అంటాం.కాని రతన్ టాటా …
Read More »క్లాప్ ఆటోలను నిలిపివేయడం సరికాదు
-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మున్సిపాలిటీలలో క్లాప్ (క్లీన్ ఆంధ్రప్రదేశ్) వాహనాలను నిలిపివేయడం సరికాదని.. ప్రభుత్వమే వాటిని నడపాలని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. చెత్త తరలించే వాహనాలు నిలిచిపోవడంతో నివాసాలలో పెద్దఎత్తున చెత్త పేరుకుపోయి ప్రజలందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో క్లాప్ కార్యక్రమం ఎంతగానో విజయవంతమైందని.. విజయవాడ నగరానికి జాతీయ స్థాయిలో అనేక అవార్డులు సైతం వచ్చినట్లు గుర్తుచేశారు. అటువంటి …
Read More »డ్రోన్ రంగంలో దిశా నిర్దేశం చేసేలా సదస్సు
-డ్రోన్ యూస్ కేసెస్ ఎన్ని చేపట్టగటమో ప్రణాళిక ఉండాలి -ఏఏ ప్రభుత్వ విభాగాల్లో ఉపయోగించవ్చో పరిశీలించండి -డ్రోన్, సీసీ కెమెరాలు, ఐఓటీ అనుసంధానం జరగాలి -సాంకేతిక యుగంలో డేటా గొప్ప ఆస్తి -డ్రోన్ కార్పొరేషన్ సమీక్షలో సీఎం చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : డ్రోన్ రంగంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడానికి దిశా నిర్దేశం చేసేలా అమరావతి డ్రోన్ సదస్సు నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సచివాలయంలో సోమవారం ఆయన డ్రోన్ కార్పొరేషన్ పై సమీక్ష నిర్వహించారు. అమరావతి డ్రోన్ …
Read More »అమరావతి డ్రోన్ సమ్మిట్కు ఏర్పాట్లు పూర్తి
-ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభం -సదస్సులో రెండు ఎంఓయూలపై సంతకాలు -దేశానికి డ్రోన్స్ రాజధానిగా ఏపీ -ముసాయిదా డ్రోన్ పాలసీ ఆవిష్కరణ -22న సాయంత్రం పున్నమీ ఘాట్లో డ్రోన్ షో -ప్రజలంతా తిలకించేలా విస్తృత ఏర్పాట్లు -కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి -రాష్ట్ర పెట్టుబడులు, మౌలికసదుపాయాల శాఖ కార్యదర్శి సురేష్ పిలుపు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రెండు రోజుల పాటు నిర్వహించే అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ఈ సదస్సును విజయవంతం …
Read More »వ్యవసాయ అధికారులతో సమీక్ష…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సంచాలకులు డిల్లీ రావు ఐఏఎస్ వారు సోమవారం రాష్ట్రము లోని అన్ని జిల్లాల వ్యవసాయ అధికారులతో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధానమైన 3 అంశములపై సమీక్ష జరిపి ,తగిన ఆదేశాలు జారీ చేశారు. ప్రధానముగా 1) ఈ పంట వివరములు – రేపటినుండి భౌతిక మరియు డిజిటల్ రసీదులు పంపిణీ 2) కేంద్రం నూతనముగా ప్రవేశ పెట్టిన జాతీయ పురుగు/తెగుళ్ల నిఘా వ్యవస్థ – NPSS పై ఆవిష్కరించిన ఆప్ APP పై …
Read More »అమరావతి నిర్మాణానికి నిధులిచ్చేందుకు ముందుకొస్తున్న సంస్థలు
-ఏపీ సీఆర్డీయేకు 11వేల కోట్ల రుణం మంజూరుకు హడ్కో అంగీకారం -ఢిల్లీలో హడ్కో అధికారులతో చర్చలు జరిపిన మంత్రి నారాయణ -ఇప్పటికే అమరావతికి 15 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు వరల్డ్ బ్యాంక్ అంగీకారం -కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో రుణాలిచ్చేందుకు ముందుకొస్తున్న బ్యాంకులు,సంస్థలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణంలో వేగంగా ముందుకు అడుగులు వేస్తున్నకూటమి ప్రభుత్వానికి అన్నీ శుభశకునాలే…అమరావతిని ప్రపంచంలోనే నెంబర్ వన్ సిటీగా రూపుదిద్దాలనుకుంటున్న సీఎం చంద్రబాబు లక్ష్యాలకు అన్ని విధాలుగా సహాయసహకారాలు అందుతున్నాయి..అమరావతి నిర్మాణం …
Read More »అతిసార బాధిత కుటుంబాల్లో భరోసా నింపిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గుర్ల పర్యటన
-క్షేత్రస్థాయిలో చంపావతి నదీ కాలుష్య పరిస్థితి స్వయంగా పరిశీలన -ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన పవన్ కళ్యాణ్ -జిల్లా అధికారులతో తాగునీటి సరఫరా మెరుగుదలపై విస్తృతంగా సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తాగునీటి సరఫరాలో జరిగిన కొన్ని లోపాల కారణంగా అతిసారం బారిన పడి ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేనున్నాననే భరోసా నింపారు. విజయనగరం జిల్లా గుర్ల గ్రామంలో ఇటీవల అతిసారం ప్రబలి పలువురు మృతి చెందారు. మరికొందరు ఆస్పత్రి పాలయ్యారు. ప్రభుత్వం తరఫున …
Read More »రుషికొండ నిర్మాణాలు పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గుర్ల పర్యటన ముగించుకొని తిరుగు ప్రయాణంలో విశాఖపట్నం విమానాశ్రయానికి వస్తూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రుషికొండపై గత ప్రభుత్వం రాజ భవంతుల తరహాలో చేసిన నిర్మాణాలను పరిశీలించారు. గత ప్రభుత్వంలో సుమారు రూ.600 కోట్లను ఖర్చు చేసి మరీ నిర్మించిన ఈ భవనాలు ఎన్నికల ముందు ఎవరూ చూడటానికి కూడా అప్పటి ప్రభుత్వం అనుమతించలేదు. ఎన్నికల ముందు విశాఖపట్నం పర్యటనలో పలుమార్లు పవన్ కళ్యాణ్ రుషికొండ ప్యాలెస్ గురించి ప్రస్తావించారు. అటుగా వస్తున్న ఉప ముఖ్యమంత్రివర్యులు …
Read More »
Prajavartha Online Telugu News