Breaking News
????????????????????????????????????

జిజిహెచ్ లో వెంటిలాటర్స్, ఆక్సీజన్ తదితర పరికరాలు అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకోవాలి… : కలెక్టర్ జె. నివాస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిజిహెచ్ లో నెలకు 2400 మందికి అత్యవసర వైద్యం అందిoచేందుకు అవసరమైన మందులు, మాస్కులు, అత్యవసర ఇంజెక్షన్స్, వెంటిలాటర్స్, ఆక్సీజన్ తదితర పరికరాలు అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను జిల్లా కలెక్టర్ జె. నివాస్ ఆదేశించారు. స్థానిక జి జి హెచ లో శుక్రవారం రాత్రి ఆస్పత్రి అభివృద్ధి, వైద్య సేవలు తదితర అంశాలపై కలెక్టర్ నివాస్ అధికారులతో సమీక్షించారు.ఆయన మాట్లాడుతూ నెల రోజుల పాటు ఐ సీయూ నిర్వహణ కు అవసరమైన అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. వారానికి 250 ఐ సీయూ పడకల కు,400 ఆక్సీజన్ పడకల్లో రోగులకు వైద్యం అందిచేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు.ఇందుకు ఏమి అవసరమో అవి స్పష్టం గా చెప్పాలన్నారు. తరచు ఆస్పత్రి అభివృద్ధి, వైద్య సేవలకు అవసరమైన అవసరాలను తెలుసుకొని వాటి ఏర్పాటుకు చర్యల్లో జాప్యం చేస్తే సహించేది లేదని కలెక్టర్ హెచ్చరించారు. ఆస్పత్రిలో వివిధ విభాగాల వారి అబివృద్ది పనులను ఆయన సమీక్షిస్తూ చేపట్టిన పనులు పూర్తి చేయడంపై పర్యవేక్షణ ఉండాలన్నారు. ఎప్పటికప్పుడు కోవిడ్ ను ఎదుర్కొకొనేందుకు నిధులు, మందులు,పరికరాలు వంటి గురించి వాస్తవికత అంచనాలు వేసుకోవలన్నారు.అన్ని సమకూర్చుకునేందుకు తాము సిద్ధంగా ఉన్న వాటిని వినియోగించుకోవటంలో జాప్యం చేస్తే మంచిది కాదన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్లు ఎల్.శివశంకర్, కె.మోహన్ కుమార్,ఆస్పత్రి సూపరింటెండెంట్ కె.శివశంకర్,తదితరులు పాల్గొన్నారు.

Check Also

అమరావతికి కొత్తరైల్వే లైన్‌ మంజూరును స్వాగతిస్తున్నాం

-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతికి కొత్త రైల్వే లైన్‌ మంజూరు చేస్తూ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *