Breaking News

ముగిసిన టెట్ దరఖాస్తుల స్వీకరణ

-పాఠశాల విద్య డైరెక్టర్ విజయరామరాజు.వి

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగా డీఎస్సీ నిర్వహించడానికి ముందుగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ కు నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు ఈ నెల మూడవ తేదీతో ముగిసింది. ఈ టెట్ పరీక్షలకు అధిక సంఖ్యలో 4,27,300 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. సెకండరీ గ్రేడ్ టీచర్ విభాగంలో పేపర్ 1-ఎ కు 1,82,609 మంది, సెకండరీ గ్రేడ్ టీచర్ ప్రత్యేక విద్య పేపర్ 1- బి కు 2,662 మంది దరఖాస్తు చేసుకున్నారు. స్కూల్ అసిస్టెంట్ టీచర్ విభాగంలో పేపర్ 2- ఏ లాంగ్వేజెస్ కు 64,036 మంది మాథ్స్ అండ్ సైన్స్ కు 1,04,788 మంది దరఖాస్తు చేసుకోగా సోషల్ స్టడీస్ లో70,767 మంది దరఖాస్తు చేసుకున్నారు. స్కూల్ అసిస్టెంట్ టీచర్ ప్రత్యేక విద్య పేపర్ 2- బి విభాగంలో 2438 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గతంలో నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం టెట్ పరీక్షలు నిర్వహిస్తామని అభ్యర్థులందరూ పరీక్షలకు సన్నద్ధం కావాలని పాఠశాల విద్య డైరెక్టర్ విజయరామరాజు ఒక ప్రకటనలో తెలియజేశారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *