Breaking News

Daily Archives: December 14, 2024

శిశిరం చిత్రం అతి త్వరలో ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ కృష్ణ ఆర్ట్స్ బ్యానర్ పై అమిరినేని ప్రసాద్, సాదు చలపతి, కన్నెగంటి రవి, మూకిరి అనిల్ లు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తు, డాక్టర్ రావిపాటి వీరనారాయణ చిత్ర సమర్పకులుగా, వరల్డ్ రికార్డు హోల్డర్, సీనియర్ జర్నలిస్టు కనపర్తి రత్నాకర్ దర్శకత్వం వహిస్తున్న శిశిరం చిత్రం లోని పాటలు భారత దేశం లోనే ప్రముఖ ఆడియో డిస్టిబ్యూటర్స్ అయిన ఆదిత్య మ్యూజిక్ ద్వారా అతి త్వరలో విడుదల కానున్నాయని దర్శకుడు రత్నాకర్ శనివారం ప్రకటనలో తెలిపారు. ఈ …

Read More »

ఘనంగా పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం ఏర్పాట్లు

-పర్యవేక్షించిన మంత్రి కొలుసు పార్థసారథి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పొట్టి శ్రీరాములు బలిదానం చేసిన డిసెంబర్ 15 వ తేదీన ఆయన గౌరవార్థం ఆత్మార్పణ దినంగా నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.విజయవాడ లోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం లో అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ ఏర్పాట్లను సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి శనివారం పర్యవేక్షించారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం ఈ విగ్రహాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు …

Read More »

రైతులకు కనీస మద్దతు ధర కల్పించే విధంగా కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ధాన్యం సేకరణ సక్రమంగా జరగడంలేదని, రైతులకు కనీస మద్దతు ధర కల్పించడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిన్న శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ధర్నా పూర్తిగా విఫలమైందని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. శనివారం ఆయన మచిలీపట్నంలో మాట్లాడుతూ ప్రజల సంక్షేమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చేస్తున్న పనుల నుంచి రాష్ట్ర ప్రజల దృష్టిని మరల్చేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ధర్నాలని కాలయాపన చేస్తున్నారని …

Read More »

113 నీటి వినియోగదారుల ప్రాదేశిక నియోజకవర్గాలు ఎన్నిక ఏకగ్రీవం

-డిసెంబర్ 17 న ఆరు నీటి సంఘాల డిస్ర్టిబ్యూటరీ కమిటీ ఎన్నికలు -కలక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా పరిధిలో శనివారం నిర్వహించిన నీటి సంఘాల ఎన్నికలలో 113 సంఘాలు ఏకగ్రీవంగా అయినట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి శనివారం రాత్రి ఒక ప్రకటనలో తెలియచేసారు. తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని 113 ప్రాదేశిక నియోజకవర్గాలు పరిధిలోని అన్ని ఏకగ్రీవం కావడం జరిగినట్లు, డిసెంబర్ 17 మంగళవారం ఆరు నీటి సంఘాల డిస్ర్టిబ్యూటరీ కమిటీలకు ఎన్నికల …

Read More »

శ్రీ హరిపురం కాలనీ, కేతనకొండ ప్లాట్ ఓనర్స్ ధర్నా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీహరిపురం కాలనీ కేతనకొండ ప్లాట్ ఓనర్స్ న్యాయం జరగాలని, శ్రీహరిపురం కాలనీ లేఅవుట్ డెవలప్మెంట్ పనులు పూర్తి చేయించాలని, మార్ట్ గేజ్ ప్లాట్లు సభ్యులు 69 మందికి ప్లాట్లను కేటాయించి రిజిస్ట్రేషన్ పూర్తి చేయించాలని, కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వి. శ్రీనివాస్ అన్నారు. స్థానిక గాంధీనగర్ ధర్నా చౌక్ లో శనివారం ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీహరిపురం గవర్నమెంట్ ఎంప్లాయిస్ కోపరేటివ్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నావి పోతవరం ప్రెసిడెంట్ వి. శ్రీనివాస్ మాట్లాడుతూ …

Read More »

శ్రీ కనకదుర్గా అమ్మవారికి 2 లక్షలు విరాళం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైట్ ఫీల్డ్, బెంగుళూరు కు చెందిన దాత వెలుగురి కుమార్ శ్రీ అమ్మవారి దేవస్థానం నందు కానుకగా ఈ -హుండీ నిమిత్తం రూ.2,00,000/-లును ఆలయ ఈవో కె ఎస్ రామరావు ని కలిసి విరాళముగా చెక్కు రూపములో అందజేశారు. ఈ సందర్బంగా ఆలయ అధికారులు దాత కుటుంబం నకు అమ్మవారి దర్శనం కల్పించి, వేదపండితులుచే వీరికి వేదార్వచనం చేయించగా ఆలయ ఈవో అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదం మరియు చిత్రపటం అందజేశారు.

Read More »

దేదీప్యమానంగా కలశ జ్యోతి ఊరేగింపు

-43 వసంతాల కలశ జ్యోతి ఊరేగింపు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భవానీ, భావనాగమ్యా, భవారణ్య కుఠారికా భద్రప్రియా, భద్రమూర్తిః, భక్తసౌభాగ్య దాయినీ... అని లలితా సహస్ర నామములో కీర్తించిన రీతిగా భవుడైన శివుని సతీమణి భవానీ. ఆ భవానీని ధ్యానిస్తూ, కీర్తిస్తూ, పూజిస్తూ చేసే దీక్షే భవానీ దీక్ష. ఇంద్రకీలాద్రి పై కొలువున్న దుర్గా అమ్మవారిని నియమబద్ధ దీక్షతో పూజించి, అమ్మ అనుగ్రహం పొందటానికి గానూ కంచి కామకోటి పీఠాధిపతుల ఆదేశానుసారం 1981 నుండి భవానీ దీక్షలు, కలశ జ్యోతి ఊరేగింపు …

Read More »

‘కలశజ్యోతి ఊరేగింపులో సకల కళార్చన’

-శ్రీ కనకదుర్గమ్మ వారి భవానీ మండలదీక్షలను పురస్కరించుకుని కలశజ్యోతి ఊరేగింపు శనివారం సాయంత్రం శివరామనామ క్షేత్రం ప్రాంగణం సకల కళార్చనలతో శోభిల్లింది -శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో సనాతన ధర్మప్రచారం, ఆధ్యాత్మిక వ్యాప్తి కొనసాగింది విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆధ్యాత్మిక, ధార్మిక, ప్రాచీన, సంప్రదాయ కళా ప్రదర్శనల మేళవింపులో వికారాబాద్‌ అటవీ ప్రాంతానికి చెందిన గిరిజనుల కొమ్ముకోయ నృత్యం(కొమ్ము డోలు)కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్ కు చెందిన సంప్రదాయ చెండా మేళం -పంచ …

Read More »

అమ్మవారిని దర్శించుకున్న ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగవత్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ అమ్మవారి దర్శనార్థం  ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ మధుకర్ భగవత్ శనివారం ఆలయమునకు విచ్చేయగా వీరికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ సత్యనారాయణ, ఐఏఎస్ మరియు ఆలయ ఈవో కె ఎస్ రామరావు, డిప్యూటీ ఈవో ఎం రత్న రాజు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. ఈ సందర్బంగా వీరు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వీరికి వేదంపండితుల ఆలయ వేదపండితులచే …

Read More »

అభివృద్ధి పనులను నిర్దేశిత గడవు మేరకు, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పూర్తి చేయాలి…

గుంటూరు,  నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో వార్డ్ ల వారీగా చేపట్టిన అభివృద్ధి పనులను నిర్దేశిత గడవు మేరకు, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పూర్తి చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం కమిషనర్ కృష్ణ నగర్, స్తంభాల గరువు, పట్టాభిపురం ప్రాంతాల్లో పర్యటించి, అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అభివృద్ధి పనుల్లో భాగంగా చేపట్టే రోడ్ల నిర్మాణం డ్రైన్ టు డ్రైన్ చేయాలని, డ్రైన్లను …

Read More »