Breaking News

వెంకయ్యనాయుడి మనుమడి నిశ్చితార్థ వేడుకలో చంద్రబాబు

-గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డులోని ఫంక్షన్ హాలులో నిశ్చితార్థం
-వెంకయ్య మనుమడు విష్ణు-సాయిసాత్విక నిశ్చితార్థ కార్యక్రమం
-చంద్రబాబును సాదరంగా ఆహ్వానించిన వెంకయ్యనాయుడు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి మనుమడి నిశ్చితార్థ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్‌లోని శ్రీ ఫంక్షన్ హాలులో వెంకయ్యనాయుడు మనుమడు విష్ణు-సాయిసాత్విక నిశ్చితార్ధ కార్యక్రమానికి జరిగింది. ఈ వేడుకకు హాజరైన సీఎం వారికి శుభాకాంక్షలు చెప్పారు. నిశ్చితార్థ కార్యక్రమానికి హాజరైన చంద్రబాబును వెంకయ్య సాదరంగా ఆహ్వానించారు. అంతకుముందు, అమరావతిలోని సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. అనంతరం చంద్రబాబు నేరుగా గుంటూరుకు బయలుదేరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *