అమరావతి/ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని అమరావతిలో మర్యాదపూర్వకంగా కలిసి, తూర్పు గోదావరి జిల్లాలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించడం జరిగిందనీ శాసన మండలి సభ్యులు సోము వీర్రాజు ఒక ప్రకటనలో తెలియచేసారు. ఈ సందర్భంగా తూర్పు గోదావరి జిల్లాలో నీటి పారుదల సదుపాయాల మెరుగుదల, జాతీయ రహదారుల విస్తరణ, పర్యాటక రంగ అభివృద్ధి , గృహ నిర్మాణం , పోలవరం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల అభివృద్ధి, అలాగే గండి పోచమ్మ తల్లి ఆలయ అభివృద్ధి వంటి అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందనీ తెలిపారు. సమావేశం అనంతరం ఎమ్మెల్సీ సోము వీర్రాజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు గండి పోచమ్మ తల్లి చిత్ర పటాన్ని అందజేశారు.
Prajavartha Online Telugu News