Breaking News

“ఆడుదాం ఆంధ్ర” విజయవంతం చేయాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించబడుతున్న “ఆడుదాం ఆంధ్ర” యువజన క్రీడల టోర్నమెంట్ ను జిల్లాలో విజయవంతం చేయాలని జిల్లా కలెక్టరు డా. కే.మాధవీలత పేర్కొన్నారు. శనివారం స్థానిక జిల్లా కలెక్టరు క్యాంపు కార్యాలయమం నుంచి మండల స్థాయి అధికారులతో “ఆడుదాం ఆంధ్ర” యువజన క్రీడల టోర్నమెంట్ పై జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ సంబందిత అధికారులతో కలసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టరు సమీక్షిస్తూ జిల్లాలో అన్ని గ్రామాలు మరియు వార్డు సచివాలయాల నుండి 15 ఏళ్లు పైబడిన వయస్సు గల యువకులకు ఆడుకదాం ఆంధ్ర కార్యక్రమం పట్ల అవగాహన కల్పించాలన్నారు. టోర్నమెంట్ ఐదు వేర్వేరు దశల్లో ప్రతి గ్రామం/వార్డు సెక్రటేరియట్‌లో ఐదు పోటీ మరియు మూడు నాన్-పోటీయేతర క్రీడలలో యువతీ, యువకులకు నిర్వహించబడుతుందన్నారు. అర్హత పొందిన సచివాలయ జట్లు మండల, నియోజకవర్గం, జిల్లా స్థాయి ఆడుకుందాం ఆంధ్ర ఆటల పోటీల్లో పాల్గొని జిల్లా స్థాయలో విజేతలైన వారిని రాష్ట్ర స్థాయిలో నిర్వహించే ఫైనల్స్‌లో పోటీ పంపడం జరుగుతుందన్నారు. ఇందుకు సంబందించి ఆయా సచివాలయాల్లో పరిధిలో ప్రచారం చేపట్టాలన్నారు. క్రీడల ద్వారా యువతను భాగస్వామ్యం చేస్తుందన్నారు. కార్యక్రమానికి ఆరోగ్యకరమైన మరియు ఫిట్ జీవనశైలిని నడిపించడానికి యువతను ప్రోత్సహించాలన్నారు.
రాష్ట్రంలోని ప్రతి సచివాలయంలో పురుషులు మరియు మహిళలకు క్రింది క్రీడా పోటీలు నిర్వహించడం జరగుతుందన్నారు. క్రికెట్,యోగా,వాలీబాల్,టెన్ని-కోయిట్,కబడ్డీ,ఖో ఖో,మారథాన్,బ్యాడ్మింటన్ మరియు ఇతర సాంప్రదాయ ప్రసిద్ధ ఆటలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ పోటీలు ఐదు వేర్వేరు స్థాయిలలో నిర్వహించబడతాయని, గ్రామ సచివాలయం/వార్డు సచివాలయ స్థాయి, మండల స్థాయి, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, పైనల్ రాష్ట్ర స్థాయి నిర్వహిస్తారని పేర్కొన్నారు. 19 మండలాల్లో స్టాక్ ఫాయింట్స్ ఏర్పాటు చేసి ఇన్ఛార్జులను నియమించామన్నారు. పర్యవేక్షకులు స్పోర్ట్స్ మెటీరియల్, ప్రైజ్ మనీ, సర్టిఫికెట్లు, ట్రోఫీలు, పబ్లిసిటీ, సోషల్ మీడియా ప్రమోషన్, గ్రౌండ్ ప్రిపరేషన్, మెడికల్ కిట్లు, పి.ఇ.టి. గౌరవ వేతనం, క్రీడాకారుల టిఏ,డిఏ, రవాణా, వసతి, భోజనం, లైటింగ్, ఎల్ఈడీ స్క్రీన్‌లు, సంస్కృతి కార్యక్రమం ఆధీనంలో నిర్వహిస్తారన్నారు. 10 మంది క్రీడా వాలంటీర్ల శిక్షణను ఖరారు చేసేందుకు 19 మండలాల స్పోర్ట్స్ కో-ఆర్డినేటర్లు, 07 మంది నియోజకవర్గ స్పోర్ట్స్ కో-ఆర్డినేటర్లు, ఎజీఎఫ్ తూర్పు గోదావరి కార్యదర్శి, పీఈటీలు అసోసియేషన్ మరియు డీఎస్ఏ కోచ్‌లతో సమావేశం నిర్వహించాలన్నారు. దీపావళి షెడ్యూల్ తర్వాత నవంబరు 15 వ తేదీ నుంచి 18 వరకు నిర్వహించబడే 5 విభాగాలకు ఆఫ్‌లైన్ మరియు ఆన్‌లైన్లో క్రీడా వాలంటీర్లకు శిక్షణ ఇస్తామన్నారు. జిల్లాలో 19 మండలాలు 7 నియోజకవర్గాల్లోని 393 గ్రామ, 119 వార్డు సచివాలయాల నుంచి 512 మంది క్రీడా కారులు ఆడుదాం ఆంధ్రా క్రీడల్లో పాల్గొంటారని జిల్లా కలెక్టరు తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టరు ఎన్. తేజ్ భరత్, డిఎల్డీవో వీణాదేవి, స్పోట్స్ యంవివి శేషగిరిరావు యోగా కోచ్ దాస్, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *