అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఐఐటీ ఖరగ్పూర్ ప్రొఫెసర్ ఎం.అమరనాథ రెడ్డి, అసోసియేట్ ప్రొఫెసర్(Transportation Engineering) డా.క్రాంతి కుమార్ కూన సోమవారం అమరావతిలో పర్యటించారు. పర్యటనలో భాగంగా రాయపూడిలోని ADCL ప్రధాన కార్యాలయంలో వారు ఇంజినీరింగ్ అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం రాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులకై అభివృద్ధి చేస్తున్న LPS జోన్లు 12, 10, 9, 5Cలను వారిరువురు సందర్శించారు. సందర్శనలో భాగంగా LPS జోన్లలో రహదారుల నిర్మాణంలో పాటిస్తున్న విధానాలు పరిశీలించారు. ఐఐటీ ఖరగ్పూర్ బృందానికి ఆయా ప్రాజెక్టుల వద్ద సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు APCRDA ఆధ్వర్యంలో అమరావతి నిర్మాణంలో అనుసరిస్తున్న సాంకేతిక విధానాలను, ఆయా LPS జోన్లలో అభివృద్ధి చేస్తున్న మౌలిక సదుపాయాలను గురించి వివరించారు.
Prajavartha Online Telugu News