విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశవ్యాప్తంగా జరుగుతున్న పేపర్ లీక్లకు నిరసనగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా ఆందోళన చేపట్టిన విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు విజయవాడ ధర్నా చౌక్లో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కోలనుకొండ శివాజీ మాట్లాడుతూ, విద్యార్థులపై పోలీసుల బలప్రయోగాన్ని తీవ్రంగా ఖండిస్తూ, పేపర్ లీక్లపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వి.గురునాధం, షేక్ ఖుర్షిదా, లక్కరాజు రామారావు, మన్నం రాజశేఖర్, అన్సారీ, పి.వై.కిరణ్, సీరం నాగమల్లేశ్వర రావు, గోళ్ళ నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News